Telangana
oi-Chandrasekhar Rao
కొత్త
ఏడాదిని
పురస్కరించుకుని
గ్రేటర్
హైదరాబాద్
మున్సిపల్
కార్పొరేషన్
అధికారులు..
నగర
ప్రజలకు
ఓ
అద్దిరిపోయే
కానుకను
అందించారు.
అత్యంత
రద్దీ
మార్గంలో
ఓ
లింక్
బ్రిడ్జిని
అందుబాటులోకి
తీసుకొచ్చారు.
దీనివల్ల
కనీస
ప్రయాణ
సమయంలో
40
నిమిషాలు
తగ్గుతుందనే
అంచనాలు
ఉన్నాయి.
ఈ
లింక్
బ్రిడ్జిని
రవాణా,
ఆర్
అండ్
బీ
శాఖ,
హైదరాబాద్
ఇన్
ఛార్జి
మంత్రి
పొన్నం
ప్రభాకర్,
మేయర్
గద్వాల
విజయలక్ష్మి
ప్రారంభించారు.
హైదరాబాద్లో
అత్యంత
రద్దీ
మార్గాల్లో
ఒకటైన
అశోక్నగర్
వద్ద
హుస్సేన్
సాగర్
అదనపు
నాలాపై
నిర్మించిన
లింక్
బ్రిడ్జి
ఇది.
దీని
పొడవు
48.2
మీటర్లు.
సుమారు
6
కోట్ల
రూపాయలకు
పైగా
వ్యయంతో
జీహెచ్ఎంసీ
అధికారులు
దీన్ని
నిర్మించారు.
చిక్కడపల్లి,
దోమల్గూడలను
కలుపుతూ
అశోక్నగర్
సిటీ
సెంట్రల్
లైబ్రరీ,
గగన్మహల్లోని
ఏవీ
కాలేజీకి
అనుసంధానంగా
నిలుస్తుంది.
ఇది
అందుబాటులోకి
రావడం
వల్ల
ఈ
మార్గంలో
రాకపోకలు
సాగించే
వారి
ప్రయాణ
సమయం
గణనీయంగా
తగ్గుతుంది.
చిక్కడపల్లి
నుండి
అశోక్నగర్,
దోమల్గూడతో
పాటు
లిబర్టీ
జంక్షన్,
జీహెచ్ఎంసీ
ప్రధాన
కార్యాలయం,
సచివాలయం
వైపు
వెళ్లే
ప్రయాణ
సమయం
దాదాపు
సగం
తగ్గుతుందని
అధికారులు
వెల్లడించారు.
రోజువారీ
ట్రాఫిక్
రద్దీని
తగ్గించడంలో
కీలక
పాత్ర
పోషిస్తుందని
అన్నారు.
ప్రతి
గంటా
కనీసం
అయిదు
వేలకు
పైగా
వాహనాలు
ఈ
లింక్
బ్రిడ్జి
మీదుగా
రాకపోకలు
సాగిస్తాయనే
అంచనాలు
వ్యక్తమౌతోన్నాయి.
లిబర్టీ
జంక్షన్
మీదుగా
హిమాయత్
నగర్
వెళ్లే
మార్గంలో
వాహనాల
రద్దీ
తగ్గుముఖం
పడుతుందని
చెబుతున్నారు.
వంతెన
ప్రారంభోత్సవం
అనంతరం
పొన్నం
ప్రభాకర్
మాట్లాడారు.
ఔటర్
రింగ్
రోడ్
(ORR)
లోపల,
చుట్టుపక్కల
ఉన్న
మున్సిపాలిటీలను
గ్రేటర్
హైదరాబాద్లో
విలీనం
చేయడంతో,
నగరం
విస్తీర్ణం,
జనాభా
పరంగా
దేశంలోనే
అతిపెద్ద
నగరంగా
అభివృద్ధి
చెందిందని
అన్నారు.
దీనికి
అనుగుణంగా
మౌలిక
సదుాపాయాలను
మెరుగుపర్చుతున్నామని
చెప్పారు.
జనాభా
పెరుగుదలకు
అనుగుణంగా
రోడ్లు,
స్టార్మ్వాటర్
డ్రైన్లు,
వీధి
దీపాలు,
పార్కులు
వంటి
మౌలిక
సదుపాయాలు
పెంపొందించడం
అత్యవసరమని,
ఈ
విషయంలో
రాజీపడట్లేదని
అన్నారు.


