Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ
ప్రభుత్వం
విద్యార్ధుల
కోసం
కీలక
నిర్ణయం
తీసుకుంది.
పదో
తరగతి
విద్యార్థుల్లో
పరీక్షల
ఒత్తిడి,
ఆందోళనను
తగ్గించేందుకు
కొత్త
విధానం
అమల్లోకి
తెచ్చింది.
ఇందుకోసం
తాజాగా
అన్ని
పాఠశాలల్లో
అమలు
చేసే
విధంగా
మార్గదర్శకాలు
జారీ
చేసింది.
ఈ
విధానం
అమలు
ద్వారా
విద్యార్ధులు
ఎలాంటి
ఆందోళన..
ఒత్తిడి
లేకుండా
పరీక్షలకు
హాజరు
కాగలుగుతారని
భావిస్తు
న్నారు.
కాగా..
ఇప్పుడు
ఈ
విధానం
ప్రతీ
పాఠశాలలోనూ
అమలు
చేయాలని
విద్యా
శాఖ
తమ
మార్గదర్శకాల్లో
స్పష్టం
చేసింది.
పదో
తరగతి
విద్యార్థుల
కోసం
ప్రభుత్వం
ప్రత్యేకంగా
కొన్ని
నిర్ణయాలు
తీసుకుంది.
అందులో
భాగంగా
వారిలో
పరీక్షల
ఒత్తిడి,
ఆందోళనను
తగ్గించేందుకు
ఉదయం,
మధ్యాహ్నం
మొదటి
పీరియడ్లలో
తొలి
10
నిమిషాల
పాటు
యోగా,
ధ్యానం
చేయించాలని
ఉపాధ్యాయులకు
సూచిస్తూ
మార్గదర్శకాలు
జారీ
చేసింది.
విశ్రాంతి
పద్ధతులకు
ప్రాధాన్యత
ఇవ్వాలని,
ప్రతిరోజూ
చివరి
పీరియడ్లో
పోటీ
లేని
ఆటలు
ఆడించాలని
పేర్కొంది.
ప్రధానోపాధ్యాయులు,
తరగతి
ఉపాధ్యాయులు,
వ్యాయామ
ఉపాధ్యాయులు
చేయవల్సిన
పనులను
విడివిడిగా
వివరించింది.
ప్రతిరోజూ
ఉదయం
అసెంబ్లీలో
అకడమిక్
ఒత్తిడి,
పరీక్షల
ఆందోళన
తగ్గించి,
వారిలో
స్ఫూర్తి
నింపేలా
ప్రసంగాలు
చేయించనున్నారు.
పాఠశాల
ప్రాంగణంలోని
ముఖ్య
ప్రదేశాల్లో
ఒత్తిడి
నిర్వహణ,
ఎదుర్కొనే
విధానంపై
పోస్టర్లు
ప్రదర్శన
నిర్వహించనున్నారు.
విద్యార్ధుల్లో
పరీక్షల్లో
ఫెయిల్
అవుతామనే
భయం,
సహచరులతో
పోలిక,
ఆందోళన,
డిప్రెషన్
ఎదుర్కొనేలా
విద్యార్థులకు
కౌన్సెలింగ్
ఇవ్వాలని
పాఠశాల
విద్యాశాఖ
మార్గదర్శకాల్లో
స్పష్టత
ఇచ్చింది.
అలాగే
విద్యార్థులు
ఎదుర్కొనే
సమస్యలను
ఉపాధ్యాయులతో
చర్చించే
అవకాశం
కల్పించడంతో
పాటు,
సహాయ
బాక్సులు
కూడా
పెట్టనున్నారు.
పిల్లలకు
క్రమశిక్షణా
బెదిరింపు
లు
ఉండకూడదు.
ఉపాధ్యాయులు
వారి
విషయంలో
ప్రత్యేక
శ్రద్ధ
పెట్టాలి.
వారితో
స్నేహభావంతో
మెలగాలని
స్పష్టం
చేసింది.
పాఠశాల
ప్రాంగణంలో
నడక,
తోట
పనులు
చేపట్టి,
పిల్లల్లో
ప్రశాంత
త,
ఏకాగ్రత
పెంపొందించే
విధంగా
విద్యార్థులను
ప్రోత్సహించాలని
నిర్దేశించారు.
ప్రతీ
విద్యార్ధి
తమ
బలబలాలు
అర్థం
చేసుకునేలా
చూడాలి.
వారి
తల్లిదండ్రులకు
వాస్తవ
పరిస్థితులను
వివ
రించాలి.
పరీక్షలకు
సిద్ధం
అయ్యే
వేళ
స్క్రీన్
టైం
నియంత్రించాలి.
కౌమార
దశలో
కనిపించే
మూడ్
స్వింగ్స్
వంటి
భావోద్వేగ
మార్పుల
పై
విద్యార్థులకు
సున్నితంగా
మార్గనిర్దేశం
చేయాలని
విద్యాశాఖ
నిర్దేశించింది.


