International
-Korivi Jayakumar
సిరియా
ప్రభుత్వం
సంచలన
నిర్ణయం
తీసుకుంది.
గత
దశాబ్ద
కాలంగా
అంతర్యుద్ధంతో
సతమతమవుతున్న
ఈ
దేశం..
నూతన
సంవత్సరం
సమీపిస్తున్న
తరుణంలో
ఊహించని
షాక్
ఇచ్చింది.
మాజీ
అధ్యక్షుడు
బషర్
అల్-అసద్
పదవీచ్యుతుడైన
తర్వాత..
ఆయన
స్థానంలో
అహ్మద్
అల్-షరా
కొత్త
అధ్యక్షుడిగా
బాధ్యతలు
స్వీకరించారు.
ఈ
క్రమంలోనే
ఇప్పుడు
ఆయన
కొత్త
కరెన్సీ
నోట్లను
విడుదల
చేసి
ప్రపంచ
వ్యాప్తంగా
చర్చనీయాంశంగా
మారారు.
కాగా
గత
సంవత్సరం
సిరియా
మాజీ
అధ్యక్షుడు
బషర్
అల్-అసద్
పదవి
నుంచి
తొలగించబడ్డారు.
ఆయన
స్థానంలో
అహ్మద్
అల్-షరా
కొత్త
అధ్యక్షుడిగా
బాధ్యతలు
చేపట్టారు.
ఇప్పుడు
నూతన
ఏడాదికి
ఒక
రోజు
మాత్రమే
మిగిలి
ఉన్న
సందర్భంలో
దేశం
కోసం
కొత్తగా
రూపొందించిన
కరెన్సీని
అధికారికంగా
ఆవిష్కరించారు.
కొత్త
కరెన్సీలో
మార్పులు..
కొత్త
కరెన్సీ
నోట్లలో
మాజీ
అధ్యక్షుడు
బషర్
అల్-అసద్,
ఆయన
కుటుంబ
సభ్యుల
చిత్రాలను
పూర్తిగా
తొలగించారు.
వాటి
స్థానంలో
గులాబీలు,
నారింజ
పండ్ల
చిత్రాలను
ముద్రించారు.
సిరియా
దేశం
ఘర్షణ,
అస్థిరత
పరిస్థితులను
దాటి..
కొత్తగా
స్థిరమైన
పునర్నిర్మాణ
మార్గంలోకి
పయనిస్తోందనే
సందేశాన్ని
ప్రజలకు
అందించడమే
ప్రభుత్వ
లక్ష్యమని
అధికారులు
వెల్లడించారు.
ఇది
కొత్త
అధ్యాయానికి
నాంది
అని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
అయితే
సంవత్సరాల
తరబడి
జరిగిన
అంతర్యుద్ధం
సిరియా
ఆర్థిక
వ్యవస్థను
పూర్తిగా
కుదేలు
చేసింది.
ఈ
నేపథ్యంలోనే
కొత్త
కరెన్సీ
ద్వారా
కుంటుపడిన
ఆర్థిక
వ్యవస్థను
బలోపేతం
చేయడం..
ప్రజల
విశ్వాసాన్ని
తిరిగి
పొందడం
వంటి
ముఖ్య
లక్ష్యాలను
చేరుకోవడానికి
ప్రస్తుత
పాలకులు
ప్రయత్నిస్తున్నట్లు
అభిప్రాయం
వ్యక్తం
అవుతోంది.
కానీ
సిరియన్
పౌండ్
విలువను
మెరుగుపరచడం
కొత్త
ప్రభుత్వానికి
అతిపెద్ద
సవాళ్లలో
ఒకటిగా
నిలుస్తోంది.
అందులో
భాగంగానే
దేశ
నోట్ల
నుంచి
రెండు
సున్నాలను
తొలగిస్తున్నట్లు
అధికారులు
ప్రకటించారు.
దేశంలో
ద్రవ్యోల్బణం
పెరిగితే..
ప్రజల
రోజువారీ
కొనుగోళ్లు
కూడా
పెరుగుతాయని
అందుకే
కరెన్సీపై
నమ్మకం
తగ్గిపోకుండా
ఈ
చర్యలు
తీసుకున్నట్టు
భావిస్తున్నారు.
ఉదాహరణకు..
ప్రస్తుతం
ఒక
కూల్
డ్రింక్
ధర
£10,000
అయితే..
ఈ
సున్నాలను
తీసివేసిన
తర్వాత
అదే
ధర
£100
అవుతుంది.
ఇది
వస్తువు
వాస్తవ
ధరను
మార్చదని..
కేవలం
లెక్కలను
సులభతరం
చేస్తుందని
అధికారులు
వివరించారు.
అంతే
కాకుండా
జనవరి
1
తర్వాత
10
నుంచి
500
సిరియన్
పౌండ్ల
వరకు
ఉన్న
కొత్త
నోట్లు
చెలామణిలోకి
వస్తాయని
స్పష్టం
చేశారు.
కొత్త
నోట్ల
ముద్రణ..
10
పౌండ్ల
నోటు
–
గులాబీలు
25
పౌండ్ల
నోటు
–
ఆలివ్
50
పౌండ్ల
నోటు
–
నారింజలు
100
పౌండ్ల
నోటు
–
పత్తి
200
పౌండ్ల
నోటు
–
మామిడి
పండ్లు
500
పౌండ్ల
నోటు
–
గోధుమలు
చిత్రీకరించబడ్డాయి.
ఇది
దేశ
వ్యవసాయ
సంపదకు
ప్రతీకగా
ఉంటాయని
చెబుతున్నారు.


