Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
వేగంగా
అభివృద్ధి
చెందుతున్న
నగరంగా
పేరు
తెచ్చుకుంటున్న
విశాఖకు
కేంద్రం
మరో
గుడ్
న్యూస్
చెప్పింది.
ఇప్పటికే
ఐటీ
సంస్థలు,
డేటా
సెంటర్ల
రాకతో
జోష్
మీదున్న
విశాఖతో
పాటు
ఉత్తరాంధ్ర
జనానికి
ప్రయోజనం
కల్పించేలా
ఓ
కీలక
సంస్థను
ఏర్పాటు
చేసేందుకు
సిద్దమవుతోంది.
ఈ
మేరకు
సైలెంట్
గా
భూసేకరణ
కూడా
పూర్తి
చేసినట్లు
తెలుస్తోంది.
అన్నీ
అనుకున్నట్లు
జరిగితే
త్వరలోనే
అధికారికంగా
దీనిపై
ప్రకటన
వెలువడనుంది.
విశాఖలో
కేంద్ర
హోంశాఖ
పరిధిలో
పనిచేసే
బ్యూరో
ఆఫ్
ఇమ్మిగ్రేషన్
(బీవోఐ)
ఆఫీసు
ఏర్పాటు
చేసేందుకు
కేంద్రం
ప్రయత్నాలు
చేస్తోంది.
విశాఖతో
పాటు
ఉత్తరాంధ్ర
ప్రాంతాల
నుంచి
విదేశీ
ప్రయాణాలు
చేసే
వారికి
ఇమ్మిగ్రేషన్
సహకారం
అందించేందుకు
వీలుగా
ఈ
కార్యాలయాన్ని
ఇక్కడ
ఏర్పాటు
చేయబోతున్నారు.
ఇప్పటికే
విశాఖ
నుంచి
భోగాపురానికి
ఎయిర్
పోర్టును
తరలించేందుకు
వీలుగా
జరుగుతున్న
ప్రయత్నాలకు
కొనసాగింపుగా
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
ఇప్పటివరకూ
విశాఖతో
పాటు
ఉత్తరాంధ్ర
ప్రజలు
విదేశాలకు
వెళ్లేందుకు
ఇమ్మిగ్రేషన్
సేవల
కోసం
హైదరాబాద్
లేదా
చెన్నై
వెళ్లాల్సి
వస్తోంది.
విశాఖలో
ఇప్పుడు
బ్యూరో
ఆఫ్
ఇమ్మిగ్రేషన్
కార్యాలయం
ఏర్పాటైతే
ఆ
ఇబ్బందులు
తప్పుతాయి.
సమయం
కూడా
ఆదా
అవుతుంది.
భోగాపురం
ఎయిర్
పోర్టు
ప్రారంభమయ్యాక
సాధారణ
ప్రయాణికులతో
పాటు
విదేశీ
విమానాల
రాక,
కార్గో
సేవలు
విస్తరించే
అవకాశాలున్నాయి.
ఈ
నేపథ్యంలోనే
ఈ
కొత్త
కార్యాలయం
ఏర్పాటుకు
అడుగులు
పడుతున్నట్లు
తెలుస్తోంది.
ప్రస్తుతం
సిబ్బంది
కొరత,
సరైన
పర్యవేక్షణ
లేకపోవడం
వల్ల
తగిన
స్ధాయిలో
ఇమ్మిగ్రేషన్
తనిఖీలు
చేయట్లేదు.
అందువల్ల,
ఇమ్మిగ్రేషన్
తనిఖీలను
నిర్వహించడానికి
వైజాగ్లో
ఇమ్మిగ్రేషన్
బ్యూరో
కోసం
ఒక
ప్రత్యేక
కార్యాలయాన్ని
ఏర్పాటు
చేయాలని
హోం
మంత్రిత్వ
శాఖ
నిర్ణయించింది.
వైజాగ్
శివార్లలోని
మరికవలస
ఓజోన్
లేఅవుట్
సమీపంలో
వీఎంఆర్డీయేకి
సంబంధించిన
ప్రాంతంలో
ఈ
ఆఫీసు
ఏర్పాటు
చేయబోతున్నారు.


