India
oi-Bomma Shivakumar
ఇటీవల
విమాన
ప్రమాదాలు
తరచుగా
జరుగుతున్న
విషయం
తెలిసిందే.
అయితే
తాజాగా
ముంబైలోని
ఛత్రపతి
శివాజీ
మహారాజ్
అంతర్జాతీయ
విమానాశ్రయంలో
షాకింగ్
ఘటన
జరిగింది.
ఇండిగో,
ఎయిరిండియా
సంస్థలకు
చెందిన
రెండు
ప్యాసింజర్
విమానాలు
ఢీకొన్నాయి.
ఈ
రెండు
ప్యాసింజర్
విమానాల
రెక్కలు
ఒకదాన్నొకటి
స్వల్పంగా
ఢీ
కొన్నాయి.
కోయంబత్తూరుకు
బయల్దేరిన
ఎయిరిండియా
విమానం
AI
2732,
HYD
నుంచి
ల్యాండ్
అయిన
ఇండిగో
6E
791
విమానాల
మధ్య
ఈ
ఘటన
జరిగింది.
ముంబై
అంతర్జాతీయ
విమానాశ్రయంలో
షాకింగ్
ఘటన
జరిగింది.
ఘోర
ప్రమాదం
తృటిలో
తప్పింది.
రెండు
ప్యాసింజర్
విమానాలు
ఒకదాన్నొకటి
స్వల్పంగా
ఢీ
కొనడం
కలకలం
రేపుతోంది.
హైదరాబాద్
నుంచి
ముంబై
కు
వచ్చిన
ఇండిగో
విమానం
(6E
791),
ముంబై
నుంచి
కోయంబత్తూర్
వెళ్లడానికి
సిద్ధంగా
ఉన్న
ఎయిర్
ఇండియా
విమానం
(AI
2732)
ఒకదాన్నొకటి
ఢీ
కొన్నాయి.
ఈ
రెండు
ప్యాసింజర్
విమానాల
రెక్కలు
స్వల్పంగా
ఢీకొన్నాయి.
ప్రమాద
సమయంలో
రెండు
ప్యాసింజర్
విమానాల్లోనూ
ప్రయాణికులు
ఉన్నారు.
పెను
ప్రమాదం
తృటిలో
తప్పడంతో
ప్రయాణికులు,
ఎయిర్
పోర్టు
సిబ్బంది
ఊపిరి
పీల్చుకున్నారు.
ఘటన
అనంతరం
అధికారులు
మాట్లాడుతూ..
అదృష్టవశాత్తూ
ఈ
ప్రమాదంలో
ప్రయాణీకులకు
గానీ,
విమాన
సిబ్బందికి
గానీ
ఎటువంటి
గాయాలు
కాలేదని..
అందరూ
క్షేమంగా
ఉన్నట్లు
తెలిపారు.
అయితే
ఇటీవలి
కాలంలో
వరుసగా
విమాన
ప్రమాదాలు
జరుగుతున్నా
సంస్థల
నిర్లక్ష్య
వైఖరిపై
విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
ఇక
గతేడాది
ఎయిర్
ఇండియా
విమాన
ప్రమాదంలో
దాదాపు
260
మందికిపైగా
ప్రయాణికులు
మృతి
చెందిన
విషయం
తెలిసిందే.
అలాగే
ఇటీవల
జరిగిన
విమాన
ప్రమాదంలో
మహారాష్ట్ర
డిప్యూటీ
సీఎం
అజిత్
పవార్
మృతి
చెందిన
విషయం
తెలిసిందే.


