Cinema
oi-Korivi Jayakumar
యువ
జంట
అఖిల్
రాజ్,
తేజస్విని
రావు
జంటగా
నటించిన
చిత్రం
“రాజు
వెడ్స్
రాంబాయి”.
సాయిలు
కంపాటి
ఈ
చిత్రానికి
దర్శకత్వం
వహించగా..
విరాటపర్వం
దర్శకుడు
వేణు
ఉడుగుల
తొలిసారిగా
నిర్మాతగా
వ్యవహరించారు.
శివాజీ
రాజా,
అనిత
చౌదరి,
చైతూ
జొన్నలగడ్డ
కీలక
పాత్రలు
పోషించిన
ఈ
చిత్రానికి
సురేష్
బొబ్బిలి
సంగీతం
అందించారు.
ఖమ్మం-వరంగల్
సరిహద్దులోని
ఓ
గ్రామంలో
2004లో
జరిగిన
వాస్తవ
ఘటన
ఆధారంగా
ఈ
సినిమాను
రూపొందించారు.
రాజు
అనే
యువకుడు
తన
ప్రేయసి
రాంబాయిని
పెళ్లి
చేసుకున్నట్టు
ఊహించుకుంటూ
జీవిస్తాడు.
వారి
ప్రేమకథ
ఎందుకు
విషాదాంతంగా
ముగిసింది
అనేదే
ఈ
చిత్రం.
15
ఏళ్ల
పాటు
ఓ
జంట
అనుభవించిన
నరకాన్ని
ఈ
కథలో
చూపిస్తున్నామని
చిత్ర
బృందం
వెల్లడిస్తుంది.
అంతే
కాకుండా
ఈ
సినిమా
టికెట్
ధరల
విషయంలో
కూడా
ఆఫర్
ఇచ్చింది.
సింగిల్
స్క్రీన్లలో
రూ.99,
మల్టీప్లెక్స్లలో
రూ.105గా
ధరలను
నిర్ణయించారు.
కాగా
రేపు
(
నవంబర్
21,
2025
)
ఈ
మూవీ
విడుదల
కానున్న
తరుణంలో
మూవీ
యూనిట్
లేటెస్ట్
గా
ప్రీ
రిలీజ్
ఈవెంట్
నిర్వహించింది.
ఈ
ఈ
కార్యక్రమానికి
ముఖ్య
అతిథిగా
హాజరైన
హీరో
కిరణ్
అబ్బవరం
చిత్ర
యూనిట్కు
శుభాకాంక్షలు
తెలిపారు.
ఈ
సందర్భంగా
సాయిలు
కంపాటి
చేసిన
వ్యాఖ్యలు
తీవ్ర
దుమారం
రేపుతున్నాయి.
సాయిలు
మాట్లాడుతూ..
తన
సినిమాకు
నెగెటివ్
టాక్
వస్తే
అమీర్పేట్
సెంటర్లో
అర్ధనగ్నంగా
తిరుగుతానని
అన్నారు.
సినిమా
విజయంపై
తనకు
పూర్తి
నమ్మకం
ఉందని,
దయచేసి
ఎవరూ
నెగెటివ్
ప్రచారం
చేయవద్దని
కోరారు.
పల్లెటూరి
కథలంటే
తనకు
ఇష్టమని..
తాను
అలాంటి
కథలే
రాస్తానని
చెప్పుకొచ్చారు.
విమానంలో
వచ్చే
హీరోలను,
ట్రైన్
దిగివచ్చే
నటీనటుల
గురించి
రాయలేనని
తెలిపారు.
మూవీ
నచ్చకపోతే
వదిలేయండి..
అంతేకానీ
నెగెటివ్గా
మాట్లాడకండి
అంటూ
చెప్పుకొచ్చారు.
అంతే
కాకుండా
తాను
ఊరోడినని..
ఊరు
కథలే
రాస్తానని
స్పష్టం
చేశారు.
తాను
చూసిన
ఊరు..
చూసిన
మట్టి
మనుషులు..
పొలాల్లో
నాటేసే
మనుషులు..
నాగళ్లు
పట్టుకుని
దారిలో
నడిచే
మనుషులు..
అమాయకత్వంగా
పనిచేసే
అమ్మాయిలు..
కాలేజీ
నుంచి
వచ్చే
అమ్మాయిలు,
వాళ్ళ
మధ్య
పుట్టే
మొరటి
ప్రేమ..
ఇవే
తనకు
తెలుసని
వివరించారు.
కొత్త
కథ
చెప్పడానికి
వచ్చానని
అన్నారు.
ఎవరినైనా
హర్ట్
చేస్తే
క్షమించండి
అంటూ
క్లారిటీ
ఇచ్చారు.
ప్రస్తుతం
ఈ
డైరెక్టర్
చేసిన
కామెంట్స్
పై
సోషల్
మీడియాలో
సైతం
జోరుగా
చర్చ
నడుస్తోంది.


