Telangana
oi-Dr Veena Srinivas
విద్యాబుద్ధులు
నేర్పే
టీచర్లు
విద్యార్థులకు
సరిగా
పాఠాలు
చెబితే
ఆ
విద్యార్థులకు
ఆయా
పాఠ్యాంశాలపైన
అవగాహన
వస్తుంది.
తిరిగి
దానికి
సంబంధించి
ఏమైనా
ప్రశ్నలు
అడిగితే
ఒకరు
కాకపోతే
ఒకరైనా
సమాధానం
చెబుతారు.
కానీ
మన
విద్యా
వ్యవస్థలో
ముఖ్యంగా
ప్రభుత్వ
పాఠశాలలు,
కళాశాలలలో
కొన్ని
చోట్ల
టీచర్లు,
అధ్యాపకుల
పనితీరు
ప్రతి
ఒక్కరికి
విస్మయాన్ని
కలిగిస్తుంది.
విద్యార్థులు
ఎలా
చదువుతున్నారో
ప్రశ్నలు
అడిగిన
కలెక్టర్
తాజాగా
వరంగల్
జిల్లాలో
గిరిజన
బాలుర
గురుకుల
విద్యాలయంలో
జిల్లా
కలెక్టర్
విద్యార్థుల
సామర్థ్యాన్ని
చూసి
షాక్
కు
గురయ్యారు.
అసలు
ఇంతకీ
ఏం
జరిగిందంటే
వరంగల్
జిల్లా
నర్సంపేటలోని
గిరిజన
బాలుర
గురుకుల
విద్యాలయాన్ని
జిల్లా
కలెక్టర్
డా.సత్యశారద
సందర్శించారు.
విద్యార్థులు
ఏ
విధంగా
చదువుతున్నారో
తెలుసుకోవాలని
భావించిన
కలెక్టర్
9వ
తరగతి
మరియు
ఇంటర్
మొదటి
సంవత్సరం
తరగతి
గదులలోకి
వెళ్లి
విద్యార్థులను
కొన్ని
ప్రశ్నలు
అడిగారు.
టీచర్
లపై
కలెక్టర్
ఆగ్రహం
తెలుగులో
సమాసాలు
ఎన్ని?
మీకు
వేమన
పద్యాలు
వచ్చా?
అసలు
వేమన
పద్యాలు
అంటే
తెలుసా?
ఇలా
ఏ
ప్రశ్న
అడిగినా
విద్యార్థుల
నుండి
ఒక్క
సమాధానం
కూడా
రాలేదు.
ప్రతి
ప్రశ్నకు
విద్యార్థులు
సైలెంట్
గా
ఉండడం
చూసిన
కలెక్టర్
తీవ్ర
అసహనానికి
గురయ్యారు.
కనీసం
తెలుగు
గురించి
వారికి
అవగాహన
లేకపోవడంతో
కలెక్టర్
ఉపాధ్యాయులను
పిలిచి
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
టీచర్
లకు
కలెక్టర్
హితవు
విద్యార్థులకు
ఏం
పాఠాలు
చెబుతున్నారు
అంటూ
ప్రశ్నించారు.
విద్యార్థులకు
మంచి
విద్యా
బోధన
చేయాలని
టీచర్లకు
హితవు
పలికారు.
వెంటనే
టీచర్లతో
వేమన
పద్యాలు
చదివించి
వాటికి
అర్థాలు
వివరించమని
ఆదేశించారు.
తెలుగు
భాషకు
సంబంధించిన
కనీస
అవగాహన
విద్యార్థులకు
లేకపోవడం
పైన
ఆమె
ఉపాధ్యాయులపై
తీవ్ర
అసంతృప్తి
వ్యక్తం
చేశారు.
పదోతరగతి
విద్యార్థులు,
ఇంటర్
విద్యార్థులపై
దాడి
ఘటనతో
ఆకస్మిక
తనిఖీ
చేసిన
కలెక్టర్
ఇటీవల
ఈ
గురుకులంలో
ఇంటర్
విద్యార్థులు
పదోతరగతి
విద్యార్థులపై
దాడి
చేసిన
ఘటన
నేపథ్యంలో
కలెక్టర్
ఈ
కళాశాలలో
ఆకస్మిక
తనిఖీ
నిర్వహించి
విద్యార్థుల
సామర్థ్యాన్ని
పరీక్షించారు.
కనీసం
ప్రాథమిక
జ్ఞానం
కూడా
విద్యార్థులకు
లేకపోవడం
పైన
టీచర్ల
పనితీరు
మార్చుకోవాలని
కలెక్టర్
హితువు
పలికారు.


