Andhra Pradesh
oi-Syed Ahmed
దక్షిణ
మధ్య
రైల్వే
పరిధిలో
పండుగలు,
కొత్త
ఏడాది
సందర్భంగా
రైళ్లలో
ప్రయాణికుల
రద్దీ
పెరుగుతోంది.
దీంతో
ఎప్పటికప్పుడు
ప్రత్యేక
రైళ్లను
అందుబాటులోకి
తెస్తున్న
అధికారులు..
అలాగే
పలు
రైళ్ల
సమయాల్లోనూ
మార్పులు
చేర్పులు
చేస్తున్నారు.
అలాగే
కొన్ని
రైళ్లను
ఇతర
రైళ్ల
కోసం
రద్దు
చేస్తున్నారు.
ఇలాంటిదే
మరో
నిర్ణయం
ఇవాళ
తీసుకున్నారు.
దీంతో
తెలుగు
రాష్ట్రాల్లోని
పలు
స్టేషన్ల
మధ్య
రాకపోకలు
సాగించే
పలు
రైళ్లపై
ప్రభావం
పడుతోంది.
తెలంగాణలోని
చర్లపల్లి,
వికారాబాద్,
ఏపీ
లోని
నరసాపురం,
కాకినాడ
మధ్య
రాకపోకలు
సాగిస్తున్న
పలు
రైళ్లను
రద్దు
చేస్తూ
దక్షిణ
మధ్య
రైల్వే
ఇవాళ
నిర్ణయం
తీసుకుంది.
ఇందులో
ఈ
నెల
13న
నరసాపురం
నుంచి
చర్లపల్లికి
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07254
రద్దయింది.
అలాగే
ఈ
నెల
17న
చర్లపల్లి
నుంచి
నరసాపురానికి
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07233
కూడా
రద్దు
చేశారు.
వీటితో
పాటు
ఈ
నెల
19న
వికారాబాద్
నుంచి
నరసాపురానికి
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07260
కూడా
రద్దయింది.
ఈ
నెల
19న
వికారాబాద్
నుంచి
కాకినాడకు
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07287
కూడా
రద్దయింది.
దీంతో
పాటు
ఈ
నెల
20న
వికారాబాద్
నుంచి
నరసాపురానికి
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07266,
అదే
రోజు
వికారాబాద్
నుంచి
కాకినాడ
టౌన్
కు
వెళ్లాల్సిన
రైలు
నంబర్
07286
కూడా
రద్దయ్యాయి.
దీంతో
ఆయా
స్టేషన్ల
మధ్య
రాకపోకలు
సాగించే
ప్రయాణికులు
ప్రత్యామ్నాయ
రవాణా
ఏర్పాట్లు
చేసుకోవాల్సి
ఉంటుంది.
మరోవైపు
విశాఖ
నుంచి
చర్లపల్లికి
ఈ
నెల
18న
ప్రత్యేక
రైలు
ప్రకటించారు.
ఈ
రైలు
విశాఖలో
రాత్రి
11
గంటలకు
బయలుదేరి
మరుసటి
రోజు
ఉదయం
10.30కి
చర్లపల్లి
చేరుతుంది.
దీంతో
పాటు
చర్లపల్లి
నుంచి
విశాఖకు
మరో
ప్రత్యేక
రైలు
ఈ
నెల
19న
నడుపుతున్నారు.
ఇది
చర్లపల్లిలో
మధ్యాహ్నం
3.30కు
బయలుదేరి
మరుసటి
రోజు
ఉదయం
7
గంటలకు
విశాఖ
చేరుతుంది.
ఈ
రెండు
రైళ్లకు
దువ్వాడ,
అనకాపల్లి,
సామర్లకోట,
అనపర్తి,
రాజమండ్రి,
ఏలూరు,
విజయవాడ,
గుంటూరు,
మిర్యాలగూడ,
నల్గొండలో
హాల్ట్
లు
ఇచ్చారు.


