India
oi-Sai Chaitanya
ప్రముఖ
ఆధ్యాత్మిక
ప్రాంతం
షిర్డీ
భక్తులతో
రద్దీగా
ఉంది.
కొత్త
సంవత్సరం
వేళ
షిర్డీ
సాయిబాబా
ను
దర్శించుకునేందుకు
భక్తులు
పెద్ద
సంఖ్యలో
తరలి
వచ్చారు.
బాబా
సమాధిని
దర్శించుకుని,
తమ
మొక్కులు
చెల్లించుకున్నారు.
చాలా
మంది
భక్తులు
తమ
స్థోమతకు
తగ్గట్టుగా
విరాళాలు
సమర్పించారు.
అందులో
భాగంగా
ఒక
భక్తుడు
సమర్పించిన
బంగారం..
వజ్రాల
కిరీటం
అందరినీ
ఆకట్టుకుంటోంది.
భక్తుల
రద్దీతో
సాయినాధుని
నామస్మరణతో
ఆ
ప్రాంతమంతా
మార్మోగిపోయింది.
షిర్డీ
సాయినాధుని
దర్శనం
కోసం
దేశ
విదేశాల
నుంచి
భక్తులు
పెద్ద
సంఖ్యలో
వచ్చారు.
ఈ
సమయంలో
బాబాకు
హరియాణాకు
చెందిన
ఓ
సాయి
భక్తుడు
కళ్లు
చెదిరే
కానుకను
సమర్పించారు.
సాయిబాబా
పైన
తన
భక్తిని
చాటుకున్నాడు.
ఏకంగా
రూ.80
లక్షల
విలువైన
బంగారు,
వజ్రాల
కిరీటాన్ని
బాబా
పాదాల
చెంత
ఉంచారు.
నూతన
సంవత్సర
కానుకగా
సమర్పించిన
ఈ
కిరీటం
ఇప్పుడు
అందరి
దృష్టిని
ఆకర్షిస్తోంది.
దాని
అందం,
అందులో
పొదిగిన
వజ్రాల
మెరుపులు
చూసి
భక్తులు
ఆశ్చర్యపోతున్నారు.
ఫరీదాబాద్కు
చెందిన
ప్రదీప్
మొహంతి
తన
కుటుంబంతో
కలిసి
కొత్త
సంవత్సరం
సందర్భంగా
శిర్డీకి
వచ్చారు.
గురువారం
రాత్రి
ఆయన
సాయిబాబా
సమాధిని
దర్శించుకున్నారు.
బాబాపై
తనకున్న
నమ్మకానికి
గుర్తుగా
ఏదైనా
ప్రత్యేకంగా
ఇవ్వాలనుకున్నారు.
అందుకే
ఎంతో
విలువైన,
అద్భుతమైన
డిజైన్తో
కూడిన
కిరీటాన్ని
చేయించారు.
దర్శనం
అనంతరం
బాబా
సమాధి
వద్ద
పూజలు
చేసి
ఈ
కిరీటాన్ని
సమర్పించారు.
ఈ
కిరీటం
ప్రత్యేకత
లను
సాయిబాబా
సంస్థాన్
వెల్లడించింది.
ఈ
కిరీటం
మొత్తం
బరువు
655
గ్రాములు.
ఇందులో
585
గ్రాముల
స్వచ్ఛమైన
బంగారాన్ని
ఉపయోగించారు.
కిరీటాన్ని
మరింత
అందంగా
తీర్చి
దిద్దేందుకు
ఏకంగా
153
క్యారెట్ల
విలువైన
వజ్రాలను
పొదిగారు.
ఈ
వజ్రాల
మెరుపులతో
కిరీటం
దగదగా
మెరిసిపోతోంది.
దీని
మొత్తం
విలువ
సుమారు
రూ.80
లక్షలు
ఉంటుందని
అంచనా
వేశారు.
కిరీటం
డిజైన్
చాలా
సంక్లిష్టంగా,
కళాత్మకంగా
ఉంది.
కొద్దిసేపు
ఈ
వజ్రాల
కిరీటాన్ని
సాయిబాబా
విగ్రహానికి
అలంకరించారు.
ఆ
సమయంలో
బాబా
రూపు
మరింత
తేజోవంతంగా
కనిపించింది.
అనంతరం
శాస్త్రోక్తంగా
పూజలు
నిర్వహించారు.


