సౌత్ ఇండియాలో ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదాలు ఇవే..?

Date:


India

oi-Korivi Jayakumar

2025వ
సంవత్సరం
మరికొద్ది
రోజుల్లో
ముగియనుంది.
కానీ

ఏడాది
మిగిల్చిన
విషాదాన్ని
మాత్రం
ఎవరూ
మర్చిపోలేరు
అంటే
అతిశయోక్తి
కాదు.
రోడ్డు
ప్రమాదాల్లో
ఒకరిద్దరు
చనిపోవడం
జరుగుతుంటుంది.
కానీ
ప్రమాదాలలో
పదుల
సంఖ్యలో
మనుషులు
చనిపోవడం..
అనూహ్య
ఘటనల్లో
తీరని
విషాదాలు
జరగడం

ఏడాది
లోనే
అని
చెప్పాలి.
ఎప్పుడూ
గుర్తుండే
పీడకలలను
మిగిల్చిన..

2025లో
ప్రమాదాలే
కాకుండా
అగ్ని
ప్రమాదాలు,
తొక్కిసలాట
ఘటనలు
అందరినీ
దిగ్భ్రాంతికి
గురిచేశాయి.


విషాద
ఘటనల
వల్ల
కుటుంబాలు
మానసికంగా
తీవ్రంగా
కుంగిపోతాయి.
ఆత్మవిశ్వాసం
కోల్పోతారు,
భవిష్యత్తు
మీద
భయం
పెరుగుతుంది.
కొందరిలో
డిప్రెషన్,
ఒంటరితనం,
నిద్రలేమి
లాంటి
సమస్యలు
మొదలవుతాయి.
ఇక
ఆర్థికంగా
బలహీనమైన
కుటుంబాల్లో
అయితే
పరిస్థితి
మరింత
దారుణంగా
మారుతుంది.
తల్లిదండ్రులు
పిల్లలను
కోల్పోతే

వేదనకు
మాటలు
ఉండవు.
పిల్లలు
తల్లిదండ్రులను
కోల్పోతే,

చిన్న
వయసులోనే
బాధ్యతల
భారాన్ని
మోసుకోవాల్సి
వస్తుంది.
ఒక
భార్య
భర్తను
కోల్పోతే..
ఆమె
జీవితమే
ఒక్కసారిగా
ప్రశ్నార్థకంగా
మారుతుంది.



ఏడాదిలో
అత్యంత
విషాద
ఘటనలు
ఇవే..?


తిరుపతి
తొక్కిసలాట..

జనవరి
8..
తిరుపతిలోని
8
కేంద్రాల్లో
వైకుంఠ
ద్వార
దర్శనం
కోసం
90
కౌంటర్ల
ద్వారా
లక్షా
ఇరవై
వేల
టోకెన్లు
జారీ
చేశారు.
అయితే
భక్తుల
రద్దీ
పెరిగిన
తరుణంలో
దీంతో
భక్తులు,
పోలీసులు..
టీటీడీ
అధికారుల
మధ్య
సమన్వయ
లోపం
తలెత్తడంతో
తొక్కిసలాట
జరిగింది.
రాత్రి
9
గంటల
సమయంలో
బైరాగి
పట్టెడ
వద్ద
టోకెన్ల
కోసం

దుర్ఘటన
చోటు
చేసుకొని..
ఆరుగురు
భక్తులు
మృతి
చెందగా
29
మందికి
గాయాలయ్యాయి.


SLBC
టన్నెల్‌లో
ప్రమాదం..

SLBC
ప్రాజెక్టులో
భాగంగా
నాగర్‌
కర్నూల్‌
జిల్లా
దోమలపెంట
వద్ద
ఘోర
ప్రమాదం
చోటుచేసుకుంది.
14
కిలోమీటర్‌
వద్ద
ఫిబ్రవరి
22న
రాత్రి
8:30
గంటల
సమయంలో
కార్మికులు
పనులు
చేస్తుండగా,
అకస్మాత్తుగా
పైకప్పు
కూలిపడటంతో
కాంక్రీట్‌
పెచ్చులు
ఊడి
పడి
8
మంది
ఉద్యోగులు,
సిబ్బంది
చనిపోయారు.
తెలంగాణ
వ్యాప్తంగా

ఘటన
తీవ్ర
విషాదాన్ని
నింపింది.


విశాఖ
చందనోత్సవం..

విశాఖ
జిల్లా
సింహాద్రి
అప్పన్న
స్వామి
చందనోత్సవంలో
ఏప్రిల్‌
29న
స్వామివారి
నిజరూపాన్ని
దర్శించుకునేందుకు
వచ్చిన
భక్తులపై
గోడ
కూలడంతో
ఏడుగురు
మృతిచెందగా,
ఒకరు
గాయపడ్డారు.


గుల్జార్‌
హౌస్‌
అగ్ని
ప్రమాదం..

హైదరాబాదులోని
గుల్జార్
హౌస్‌లో
మే
18న
తెల్లవారుజామున
జరిగిన
అగ్ని
ప్రమాదంలో
17
మంది
మరణించారు.

ప్రమాదానికి
ప్రధాన
కారణం
ఇన్వర్టర్‌లో
షార్ట్
సర్క్యూట్
అని
అధికారులు
గుర్తించారు.
మంటలు
త్వరగా
వ్యాపించడంతో
పెద్ద
ఎత్తుల
ప్రాణనష్టం
సంభవించింది.


చిన్న
స్వామి
స్టేడియంలో
తొక్కిసలాట

జూన్‌
4న
బెంగళూరులోని
చిన్నస్వామి
స్టేడియంలో
ఆర్సీబీ
విజయోత్సవ
వేడుకల
సమయంలో
జరిగిన
తొక్కిసలాటలో
11
మంది
అభిమానులు
మరణించారు.

సంఘటనకు
కారణం
అంచనాలకు
మించి
జనం
రావడం
అని,
దీనికి
అవసరమైన
అనుమతులు
లేకుండా
ర్యాలీ
నిర్వహించడం
అని
ప్రభుత్వ
విచారణలో
తేలింది.


పాశమైలారం
పేలుడు..

సంగారెడ్డి
జిల్లా
పటాన్‌‌చెరులోని
పాశమైలారంలో
జూన్‌
30న
సిగాచి
రసాయన
పరిశ్రమలో
భారీ
పేలుడు
సంభవించింది.
మైక్రో
క్రిస్టల్
సెల్యులోజ్
డ్రయింగ్
యూనిట్‌లో
రియాక్టర్‌
పేలుడు
సంభవించగా
ఘటనలో
46
మంది
కార్మికులు
మరణించారు.


మామిడికాయ
లారీ
బోల్తా..

జూలై
14న
రాజంపేట
నుంచి
రైల్వే
కోడూరు
మార్కెట్‌కు
మామిడికాయల
లోడుతో
వెళ్తున్న
లారీ
పుల్లంపేట
మండలం
రెడ్డిపల్లి
చెరువు
కట్టపై
అదుపుతప్పి
బోల్తా
పడటంతో
8
మంది
అక్కడికక్కడే
మృతి
చెందగా..
తొమ్మిది
మందికి
తీవ్రంగా
గాయాలయ్యాయి.


కరూర్‌
తొక్కిసలాట..

2025
సెప్టెంబర్
27న
తమిళనాడులోని
కరూర్
జిల్లాలో
జరిగిన
రాజకీయ
ర్యాలీలో
తొక్కిసలాట
సంభవించింది.
టీవీకే
అధ్యక్షుడు
విజయ్
కరూర్‌లో
ర్యాలీ
నిర్వహించారు.

సందర్భంగా
తొక్కిసలాట
చోటుచేసుకుని
41
మంది
మృతి
చెందగా,
60
మందికి
పైగా
గాయపడ్డారు.
హైకోర్టు
ఆదేశాలతో

ఘటనపై
సిట్
దర్యాప్తు
చేపట్టింది.


వేమూరి
ట్రావెల్స్‌
బస్సు..

అక్టోబర్
24న
కర్నూలు
సమీపంలోని
చిన్నటేకూరు
వద్ద
జరిగిన
ఘోర
రోడ్డు
ప్రమాదంలో
వేమూరి
కావేరి
ట్రావెల్స్
బస్సులో
అగ్ని
జ్వాలలు
చెలరేగాయి.

ప్రమాదంలో
19
మంది
సజీవ
దహనం
కాగా..
22మందికి
గాయాలయ్యాయి.
మృతుల్లో
ఇద్దరు
పిల్లలు
కూడా
ఉన్నారు.
హైదరాబాద్
నుంచి
బెంగళూరు
వెళ్తున్న
బస్సు,
రోడ్డుపై
పడి
ఉన్న
బైక్‌ను
ఢీకొట్టడంతో
మంటలు
చెలరేగి
పూర్తిగా
దగ్ధమైంది.


శ్రీకాకుళం
తొక్కిసలాట..

శ్రీకాకుళం
జిల్లా
కాశీబుగ్గ
లోని
వేంకటేశ్వర
స్వామి
ఆలయంలో
కార్తిక
మాసం
సందర్భంగా
నవంబర్‌
1న
స్వామి
వారి
దర్శనం
కోసం
పెద్ద
ఎత్తున
భక్తుల
రద్దీ
చోటుచేసుకుంది.
దీంతో
తొక్కిసలాట
జరిగి
10
మంది
మృతిచెందారు.


చేవెళ్ళ
బస్సు

లారీ
ఢీ..

నవంబర్‌
3న
రంగారెడ్డి
జిల్లా
చేవెళ్ల
మండలంలో
ఆర్టీసీ
బస్సుపై
కంకర
లారీ
బోల్కా
పడటంతో
బస్సులోని
19
మంది
ప్రయాణికులు
అక్కడిక్కడే
మృతి
చెందారు.

ఘటనలో
ఒకే
కుటుంబానికి
చెందిన
ముగ్గురు
అక్కా
చెల్లెళ్లు
మృతి
చెందారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Doja Cat Reveals Borderline Personality Disorder Diagnosed

Doja Cat is opening up about her mental health...

Where to Stay in New York City If You Like to Eat

America’s largest city is also one of its greatest...

Govt. to take over Krishna Iyer’s residence to set up legal research centre: Minister

Law Minister P. Rajeeve on Saturday (March 14) said...