Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రాష్ట్రంలో
సొంత
ఇల్లు
లేని
వారికి
మరొకరి
శుభవార్త
చెప్పింది
తెలంగాణ
ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా
సొంతిల్లు
లేని
నిరుపేదల
సొంతింటి
కల
నిజం
చేయడం
లక్ష్యంగా
ఇందిరమ్మ
ఇళ్ల
పథకాన్ని
తీసుకువచ్చామని
చెప్పిన
ప్రభుత్వం,
యుద్ధ
ప్రాతిపదికన
ఆ
ఇళ్ల
నిర్మాణాన్ని
చేపట్టింది.
ఈ
క్రమంలో
తాజాగా
ఇందిరమ్మ
ఇల్లు
రానివారికి
రాష్ట్ర
రెవిన్యూ
గృహ
నిర్మాణ
శాఖ
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస్
రెడ్డి
శుభవార్త
చెప్పారు.
నిరుపేదలకు
రాజకీయాలకు
అతీతంగా
ఇళ్ళు
నేడు
సూర్యపేట
జిల్లా
హుజూర్నగర్
లోని
రామస్వామి
గుట్ట
వద్ద
ఇందిరమ్మ
ఇళ్ల
నిర్మాణ
పనులను
పరిశీలించిన
వారు
హుజూర్నగర్
లో
నిర్మిస్తున్న
2001
ఇళ్ళను
మార్చి
31వ
తేదీ
నాటికి
పూర్తి
చేయాలని
అధికారులను
ఆదేశించారు.
గడువులోగా
లబ్ధిదారులకు
అందజేయాలని
సూచించారు.
రాజకీయాలకు
అతీతంగా
అర్హులైన
నిరుపేదలకు
ఇల్లు
కేటాయిస్తామని
మంత్రులు
వెల్లడించారు.
వేగవంతంగా
ఇందిరమ్మ
ఇళ్ల
ప్రక్రియ
ఈనెలాఖరులో
ఒక
పారదర్శక
పద్ధతిలో
లబ్ధిదారుల
ఎంపిక
ప్రక్రియను
పూర్తి
చేయాలని
మంత్రి
పొంగులేటి
కలెక్టర్
ను
ఆదేశించారు.
గత
ప్రభుత్వం
గృహనిర్మాణ
శాఖను
నిర్వీర్యం
చేసిందని
పేర్కొన్న
పొంగులేటి,
తమ
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
ఇందిరమ్మ
ఇళ్ల
ప్రక్రియ
వేగవంతంగా
సాగుతుందన్నారు.
ప్రతి
సోమవారం
క్రమం
తప్పకుండా
బిల్లులు
చెల్లిస్తున్నాం
అని
వివరించారు.
ఏప్రిల్
లో
మరో
విడత
గృహాలు
మంజూరు
ఈ
ప్రాజెక్టుకు
2012లో
ఉత్తమ్
కుమార్
రెడ్డి
మంత్రిగా
ఉన్నప్పుడే
అంకురార్పణ
జరిగిందని
ఆయన
గుర్తు
చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా
ఇప్పటికే
22,500
కోట్లతో
4.50
లక్షల
ఇళ్లు
మంజూరు
చేశామని,
ఒక్కో
ఇంటికి
ఐదు
లక్షల
ఆర్థిక
సహాయం
అందిస్తున్నామని
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస్
రెడ్డి
తెలిపారు.
ఏప్రిల్
లో
మరో
విడత
గృహాలు
మంజూరు
చేస్తామని
ఆయన
పేర్కొన్నారు.
వరంగల్
లోనూ
సమీక్షా
సమావేశంలో
పాల్గొన్న
మంత్రి
పొంగులేటి
అంతకు
ముందు
ఉమ్మడి
వరంగల్
జిల్లాలో
అభివృద్ధి
పనులు
వేగవంతం
చేయాలని,
త్వరితగతిన
పూర్తిచేయాలని
రెవెన్యూ,
హౌసింగ్,
సమాచార
పౌర
సంబంధాల
శాఖ
మంత్రి
పొంగులేటి
శ్రీనివాసరెడ్డి
పేర్కొన్నారు.
ఉమ్మడి
వరంగల్
జిల్లా
అభివృద్ధి
పనులకు
సంబంధించి
హన్మకొండలోని
సమీకృత
కలెక్టరేట్
కార్యాలయంలో
జరిగిన
ఈ
సమీక్షలో
ఆయన
కీలక
విషయాలను
చర్చించారు.
ఇందిరమ్మ
ఇళ్ళతో
పాటు
కీలక
అంశాలపై
చర్చ
ఇందిరమ్మ
ఇళ్లను,
2BHK
గృహాలు,
భూభారతి,
యూరియా,
ధాన్య
సేకరణ,
ఎయిర్
పోర్ట్
అభివృద్ధి,
అండర్
గ్రౌండ్
డ్రైనేజీ,
ఇన్నర్
రింగ్
రోడ్,
కాకతీయ
మెగా
టెక్స్టైల్
పార్క్,
భద్రకాళి
మాడవీధులు,
సూపర్
స్పెషాలిటీ
హాస్పిటల్,
వరద
నివారణ
పనులు
వంటి
పలు
అభివృద్ధి
అంశాలను
పరిశీలించారు.
పనుల
పురోగతిపై
అధికారులతో
చర్చించారు.
అభివృద్ధి
పనులను
త్వరితగతిన
పూర్తి
చేయాలని
దిశా
నిర్దేశం
చేశారు.


