Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
రెండో
విడత
పంచాయతీ
ఎన్నికల
కౌంటింగ్
ప్రక్రియ
కొనసాగుతోంది.
ఈ
ఎన్నికలకు
సంబంధించిన
పోలింగ్
ఉదయం
7
గంటల
నుంచి
మధ్యాహ్నం
1
గంట
వరకు
సాగింది.
ఈ
విడతలో
మొత్తం
85.76
శాతం
పోలింగ్
నమోదైనట్లు
ఎన్నికల
అధికారులు
తెలిపారు.
ఇక
జిల్లాల
వారీగా
చూస్తే..
యాదాద్రి
భువనగిరి
జిల్లాలో
అత్యధికంగా
92
శాతం
పోలింగ్
నమోదైంది.
అలాగే
నిజామాబాద్
జిల్లాలో
అయితే
అతి
తక్కువగా
అంటే
76
శాతం
మాత్రమే
పోలింగ్
నమోదైంది.
ఇప్పటివరకూ
పోలింగ్
ఫలితాలను
చూస్తే
అధికార
కాంగ్రెస్
పార్టీ
హవా
కొనసాగుతోంది.
మొత్తం
స్థానాలు
4,332
కాగా..
ఇప్పటివరకు
ఫలితాలు
ప్రకటించినవి
3,701
స్థానాలు.
ఈ
ఫలితాల్లో
అధికార
కాంగ్రెస్
పార్టీ
1900
లకు
పైగా
స్థానాల్లో
విజయం
సాధించింది.
అలాగే
బీఆర్ఎస్
మద్దతుదారులు
1000కు
పైగా
స్థానాల్లో
గెలుపొందారు.
ఇక
బీజేపీ
217
సీట్లలో
విజయం
సాధించింది.
అలాగే
ఇతరులు
548
స్థానాల్లో
విజయం
సాధించారు.
అయితే
కేటీఆర్,
హరీశ్
రావు
సొంత
నియోజకవర్గాలైన
సిరిసిల్ల,
సిద్దిపేటలో
బీఆర్ఎస్
అత్యధిక
స్థానాలను
కైవసం
చేసుకుంది.
రెండో
విడత
పంచాయతీ
ఎన్నికల్లో
415
సర్పంచ్
స్థానాలు
ఏకగ్రీవం
అయ్యాయి.
మిగిలిన
3,911
పంచాయతీలకు
ఎన్నికలు
నిర్వహించారు
అధికారులు.
మరోవైపు
కౌంటింగ్
ప్రక్రియ
ముగిసిన
తర్వాత,
కొత్తగా
ఎన్నికైన
వార్డు
సభ్యులతో
ఉప
సర్పంచ్
కు
సంబంధించిన
ఎన్నికను
వెంటనే
నిర్వహించాల్సి
ఉంటుంది.
ఈ
ప్రక్రియ
పూర్తయి
తేనే
పంచాయతీ
ఎన్నికల
ప్రక్రియ
ముగిసినట్టుగా
భావించాలి.
ఇక
పంచాయతీ
ఎన్నికల
ఫలితాలపై
పీసీసీ
చీఫ్
మహేశ్
కుమార్
గౌడ్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
పంచాయతీ
ఎన్నికలు
రెండో
విడతలోనూ
అత్యధిక
స్థానాల్లో
కాంగ్రెస్
మద్దతుదారులే
గెలిచారని
అన్నారు.
ఎంపీలు,
ఎమ్మెల్యేలు
సమిష్టిగా
కష్టపడ్డారని
తెలిపారు.
గ్రామీణ
ఓటర్లు
ప్రభుత్వ
పాలనపై
నమ్మకం
ఉంచారని
అన్నారు.
పంచాయతీ
రాజ్
వ్యవస్థను
బలోపేతం
చేయడమే
కాకుండా
ప్రతి
గ్రామాన్ని
అభివృద్ది
చేసే
దిశగా
సర్కారు
ముందుకు
సాగుతోందని
అన్నారు.
మరోవైపు
సర్పంచ్
ఎన్నికల్లో
ఓటమిని
జీర్ణించుకోలేక
ఓ
అభ్యర్థి
మృతి
చెందిన
ఘటన
నల్గొండ
జిల్లా
మునుగోడు
మండలం
కిష్టాపురం
గ్రామంలో
జరిగింది.
బీఆర్ఎస్
అభ్యర్థి
చిన్నగోని
కాటంరాజు
251
ఓట్ల
తేడాతో
ఓటమిపాలయ్యారు
.
దీంతో
గుండెపోటుతో
ఆయన
మరణించినట్లు
కుటుంబ
సభ్యులు
తెలిపారు.


