Telangana
oi-Sai Chaitanya
కల్వకుంట్ల
కవిత
మరోసారి
సంచలన
వ్యాఖ్యలు
చేసారు.
హరీష్
రావును
టార్గెట్
చేయటం
తో
పాటుగా
మాజీ
సీఎం
కేసీఆర్
ముందు
కీలక
డిమాండ్
ఉంచారు.
అసెంబ్లీ
సమావేశాల
తీరు
పైన
స్పందించారు.
సాగు
నీటి
ప్రాజెక్టుల
విషయంలో
జరుగుతున్న
వివాదం
పై
స్పందించారు.
తన
జాగృతి
నే
ఎప్పటికైనా
బీఆర్ఎస్
కు
ప్రత్యామ్నాయమని
తేల్చి
చెప్పారు.
సీఎం
రేవంత్
పైనా
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
కవిత
మరోసారి
హరీష్
లక్ష్యంగా
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
హరీష్
రావు
ఒక
బచ్చా
అని
అన్నారు.
ఆయనకు
ప్యాకేజీలు
తీసుకోవడం
తప్ప
ఏం
తెలుసు
అంటూ
వ్యాఖ్యానించారు.
ప్యాకేజీలు
అమ్ముకున్న
ట్రబుల్
బబుల్
షూటర్
అని
ఎద్దేవా
చేసారు.
మోసం
చసిన
వ్యక్తికే
డిప్యూటీ
ఫ్లోర్
లీడర్
పదవి
ఇచ్చారని
మండిపడ్డారు.
బీఆర్ఎస్
మనుగడ
కావాలంటే
కేసీఆర్
అసెంబ్లీకి
రావాలని
కవిత
సూచించారు.
బీఆర్ఎస్
కు
ప్రత్యామ్నాయంగా
జాగృతి
సంస్థ
ఉంటుందని
చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో
మ్యాచ్
ఫిక్సింగ్
జరగుతోందని..
అటు
సీఎం..
ఇటు
బబుల్
షూటర్
ఉంటారని
పేర్కొన్నారు.
కేసీఆర్
ను
కసబ్
తో
పోల్చటం
తప్పని
రేవంత్
పైన
మండిపడ్డారు.
కాగా,
కేసీఆర్
అసెంబ్లీకి
వచ్చి
నీటి
ప్రాజెక్టుల
పై
వివరణ
ఇవ్వాలని
కవిత
డిమాండ్
చేసారు.
నీటి
ప్రాజెక్టుల
పై
కేసీఆర్
కంటే
రేవంత్,
హరీష్
కు
ఎక్కువ
తెలుసా
అని
కవిత
ప్రశ్నించారు.
కేసీఆర్
తప్పు
చేయకపోతే
సభకు
రావాల్సిందే
అని
పట్టుబట్టారు.
సభకు
రాకుండా
పిల్ల
కాకుల
మీద
సభా
సమయాన్ని
వదలొద్దంటూ
హితవుపలికారు.
ఈ
విషయంలో
ఒక
కూతురుగా
తన
రక్తం
ఉడుకుతోందన్నారు.
అలాగే
పాలమూరు
–
రంగారెడ్డి
ప్రాజెక్ట్ను
పక్కన
పెట్టిన
కేసీఆర్ను
ఉరి
తీయాంటూ
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
చేసిన
వ్యాఖ్యలపై
కవిత
స్పందించారు.
కేసీఆర్
మీద
సీఎం
భాష
సరికాదన్నారు.
కేసీఆర్ను
ఒకసారి
ఉరితీయాలంటే
రేవంత్
రెడ్డిని
పదిసార్లు
ఉరి
తీయాలంటూ
మండిపడ్డారు.
సొంత
జిల్లా
మహబూబ్
నగర్కు
రేవంత్
తెచ్చిన
ప్రాజెక్టులు
ఎన్ని
అని
ప్రశ్నించారు.
కవిత
వరుసగా
చేస్తున్న
వ్యాఖ్యలతో
బీఆర్ఎస్
లో
చర్చ
మొదలైంది.


