తుమకూరు వరకు బెంగళూరు మెట్రో రైలు పరుగులు

Date:


India

oi-Chandrasekhar Rao

బెంగళూరు-తుమకూరు
ప్రయాణికులకు
శుభవార్త.
నమ్మ
మెట్రో..
ఇక
పొరుగునే
ఉన్న
తుమకూరు
వరకు
వెళ్లనుంది.
దీన్ని
అక్కడి
వరకు
పొడిగించడానికి
బెంగళూరు
మెట్రో
రైల్
కార్పొరేషన్
లిమిటెడ్
(BMRCL)
డీటెయిల్
ప్రాజెక్ట్
రిపోర్ట్
ముసాయిదాకు
ఆమోదం
తెలిపింది.

డీపీఆర్
వ్యయం
1.2
కోట్ల
రూపాయలు.

డీపీఆర్
ప్రకారం-
బెంగళూరుకు
సుమారు
70
కిలో
మీటర్ల
దూరంలో
పారిశ్రామిక
కేంద్రంగా
ఎదుగుతున్న
తుమకూరుకు
మెట్రో
రైలు
సేవలను
విస్తరించడం
వల్ల
ప్రతి
గంటకు
15,000
మంది
ప్రయాణికులకు
సేవలు
అందించగలదని
అంచనా.


డీపీఆర్
తయారీ
బాధ్యతలను
హైదరాబాద్‌కు
చెందిన
ఆర్వీ
ఇంజినీరింగ్
కన్సల్టెంట్స్‌కు
అప్పగించారు.
అయిదు
నెలల్లో
నివేదిక
సమర్పించాలని
బీఎంఆర్‌సీఎల్
గడువు
విధించింది.
డీపీఆర్
తయారీ
కోసం
గత
నెలలో
టెండర్లను
ఆహ్వానించింది.
డీపీఆర్
ఖరారు
అయ్యాక
కేంద్ర
ప్రభుత్వ
ఆమోదం
కోసం
పంపిస్తారు.

ప్రాజెక్ట్
కు
అయ్యే
ఖర్చును
కేంద్ర-
రాష్ట్ర
ప్రభుత్వాలు
సమంగా
భరించే
అవకాశాలు
ఉన్నాయి.

ప్రస్తుతం
తుమకూరు
రూట్
లో
మాదవార
వరకు
బెంగళూరు
మెట్రో
రైలు
సర్వీసులు
(గ్రీన్
లైన్)
అందుబాటులో
ఉన్నాయి.
దీన్ని
తుమకూరు
వరకు
పొడిగించాలని
ప్రభుత్వం
ఇదివరకే
నిర్ణయించింది.
దీనికి
అనుగుణంగా
చర్యలు
తీసుకుంది.
మాదవార
నుంచి
నెలమంగళ,
డబాస్
పేట,
క్యాథసంద్ర
మీదుగా
తుమకూరు
వరకు
మెట్రో
రైల్
సేవలు
అందుబాటులోకి
వస్తాయి.

లక్షలాది
వాహనాలు
రాకపోకలు
సాగించే
అత్యంత
రద్దీ
మార్గాల్లో
ఇదీ
ఒకటి
కావడం,
పారిశ్రామిక
కారిడార్
అయినందున
మెట్రో
సేవలను
తుమకూరు
వరకు
పొడిగించాలని
నిర్ణయించింది
ప్రభుత్వం.
డీపీఆర్
రూపకల్పనకు
టెండర్ల
ప్రక్రియను
సైతం
పూర్తి
చేసింది.
దీంతో

మెట్రో
ప్రాజెక్ట్
కీలక
దశలోకి
ప్రవేశించినట్టయింది.
తుమకూరు
పారిశ్రామికంగా
అభివృద్ధి
చెందుతున్నందున

మెట్రో
సేవలకు
మంచి
ఆదరణ
లభిస్తుందని
ప్రభుత్వం
భావిస్తోంది.
ప్రతి
గంటకూ
15,000
మంది
రాకపోకలు
సాగించే
అవకాశం
ఉందని
అంచనా
వేసింది.

నమ్మ
మెట్రో
గ్రీన్
లైన్
సిల్క్
ఇన్‌స్టిట్యూట్
నుండి
మాదవార
వరకు
33.4
కిలో
మీటర్ల
మేర
ప్రస్తుతం
అందుబాటులో
ఉంది.

రెండింటి
మధ్య
మొత్తం
31
స్టేషన్లు
ఉన్నాయి.
ప్రతిపాదిత
విస్తరణ
మాదవారలోని
బెంగళూరు
అంతర్జాతీయ
ఎగ్జిబిషన్
సెంటర్
సమీపంలో
ప్రారంభమై
తుమకూరు
వద్ద
ముగుస్తుంది.

కారిడార్‌లో
25
ఎలివేటెడ్
స్టేషన్లు
ఉంటాయని
ప్రణాళికలు
రూపొందించారు.

2027
నాటికి
మొత్తం
175
కిలోమీటర్ల
మేర
మెట్రో
రైల్
సేవలు
విస్తరించాలని
ప్రభుత్వం
భావిస్తోంది.
2026
నాటికి
మరో
41
కిలోమీటర్లు
అందుబాటులోకి
వస్తాయి.
2027
డిసెంబర్
కల్లా
ఎయిర్‌పోర్ట్
లైన్‌తో
పాటు
మరో
38
కిలోమీటర్ల
మేర
కొత్త
మార్గాలు
పూర్తి
కానున్నాయి.
తావరెకెరె,
హోసకోటె,
బిడది,
నెలమంగళలకు
మెట్రో
విస్తరణ
ప్రణాళికలు
తుదిదశల్లో
ఉన్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related