Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ
రాజకీయాల్లో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటున్నాయి.
కొత్త
లెక్కలు
తెర
మీదకు
వస్తున్నాయి.
మాజీ
ఐపీఎస్
అధికారి
ఏబీ
వేంకటేశ్వర
రావు
సంచలన
నిర్ణయం
తీసుకున్నారు.
కూటమి
ప్రభుత్వంలో
ఏబీకి
నామినేటెడ్
పోస్టు
ఖరారు
చేసారు.
స్వీకరించేందుకు
ఆయన
తిరస్కరించారు.
కాగా,
జగన్
పైన
పలు
సందర్భాల్లో
కీలక
వ్యాఖ్యలు
చేసిన
ఆయన..
ఇప్పుడు
కూటమి
ప్రభుత్వం
పైన
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
కాగా..
ఇప్పుడు
ఏబీ
వెంకటేశ్వర
రావు
నిర్ణయం
రాజకీయంగా
ఆసక్తిని
పెంచుతోంది.
మాజీ
ఐపీఎస్
అధికారి..
గతంలో
చంద్రబాబు
హయాంలో
నిఘా
చీఫ్
గా
పని
చేసిన
ఏబీ
వేంకటేశ్వర
రావు
కీలక
ప్రకటన
చేసారు.
ఏపీ
పురోగతి
కోసం..
తన
ఆలోచనలకు
అనుగుణంగా
ఉండే
వారితో
కలిసి
త్వరలోనే
రాజకీయ
పార్టీని
ఏర్పాటు
చేస్తానని
ఏబీ
వెంకటేశ్వరరావు
ప్రక
టించారు.
గతేడాది
ఏప్రిల్లో
రాజకీయాల్లోకి
ప్రవేశిస్తున్నట్లు
ప్రకటించిన
అంశాన్ని
గుర్తు
చేసారు.
పార్టీ
ఏర్పాటుకు
కావాల్సిన
ఆర్థిక
బలాన్ని
సమకూర్చుకుంటున్నట్లు
తెలిపారు.
అన్ని
సర్దుబాటు
అయ్యాక
త్వరలోనే
పార్టీని
పెడతానని
వెల్లడించారు.
అదే
విధంగా
ఆసక్తి
ఉన్నవారు,
ప్రజలు
స్వేచ్ఛగా
తమ
అభిప్రాయాలు,
ఆలోచనలు,
భావాలను
పంచుకునేందుకు
విజయవాడలో
ఒక
కేంద్రాన్ని
కూడా
ఏర్పాటు
చేస్తామని
ఏబీ
వెంకటేశ్వరరావు
తెలిపారు.
ఇటీవల
వెనుజులాపై
అమెరికా
చేసిన
దాడిని
ఉద్దేశిస్తూ..
యూఎస్
లాంటి
చిన్న
దేశాలపై
దాడులు
చేస్తున్న
క్రమంలో
భారత్
బలంగా
నిలబడాలని
చెప్పారు.
అయితే
కొన్ని
కార్పొరేట్
శక్తులు
అభివృద్ధి
చెందితే..
దేశం
అభివృద్ధి
చెందినట్లు
కాదన్నారు.
ప్రజలు
కూడా
అభివృద్ధి
చెందాలని
పేర్కొన్నారు.
మరోసారి
జగన్పై
ఘాటు
వ్యాఖ్యలు
చేశారు.
జగన్
మానసిక
వ్యాధితో
బాధపడుతున్నారని
మండి
పడ్డారు.
జగన్
ను
చూసి
కూటమి
ప్రభుత్వం
భయపడుతోందనే
అనుమానం
కలుగుతుందని
ఏబీ
వేంకటేశ్వర
రావు
వ్యాఖ్యానించారు.
రాజధాని
అమరావతి
కోసం
రెండో
విడత
భూసేకరణను
కూడా
ఏపీ
వెంకటేశ్వరరావు
సరి
కాదనే
అభిప్రాయం
వ్యక్తం
చేసారు.
రెండోసారి
భూములు
తీసుకుని
ఏం
చేస్తారని
ప్రశ్నించారు.
కూటమి
ప్రభుత్వం
పిరికిది
అంటూ
ఏబీ
వేంకటేశ్వర
రావు
చేసిన
వ్యాఖ్యలు
ఆసక్తి
కరంగా
మారాయి.
అమరావతికి
వ్యతిరేకంగా
రైతులు..
మహిళలను
నాడు
అధికారంలో
ఉన్న
సమయంలో
జగన్
వేధించారని
వ్యాఖ్యానించారు.
అందుకే
జగన్
పార్టీ
11
సీట్లకు
పరిమితం
అయిందని
చెప్పుకొచ్చారు.
కేంద్ర
ప్రభుత్వ
నిర్ణయాల
పైన
ఆయన
తన
అభిప్రాయాలను
వ్యక్తం
చేసారు.
కాగా..
ఇప్పుడు
ఏబీ
వెంకటేశ్వర
రావు
రాజకీయంగా
పార్టీని
ఏర్పాటు
చేస్తే
ఎవరికి
నష్టం
జరుగుతుందనే
చర్చ
మొదలైంది.
పార్టీ
ప్రకటన..
మద్దతుగా
నిలిచే
వారి
విషయంలో
ఆసక్తి
కర
చర్చ
జరుగుతోంది.


