అయోధ్య రాముడి సేవలో చంద్రబాబు..! యోగీ సర్కార్ పై ప్రశంసలు..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీ
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ఇవాళ
ఉత్తర్
ప్రదేశ్
లోని
అయోధ్యలో
ఉన్న
రామాలయాన్ని
దర్శించుకున్నారు.
అక్కడ
ప్రత్యేక
పూజలు
నిర్వహించారు.

సందర్భంగా
ఆయన
అయోధ్య
రామాలయంతో
పాటు
స్థానికంగా
ఉన్న
యోగీ
ఆదిత్యనాథ్
ప్రభుత్వంపైనా
ప్రశంసల
జల్లు
కురిపించారు.
అయోధ్యలో
శ్రీరామదర్శనం
తనకు
కొత్త
శక్తి
ఇచ్చినట్లు
అనంతరం
చంద్రబాబు
ఎక్స్
లో
ట్వీట్
కూడా
చేశారు.

సుపరిపాలనకు
రామరాజ్యమే
బెంచ్
మార్క్
అని
సీఎం
చంద్రబాబు
వ్యాఖ్యానించారు.
మంచి
పరిపాలనను
రామరాజ్యంతోనే
పోల్చుకుంటామని
తెలిపారు.
ఇవాల
అయోధ్యలో
శ్రీరాముడిని
దర్శించుకున్న
ఆయన
ప్రత్యేక
పూజలు
నిర్వహించారు.
అనంతరం
మీడియాతో
మాట్లాడారు.
అత్యుత్తమ
పాలనకు
రాముడి
పాలనే
కొలమానంగా
తీసుకుంటామని
చంద్రబాబు
తెలిపారు.
అయోధ్యలో
నిర్మించిన
రామమందిరం
మన
సంస్కృతి,
సాంప్రదాయాలకు
ప్రతీకగా
నిలుస్తుందని
తెలిపారు.
ఎన్నో
వివాదాల
అనంతరం
ఆలయం
నిర్మితమై
దేశ
ప్రజల
కల
సాకారమైందన్నారు.

భారత్‌లో
ఆధ్యాత్మిక
కేంద్రంగా
అయోధ్య
రామాలయం
మారిందని
చంద్రబాబు
తెలిపారు.
ఆలయ
నిర్మాణంతో
పాటు
యూపీలో
సుపరిపాలన
అందిస్తున్న
యోగీ
ఆదిత్య
నాథ్
ప్రభుత్వాన్ని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ప్రశంసించారు.
దేశంలోని
ఇతర
దేవాలయాలకు
అయోధ్య
రామాలయం
మార్గదర్శకంగా
నిలవాలని
చంద్రబాబు
ఆకాంక్షించారు.
సాంకేతికంగా
ముందుడుగు
వేస్తున్న
భారత్‌ను
ఎవరూ
నిలువరించలేరని
స్పష్టం
చేశారు.
2047
వికసిత్
భారత్
లక్ష్యంలో
యూపీ,
బీహార్‌లు
కూడా
కీలక
పాత్ర
పోషించాలని
అన్నారు.
శ్రీ
రాముడి
దర్శనం
అనంతరం
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ఎక్స్‌లో
స్పందించారు.
‘శ్రీ
రాముడు
పాటించిన
విలువలు
కాలానికి
అతీతంగా
ఎప్పుడూ
స్ఫూర్తినిస్తుంటాయి.
రాముడు
పాటించిన
విలువలు
సుపరిపాలనకు
నిరంతరం
మార్గదర్శంగా
నిలుస్తాయి.
అయోధ్యలో
శ్రీరామ
దర్శనం
నాకు
నూతన
శక్తిని
ఇచ్చింది’
అని
ఎక్స్‌లో
పేర్కొన్నారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related