Andhra Pradesh
oi-Sai Chaitanya
తెలుగు
రాష్ట్రాల్లో
సంక్రాంతి
సందడి
మొదలైంది.
సెలవులు
ఖరారు
కావటంతో..
సొంత
ఊర్లకు
వెళ్లేందుకు
తెలుగు
ప్రజలు
సిద్దం
అవుతున్నారు.
సంక్రాంతి
వేళ
ఈ
సారి
కొత్త
అనుభూతి
అందించేందుకు
కారవాన్
టూరిజం
అందుబాటులోకి
వచ్చింది.
ప్రత్యేక
వసతులు..
సరికొత్త
అనుభూతులు
పంచేందుకు
సిద్ధమయ్యాయి.
సంక్రాంతి
వేళ
నాలుగు
ఎంపిక
చేసిన
మార్గాల్లో
ఈ
టూరిజం
ప్యాకేజీలను
ఏపీటీడీసీ
ప్రకటించింది.
ఏపీలో
కారవాన్
టూరిజం
అందుబాటులోకి
వచ్చింది.
నాలుగు
మార్గాల్లో
వీటిని
నడపాలని
నిర్ణయించారు.
ఈ
మేరకు
ఏపీ
పర్యాటకాభివృద్ధి
సంస్థ
(APTDC)
పోర్టల్
ద్వారా
సులభంగా
వాహనాలు
బుక్
చేసుకునే
వెసులుబాటు
కల్పించారు.
ఇందుకోసం
ప్రభుత్వం
రెండు
సంస్థలు
ఎంప్యానల్
చేయగా..నాలుగు
కారవాన్లు
తిరగనున్నాయి.
కేరళ,
కర్ణాటక,
గోవా,
మహారాష్ట్రలో
పర్యాటకుల
కోసం
పెద్దఎత్తున
కారవాన్లను
నడుపుతున్నారు.
కొత్తగా
ఏపీలోనూ
ఈ
తరహా
టూరిజం
అందుబాటులోకి
వచ్చింది.
ప్రయాణికుల
సౌకర్యార్థం
ఈ
వాహనాల్లో
10
నుంచి
12
సీట్లు
ఏర్పాటు
చేశారు.
అదే
విధంగా
మరో
రెండు
ప్రత్యేక
వాహనాలను
అందుబాటులోకి
తీసుకువస్తారు.
సంక్రాంతి
వేళహైదరాబాద్
నుంచి
భీమవరం,
దిండి
వరకు
ప్రత్యేకంగా
6
రోజుల
ప్యాకేజీతో
కారవాన్
నడవనుంది.
ఈ
మార్గంలో
ప్యాకేజీ
రూ.3.50
లక్షలు.
ఈనెల
10,
11,
12
తేదీలకు
బుక్
చేసుకోవచ్చు.
ఆ
రోజు
నుంచి
6
రోజుల
పాటు
ప్యాకేజీ
అమలులో
ఉంటుంది.
ఈ
మూడు
తేదీల్లో
హైదరాబాద్
నుంచి
4
కారవాన్లు
నడపనున్నారు.
సందర్శించాక
పర్యాటకులు
రాత్రుల్లో
కార
వాన్లోనే
నిద్రపోయేలా
వసతి
సౌకర్యాలు
కూడా
ఉంటాయి.
కూర్చొనే
సీట్లనే
మీరు
నిద్రపోయే
విధంగా
మార్చుకోవచ్చు.
వాహనంలో
టీవీ,
ఫ్రిజ్,
వాష్రూం
సదుపాయా
లు
ఉన్నాయి.
కాగా..
ప్రకటించిన
నాలుగు
మార్గాల్లో
విశాఖపట్నం-అరకు,
లంబసింగి
కారవాన్లో
(ఒకటిన్నర
రోజు)
ధర:
రూ.42,500
(10-12
సీట్ల
కారవాన్),
రూ.31,500
(5-6
సీట్లు),
రెండో
మార్గంగా
విశాఖ
పట్నం
నుంచి
సింహాచలం,
అన్నవరం,
పిఠాపురం,
సామర్లకోట,
ద్రాక్
షారామం
మీదుగా
వాడపల్లి
(ఒకటిన్నర
రోజు)
ధర:
రూ.42,500
(10-12
సీట్లు),
రూ.31,500
(5-6
సీట్లు).
మూడో
మార్గంగాహైదరాబాద్-గండికోట
(రెండు
రోజులు)
ధర:
రూ.85,000
(10-12
సీట్లు),
రూ.64,000
(5-6
సీట్లు).
ఇక
నాలుగో
మార్గంలో
హైదరాబాద్-సూర్యలంక
(రెండు
రోజులు)
ధర:
రూ.85,000
(10-12
సీట్లు),
రూ.64,000
(5-6
సీట్లు)
గా
ఖరారు
చేసారు.


