దీపావ‌ళి, ఛ‌త్ పండుగ‌ల సంద‌ర్భంగా ఏపీ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు..

Date:


ఏపీలోని
రైలు
ప్ర‌యాణికులకు
రైల్వేశాఖ

గుడ్‌న్యూస్
అందించింది.
దీపావళితో
పాటూ
ఛ‌త్
వంటి
పండుగల
సంద‌ర్భంగా
ప‌లు
ప్ర‌త్యేక
రైళ్ల‌ను
న‌డిపేందుకు
సిద్ధ‌మ‌య్యింది.
పండుగ‌ల
వేళ
ప్రయాణికుల
రద్దీని
దృష్టిలో
పెట్టుకుని
రైల్వేశాఖ

నిర్ణయం
తీసుకున్న‌ట్లు
తెలుస్తోంది.
విశాఖ
టు
దానాపూర్
టు
విశాఖ
మధ్య
ప‌లు
స్పెష‌ల్
ట్రైన్స్‌,
విశాఖ-భువనేశ్వర్‌-విశాఖ
మధ్య
అన్‌రిజర్వుడ్‌
ప్రత్యేక
రైలు
నడుపుతున్న‌ట్లు
తెలిపింది.

మేర‌కు
తూర్పు
కోస్తా
రైల్వే

ప్ర‌క‌ట‌న‌ను
కూడా
జారీ
చేసింది.

ట్రైన్ల
వివ‌రాల‌ను

సారి
చూసేద్దాం.

విశాఖ
టు
దానాపూర్
ఎక్స్‌ప్రెస్
..

వ‌చ్చే
(నవంబరు)
నెల
4వ
తేదిన
ఉదయం
9.10
గంటలకు
08520
అనే
నెంబ‌ర్‌గ‌ల
విశాఖ
టు
దానాపూర్
ఎక్స్‌ప్రెస్
స్పెష‌ల్
ట్రైన్
విశాఖలో
బయలుదేరుతోంది.

మరుసటి
రోజు
ఉదయం
11
గంటలకు
దానాపూర్
చేరుకుంటుంది.
అక్కడి
నుంచి
తిరుగు
ప్రయాణంలో
నవంబరు
5వ
తేదిన
మధ్యాహ్నం
12.30
గంటలకు
దానాపూర్
టు
విశాఖ
(08519)
స్పెష‌ల్
ట్రైన్‌
దానాపూర్‌లో
బయలుదేరుతోంది.

మ‌రుస‌టి
రోజు
మధ్యాహ్నం
2.42
గంటలకు
విశాఖ
స్టేష‌న్‌కు
చేరుకుంటుంది.
ఇక‌,

ట్రైన్‌లో
3
థర్డ్‌
ఏసీ,
12
స్లీపర్,
5
జనరల్‌
సెకండ్‌
క్లాస్‌
సిట్టింగ్,
2
సెకండ్‌
క్లాస్‌
కమ్‌
దివ్యాంగజన్‌
బోగీలు
ప్ర‌యాణికుల‌కు
అందుబాటులో
ఉంటాయి.

విశాఖపట్నం
టు
భువనేశ్వర్..

08536
అనే
నెంబ‌ర్‌గ‌ల
విశాఖపట్నం
టు
భువనేశ్వర్
అన్‌రిజర్వుడ్
స్పెష‌ల్
ట్రైన్
నవంబరు
15వ
తేదీ
వరకు
ప్రతి
రోజు
మధ్యాహ్నం
12
గంటలకు
విశాఖలో
బయలుదేరుతోంది.
అదే
రోజు
రాత్రి
7.45గంటలకు
భువనేశ్వర్
చేరుకుంటుంది.
తిరుగు
ప్రయాణంలో
08535
అనే
నెంబ‌ర్‌గ‌ల
భువనేశ్వర్
టు
విశాఖపట్నం
అన్‌రిజర్వుడ్
స్పెష‌ల్
ట్రైన్
నవంబరు
15వ
తేదీ
వరకు
ప్రతి
రోజు
రాత్రి
10.30
గంటలకు
భువనేశ్వర్‌లో
బయలుదేరుతోంది.
మ‌రుస‌టి
రోజు
ఉదయం
8.45
గంటలకు
విశాఖపట్నం
స్టేష‌న్‌కు
వస్తుంది.

ట్రైన్‌లో
10
జనరల్‌
సెకండ్‌
క్లాస్‌
సిట్టింగ్,
1
దివ్యాంగజన్,
1
మోటార్‌
కార్‌
బోగీలు
ప్ర‌యాణికుల‌కు
అందుబాటులో
ఉంటాయి.

26
స్పెష‌ల్
ట్రైన్స్‌..

దక్షిణ
మధ్య
రైల్వే
మొత్తం
26
స్పెష‌ల్
ట్రైన్స్‌ను
ప్ర‌యాణికుల
కోసం
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
కాచిగూడ
టు
నిజాముద్దీన్‌‌‌‌,
నాందేడ్‌‌‌‌
-పానిపట్‌‌‌‌,
నాందేడ్‌‌‌‌-పాట్నా,
ఛాప్రా-యశ్వంత్‌‌‌‌పూర్‌‌‌‌,
చెన్నైటు
అంబాలా
కంటోన్మెంట్‌‌‌‌
మార్గాల్లో
దీపావళి
పండుగ
స్పెష‌ల్
ట్రైన్స్‌ను
తీసుకొచ్చారు.

ప్రత్యేక
రైళ్లతో
పాటుగా
పలు
ప్రధాన
రైల్వే
స్టేషన్లలో
14
అదనపు
కౌంటర్లను
కూడా
అధికారులు
ఏర్పాటు
చేశారు.
ఇందుకోసం
సికింద్రాబాద్,
హైదరాబాద్,
కాచిగూడ,
విజయవాడ,
గుంటూరు,
తిరుపతి
తదితర
స్టేషన్లలో
అదనపు
సిబ్బందిని
కూడా
అధికారులు
నియమించారు.

ఇదిలా
ఉండ‌గా,
దేశవ్యాప్తంగా
దీపావళి,
ఛత్
పండ‌గుల
సమయంలో
ప్రయాణీకుల
రద్దీని
దృష్టిలో
ఉంచుకొని
ఇండియ‌న్
రైల్వే
మ‌రో
ఏడువేల
ప్రత్యేక
రైళ్లు
నడుపుతున్న‌ట్లు
తెలిపింది.
వీటితోపాటు
రైల్వేస్టేష‌న్ల‌లో
ప‌లు
కొత్త
విధానాల‌ను
కూడా
అమ‌ల్లోకి
తీసుకొచ్చింది.
రైళ్లలోని
జనరల్
బోగీల్లో
ఎక్కే
ప్రయాణికుల
సౌకర్యార్థం
రైల్వే
స్టేషన్లలో
ప్లాట్‌ఫాంలపై
క్యూలైన్
విధానాన్ని
అమలు
చేయనున్న‌ట్లు
రైల్వేశాఖ
తెలిపింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Bruno Mars’ ‘I Just Might’ No. 1 on Hot 100 for Second Week

Bruno Mars’ “I Just Might” adds a second week...

Teyana Taylor Sheer Lace Black Dress at Paris Fashion Week

Teyana Taylor is making one fashion statement after another. The...

Sarwat Hussain Digital Media centre opened at Osmania University’s Journalism department

The Department of Journalism and Mass Communication at Osmania...

Kashus Culpepper Talks Debut Album ‘Act I’

Over the past year, Kashus Culpepper’s musical confluence of...