Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ
ప్రభుత్వం
మరో
కీలక
నిర్ణయం
తీసుకుంది.
ప్రధాన
నియామక
ప్రక్రియ
దాదాపు
పూర్తి
చేసింది.
కూటమి
ప్రభుత్వం
ఏర్పడిన
తరువాత
సమాచార
హక్కు
కమిషనర్ల
నియామకం
పైన
సుదీర్ఘంగా
కసరత్తు
చేసారు.
అయితే,
వీరి
ఎంపికకు
సంబంధించి
కమిటీ
అధికారికంగా
ఖరారు
చేయాల్సి
ఉంది.
గవర్నర్
కు
వీరి
పేర్లు
సిఫారసు
ద్వారా
వీరి
నియామకం
అధికారికం
కానుంది.
కాగా,
ఈ
జాబితా
పైన
చంద్రబాబు
అనేక
చర్చల
తరువాత
తుది
నిర్ణయానికి
వచ్చినట్లు
తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
సమాచార
హక్కు
కమిషనర్ల
నియామక
ప్రక్రియ
దాదాపు
పూర్తయ్యింది.
సమాచార
హక్కు
(ఆర్టీఐ)
కమిషనర్ల
నియామకంపై
కసరత్తు
కొలిక్కి
వచ్చినట్లు
సమాచారం.
ఈ
నియామకాలపై
సీఎం
చంద్రబాబు
టీడీపీ
నాయకులతో
ఇప్పటికే
ఒక
దఫా
చర్చలు
జరిపినట్లు
సమాచారం.
ప్రధాన
కమిషనర్(చీఫ్
ఇన్ఫరేషన్
కమిషనర్)గా
ప్రముఖ
న్యాయవాది
వజ్జా
శ్రీనివాస
రావు
పేరును
పరిశీలిస్తున్నట్లు
తెలిసింది.
ప్రస్తుతం
ఆర్టీఐలో
ముగ్గురు
కమిషనర్లు
ఉండగా
మరో
ఐదుగురిని
నియమించాలని
నిర్ణయించారు.
ఆ
ఐదుగురిలో
ముగ్గురి
పేర్లు
దాదాఫు
ఖరారైనట్లు
సమాచారం.
వీరందరూ
న్యాయవాదులే.
కడపకు
చెందిన
రవి
యాదవ్,
అనంతపురానికి
చెందిన
ఆదెన్న,
విశాఖకు
చెందిన
పీఎస్
నాయుడి
పేర్లను
పరిగణనలోకి
తీసుకున్నట్లు
తెలిసింది.
అదే
విధంగా
ఈ
సమయంలో
రాష్ట్ర
సమాచార
కమిషనర్
గా
సీనియర్
పాత్రికేయుడు
విఎస్కే
చక్రవర్తి
ఎంపికయ్యారు.
వీరితోపాటు
మరొకరిని
కమిషనర్లుగా
నియమించనున్నారు.
వీఎస్కే
చక్రవరి
స్వస్థలం
తూర్పు
గోదావరి
జిల్లా
బిక్కవోలు
కాగా..
తెలుగు
విశ్వవిద్యాలయం
నుంచి
జర్నలిజంలో
ఆయన
పోస్టు
గ్రాడ్యుయేషన్
పూర్తి
చేశారు.
అనంతరం
ప్రముఖ
తెలుగు
దినపత్రికల్లో
సినిమా
జర్నలిస్టుగా
పనిచేశారు.
ఈ
క్రమంలో
ఉత్తమ
సినీ
విమర్శకుడిగా
నంది
అవార్డు
అందుకున్నారు.
కాగా,
ఆర్టీఐ
కమిషనర్లను
ఖరారు
చేసేందుకు
సెలెక్షన్
కమిటీని
ఏర్పాటు
చేయాల్సి
ఉంది.
ఈ
కమిటీలో
సీఎం,
సీనియర్
మంత్రి,
ప్రతిపక్ష
నేత
సభ్యులుగా
ఉంటారు.
ప్రస్తుతం
ప్రతిపక్ష
నేత
ఎవ్వరూ
లేకపోవడంతో
మరో
సీనియర్
మంత్రిని
కమిటీలోకి
తీసుకుని
పేర్లను
ఖరారు
చేసి
గవర్నర్
ఆమోదానికి
పంపనున్నారు.
గవర్నర్
ఆమోదం
పొందిన
తర్వాత
త్వరలో
ఆర్టీఐ
ప్రధాన
కమిషనర్తోపాటు
కమిషనర్ల
పేర్లను
ప్రకటించే
అవకాశం
ఉంది.
-
కేబినెట్ భేటీలో మంత్రి కన్నీటి పర్యంతం, ఓదార్చిన సీఎం చంద్రబాబు..!!
-
జిల్లాలు, మండలాల పునర్విభజనలో తాజా మార్పులు – :ఫైనల్ గా ఇలా..!!
-
పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు, సచివాలయాలకు తాజా ఆదేశాలు..!!
-
సచివాలయాల ఉద్యోగులు ఇక నుంచి, ప్రభుత్వం కీలక ఆదేశాలు – తప్పనిసరి..!!
-
రైతులకు గుడ్ న్యూస్: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!!
-
మందుబాబులకు పండుగే- అందుబాటులోకి కొత్త బ్రాండ్లు, ధరలు తగ్గింపు..!!
-
కొత్త జిల్లాలు 29 కాదు 28, జిల్లా కేంద్రాలు.. మండలాల్లో మళ్లీ మార్పులు- ఇదే ఫైనల్..!!
-
రైతులకు ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ కానుక – మరో హామీ అమలు..!!
-
అమరావతి రైతులకు రుణాల పై కీలక నిర్ణయం, బిగ్ రిలీఫ్ – ఇక నుంచి..!!
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, ఇక – ప్రయాణీకులు ఊహించని నిర్ణయం..!!
-
ఆ ఆటగాళ్లను IPL లో ఆడిస్తే పిచ్ లు ధ్వంసం చేస్తాం- సాధువుల హెచ్చరిక..!!
-
సినిమా ఇండస్ట్రీ కాకుంటే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా: నాగబాబు వ్యాఖ్యలకు శివాజీ షాకింగ్ రియాక్షన్
-
అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి వైసీపీ – కీలక మలుపు..!!
-
పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు, సచివాలయాలకు తాజా ఆదేశాలు..!!
-
జిల్లాలు, మండలాల పునర్విభజనలో తాజా మార్పులు – :ఫైనల్ గా ఇలా..!!


