India
oi-Lingareddy Gajjala
సంక్రాంతి
సంబరాలు
జోరుగా
జరుగుతున్నాయి.
పల్లెటూరులన్నీ
కళకళలాడుతున్నాయి.
ఎటు
చూసినా
కోలాహలమే.
సంక్రాంతి
సమయంలో
గాలి
పటాలది
ప్రత్యేకమైన
స్థానం.
చిన్నా
పెద్దా
అంతా
చేపి
పోటీ
పడి
మరి
పతంగులు
ఎగురవేస్తాం.
దీనికి
దేశ
ప్రధాని
మోదీ
కూడా
మినహాఇంపు
కాదు.
ఆయన
కూడా
ఈ
సారి
సంక్రాంతి
సంబరాల్లో
పాల్గొన్నారు.
అంతే
కాదు
సరదాగా
గాలి
పటం
కూడా
ఎగరేశారు.
ప్రధాని
రేంజ్
కు
చిన్న
గాలిపటం
ఎగురవేస్తే
ఏం
బాగుంటుంది..
అందుకే
ఆయన
స్టైల్లో
ఆయన
రంగంలోకి
దిగారు.
అహ్మదాబాద్లోని
సబర్మతి
రివర్ఫ్రంట్
వేదికగా
జరిగిన
ఇంటర్నేషనల్
కైట్
ఫెస్టివల్-2026లో
ఓ
అరుదైన
దృశ్యం
దేశవ్యాప్తంగా
ఆకర్షణగా
మారింది.
భారత
ప్రధాని
నరేంద్ర
మోదీతో
పాటు
జర్మనీ
ఛాన్సలర్
ఫ్రెడ్రిచ్
మెర్జ్
కలిసి
గాలిపటం
ఎగరేశారు.
ప్రత్యేకంగా
భగవాన్
హనుమంతుడి
చిత్రంతో
రూపొందించిన
గాలిపటం
ఆకాశంలోకి
ఎగరడం
ఈ
కార్యక్రమానికి
మరింత
ప్రత్యేకతను
తీసుకొచ్చింది.
భారతీయ
సంప్రదాయం,
సంస్కృతిని
ప్రపంచానికి
పరిచయం
చేసే
ఉద్దేశంతో
ప్రతి
ఏడాది
నిర్వహించే
అంతర్జాతీయ
గాలిపటాల
పండుగకు
ఈసారి
అంతర్జాతీయ
ప్రాధాన్యం
మరింత
పెరిగింది.
జర్మన్
ఛాన్సలర్
ఆహ్వానాన్ని
స్వీకరించి
ఈ
కార్యక్రమానికి
హాజరవడం
ద్వారా
భారత్-జర్మనీ
మధ్య
సాంస్కృతిక
అనుబంధాన్ని
మరింత
బలోపేతం
చేసినట్టయింది.
ప్రధాని
మోదీ,
ఛాన్సలర్
మెర్జ్
ఇద్దరూ
కలిసి
హనుమంతుడి
ప్రతీకతో
ఉన్న
గాలిపటాన్ని
ఎగరేసి,
“సంస్కృతి,
సంప్రదాయాలు
దేశాల
మధ్య
స్నేహానికి
వంతెనలు”
అన్న
సందేశాన్ని
స్పష్టంగా
ఇచ్చారు.
#WATCH
|
Ahmedabad,
Gujarat:
Prime
Minister
Narendra
Modi
and
German
Chancellor
Friedrich
Merz
fly
a
kite
at
the
International
Kite
Festival
2026
at
Sabarmati
Riverfront.(Source:
DD
News)
pic.twitter.com/YF4Va86IXj—
ANI
(@ANI)
January
12,
2026
ఈ
సందర్భంగా
ప్రధాని
మోదీ
మాట్లాడుతూ,
గాలిపటాల
పండుగ
కేవలం
వినోదం
మాత్రమే
కాదని,
ఇది
భారతదేశంలోని
ఐక్యత,
ఆనందం,
ఆశలను
ప్రతిబింబించే
వేడుక
అని
అన్నారు.
ప్రపంచం
నలుమూలల
నుంచి
వచ్చిన
కళాకారులు,
పర్యాటకులు
ఈ
వేడుకలో
పాల్గొనడం
భారత్
యొక్క
సాఫ్ట్
పవర్ను
ప్రతిఫలిస్తోందని
పేర్కొన్నారు.
హనుమంతుడి
గాలిపటం
శక్తి,
ధైర్యం,
భక్తికి
ప్రతీకగా
నిలుస్తుందని
వివరించారు.
జర్మన్
ఛాన్సలర్
ఫ్రెడ్రిచ్
మెర్జ్
కూడా
ఈ
అనుభవం
తనకు
ప్రత్యేకమని
తెలిపారు.
భారతీయ
పండుగల్లో
దాగి
ఉన్న
సాంస్కృతిక
లోతు,
ప్రజల
ఉత్సాహం
తనను
ఎంతగానో
ఆకట్టుకున్నాయని
అన్నారు.
గాలిపటం
ఎగరేయడం
ద్వారా
భారత
సంప్రదాయంలో
భాగమవడం
గర్వంగా
ఉందని
చెప్పారు.
సబర్మతి
రివర్ఫ్రంట్
మొత్తం
రంగురంగుల
గాలిపటాలతో
కళకళలాడింది.
వివిధ
దేశాల
నుంచి
వచ్చిన
ప్రతినిధులు
తమ
దేశాలకు
చెందిన
ప్రత్యేక
డిజైన్లతో
గాలిపటాలను
ఎగరేశారు.
అయితే
ప్రధాని
మోదీ-జర్మన్
ఛాన్సలర్
కలిసి
ఎగరేసిన
హనుమంతుడి
గాలిపటం
మాత్రం
ఈ
వేడుకకు
హైలైట్గా
నిలిచింది.
ఈ
దృశ్యం
భారత్-జర్మనీ
మధ్య
పెరుగుతున్న
స్నేహానికి,
సాంస్కృతిక
దౌత్యానికి
ప్రతీకగా
నిలిచిందని
రాజకీయ,
సాంస్కృతిక
వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి.
సంప్రదాయం,
అంతర్జాతీయ
స్నేహం
కలిసిన
ఈ
ఘట్టం
ఇంటర్నేషనల్
కైట్
ఫెస్టివల్
2026ను
మరింత
గుర్తుండిపోయేలా
చేసింది.


