ఆ పథకంతో తెలంగాణాకు అదనంగా 340కోట్ల రూపాయలు.. కావాలా వద్దా!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

గ్రామాలకు
ఆస్తులను
సృష్టించే
పథకం,
ప్రతి
ఒక్కరికి
125
రోజుల
పనిని
కల్పించే
పథకం,
నేరుగా
డబ్బులు
రైతుల
కూలీల
ఖాతాలోనే
పడే
పథకమైన
”వీబీ-జీ
రామ్
జీ”
పథకం
పై
కాంగ్రెస్
అక్కసు
వెళ్ళగక్కుతుంది
అని
కేంద్ర
మంత్రి
బండి
సంజయ్
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.

పథకం
వల్ల
తెలంగాణకు
అదనంగా
రూ.340
కోట్లు
రాబోతున్నాయి
అని,
దీనివల్ల
తెలంగాణకు
మేలు
జరుగుతుందని
ఆయన
అభిప్రాయపడ్డారు.


ఇదొక
అద్భుత
పథకం
:
బండి
సంజయ్

ప్రజలకు
మంచి
జరుగుతుంటే
కాంగ్రెస్
పార్టీ
ఓర్చుకోలేక
పోతుందని
ఆయన
అసహనం
వ్యక్తం
చేశారు.కేంద్ర
ప్రభుత్వం
ప్రవేశపెట్టిన
”వీబీ-జీ
రామ్
జీ”
పథకం
గ్రామీణ
పేదల
జీవితాల్లో
గుణాత్మక
మార్పు
తీసుకొచ్చే
అద్భుతమైన
పథకమని
పేర్కొన్న
కేంద్ర
మంత్రి
బండి
సంజయ్
కుమార్
అన్నారు.
వ్యవసాయ
సీజన్‌లో
కూలీల
కొరతతో
ఇబ్బందులు
ఎదుర్కొంటున్న
రైతులకు

పథకం
ద్వారా
ఉపశమనం
లభిస్తుందని
అన్నారు.


తెలంగాణాకు
అదనంగా
రూ.340
కోట్లు

కరీంనగర్‌లోని
త్రిధా
హోటల్‌లో
నిర్వహించిన
మీడియా
సమావేశంలో
బండి
సంజయ్
మాట్లాడుతూ,
గతంతో
పోలిస్తే

నూతన
చట్టబద్ధ
ఉపాధిహామీ
పథకం
ద్వారా
కేంద్ర
ప్రభుత్వం
దేశవ్యాప్తంగా
అదనంగా
రూ.17వేల
కోట్లు
ఖర్చు
చేయబోతోందని
వెల్లడించారు.
తెలంగాణ
రాష్ట్రానికి
సైతం
గత
ఏడాదితో
పోలిస్తే
సుమారు
రూ.340కోట్లు
అదనంగా
రానున్నాయని
తెలిపారు.

పథకం
కింద
ఏటా
రూ.1.51లక్షల
కోట్లకు
పైగా
వ్యయం
అవుతుందని
ప్రభుత్వ
అంచనాలను
వెల్లడించారు.


కాంగ్రెస్
ది
అనవసరపు
రాద్ధాంతం

ఇంత
మంచి
పథకం
కేంద్ర
అమలు
చేస్తుంటే
కాంగ్రెస్
అనవసరపు
రాద్ధాంతం
చేస్తుందని
ఆయన
అన్నారు.
”వీబీ
జీ
రామ్
జీ”
పథకం
కేంద్ర,
రాష్ట్ర
భాగస్వామ్యంతో
అమలవుతుందని,
ఇందులో
కేంద్రం
వాటా
రూ.95,692
కోట్లు
కాగా,
రాష్ట్రాల
వాటా
కలిపి
రూ.55,589
కోట్లు
ఉంటాయని
వివరించారు.
గ్రామ
సభల
ద్వారా
పనుల
ఎంపిక
జరగడం
వల్ల
గ్రామానికి
అవసరమైన
పనులు
ప్రజలే
నిర్ణయిస్తారని
చెప్పారు.


మీరు
పథకాల
పేర్లు
మార్చలేదా

కేంద్ర
ప్రభుత్వం
గైడ్‌గా
మాత్రమే
వ్యవహరిస్తుందని,
ఎలాంటి
అజమాయిషీ
ఉండదన్నారు.
పథకానికి
గాంధీ
పేరును
తీసేయడంపై
కాంగ్రెస్
అనవసర
రాద్ధాంతం
చేస్తోందని
మండిపడ్డారు.
గతంలో
కాంగ్రెస్
ప్రభుత్వాలే
పథకాల
పేర్లు
మార్చిన
ఉదాహరణలను
గుర్తు
చేశారు.
మహాత్ముడి
ఆశయాలను
తుంగలో
తొక్కిన
వాళ్లే
ముసలి
కన్నీరు
కారుస్తున్నారు
అంటూ
మండిపడ్డారు.
వాంబే
ఇళ్ల
స్కీమ్
పథకంలో
వాల్మీకి,
అంబేద్కర్
పేర్లను
ఎందుకు
తొలగించారో
చెప్పాలని
ప్రశ్నించారు.


కాంగ్రెస్
వి
నీచ
రాజకీయాలు

ఎయిర్
పోర్ట్
కు
ఎన్టీఆర్
పేరును
తొలగించి
రాజీవ్
గాంధీ
పేరు
పెట్టలేదా
అంటూ
నిలదీశారు.
మీరు
చేస్తే
సంసారం
మేము
చేస్తే
వ్యభిచారమా
అంటూ
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ప్రజలకు
మంచి
జరిగే

నూతన
పథకం
కావాలా..
వద్దా
అంటూ
బండి
సంజయ్
ప్రజలను
ప్రశ్నించారు.
వి
బి
జి
రామ్
జీ
పథకం
పైన
రాజకీయాలు
చేయడం
కాంగ్రెస్
నీచ
రాజకీయాలకు
నిదర్శనమని
విమర్శించారు.
గ్రామీణ
పేదలకు
ఉపాధి,
రైతులకు
మేలు
చేసే

పథకాన్ని
అడ్డుకోవడం
సరికాదని
స్పష్టం
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related