Andhra Pradesh
oi-Sai Chaitanya
వైసీపీ
మాజీ
ముఖ్య
నేత
సాయి
రెడ్డి
సంచలన
డిమాండ్
చేసారు.
తాను
రాజకీయాల
నుంచి
నిష్క్రమిస్తున్నట్లు
ప్రకటిస్తూ
సాయిరెడ్డి
వైసీపీ
వీడారు.
అయితే,
సాయిరెడ్డి
బీజేపీలో
చేరుతారనే
ప్రచారం
సాగింది.
కొద్ది
రోజుల
క్రితం
సాయిరెడ్డి
చేసిన
వ్యాఖ్యలతో
తిరిగి
రాజకీయంగా
యాక్టివ్
అవుతారనే
విశ్లేషణలు
మొదలయ్యాయి.
జగన్
కోటరీ
గురించి
మరోసారి
వ్యాఖ్యలు
చేసారు.
అదే
సమయంలో
చంద్రబాబు,
పవన్
గురించి
ఆసక్తికర
అంశాలు
చెప్పారు.
ఇప్పుడు
సాయిరెడ్డి
కొత్త
డిమాండ్
చేస్తూ
చేసిన
ట్వీట్
వైరల్
అవుతోంది.
వైసీపీ
మాజీ
నేత
సాయిరెడ్డి
కొత్త
అంశాన్ని
ప్రస్తావించారు.
వైసీపీలో
కీలకంగా
పని
చేసిన
సాయి
రెడ్డి
2024
ఎన్నికల
తరువాత
పార్టీని
వీడారు.
జగన్
కోటరీ
కారణంగానే
తాను
పార్టీ
వీడుతున్నట్లు
స్పష్టం
చేసారు.
ఆ
తరువాత
కాకినాడ
పోర్టు,
లిక్కర్
కేసుల్లో
సాయిరెడ్డి
వెల్లడించిన
అంశాలు
సంచలనంగా
మారాయి.
కాగా..
తాజాగా
సాయిరెడ్డి
రాజకీయాల్లోకి
రీ
ఎంట్రీ
పైన
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేసారు.
మరోసారి
జగన్
కోటరీ
గురించి
తన
వాదన
వినిపించారు.
పవన్
తో
ఉన్న
స్నేహం
గురించి
ప్రస్తావన
చేసారు.
తాను
కొత్త
పార్టీ
పెట్టే
ఆలోచన
లేదని..
రాజకీయంగా
తన
భవిష్యత్
పైన
ఆయన
చేసిన
విశ్లేషణ
కొత్త
చర్చకు
కారణమైంది.
కాగా..
ఇప్పుడు
సాయిరెడ్డి
గతంలో
ఎన్నడూ
లేని
విధంగా
హిందూ
మతం
ప్రస్తావన
చేస్తూ
ట్వీట్
చేసారు.
ఇదే
అంశం
పైన
ప్రభుత్వం
ముందు
తన
డిమాండ్
ఉంచారు.
హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 7, 2025
సాయిరెడ్డి
తాజాగా
చేసిన
ట్వీట్
లో..
హిందూ
మతంపై
కుట్రలు
సహించేది
లేదని
మాజీ
ఎంపీ
విజయ
సాయిరెడ్డి
స్పష్టం
చేశారు.
డబ్బు
ఆశ
చూపి..
మతం
మార్చాలని
ప్రయత్నిస్తే
మాత్రం
అటువంటి
వారికి
తగిన
రీతిలో
బుద్ధి
చెప్పి..
గుణపాఠం
నేర్పిద్దామని
ఆయన
పేర్కొన్నారు.
గత
రెండు
దశాబ్దాలుగా
జరిగిన
మత
మార్పిడులపై
కమిటీ
వేసి
విచారణ
జరపాలని
ఈ
సందర్భంగా
ప్రభుత్వాన్ని
ఆయన
డిమాండ్
చేశారు.
దేశం
కోసం
ధర్మం
కోసం
హిందువుల్లో
ఉన్న
అన్ని
సామాజిక
వర్గాలు
ఒక్కటవ్వాలని
విజయసాయిరెడ్డి
పిలుపునిచ్చారు.
అదే
భారతదేశానికి
రక్ష
..శ్రీరామ
రక్ష
అని
తెలిపారు.
దీంతో,
సాయిరెడ్డి
ఇప్పుడు
హిందూ
మతంపై
కుట్రలు
చేస్తే
సహించేది
లేదంటూ
ఆయన
వ్యాఖ్యానించడం
చర్చకు
తెర
తీసింది.
జాతీయ
పార్టీలో
చేరే
ఉద్దేశ్యంతోనే
ఈ
వ్యాఖ్యలు
చేసి
ఉంటారనే
విశ్లేషణ
వినిపిస్తోంది.
అయితే..
సాయిరెడ్డి
భవిష్యత్
అడుగులు
ఏంటనేది
త్వరలోనే
స్పష్టత
వచ్చే
అవకాశం
కనిపిస్తోంది.


