Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
రాజకీయాల్లో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటున్నాయి.
ఎమ్మెల్యేల
అనర్హత
పైన
కొంత
కాలంగా
విచారణ
కొనసాగుతోంది.
సుప్రీం
కోర్టు
ఇప్పటికే
ఈ
అంశం
పైన
తేల్చేందుకు
కాల
పరిమితి
విధించింది.
ఎమ్మెల్యేల
అనర్హత
పిటీషన్ల
పైన
విచారణ
చేసిన
స్పీకర్
ఇప్పటికే
అయిదు
గురు
విషయంలో
తీర్పు
వెలువరించారు.
ఈ
రోజు
మరో
ఇద్దరి
విషయంలో
స్పీకర్
తన
నిర్ణయం
వెలువరించారు.
ఇప్పుడు
ఈ
తీర్పు
రాజకీయంగా
కీలక
మలుపుగా
మారనుంది.
తెలంగాణ
స్పీకర్
గడ్డం
ప్రసాదరావు
నేడు
మరో
ఇద్దరు
ఎమ్మెల్యేల
అనర్హతపై
తీర్పు
వెల్లడిం
చారు.
బీఆర్ఎస్
ఎమ్మెల్యేల
ఫిరాయింపు
కేసులో
ఇప్పటికే
ఐదుగురు
ఎమ్మెల్యేలకు
సంబంధించి
ఎటువంటి
ఆధారాలు
లభించలేదని
స్పీకర్
గడ్డం
ప్రసాదరావు
తీర్పు
చెప్పారు.
బీఆర్ఎస్
నుంచి
మొత్తం
పది
మంది
ఎమ్మెల్యేలు
కాంగ్రెస్
లో
చేరారంటూ
బీఆర్ఎస్
ఫిర్యాదు
చేసింది.
సుప్రీం
కోర్టులో
పిటీషన్
దాఖలు
చేసింది.
విచారణ
సమయంలో
సుప్రీంకోర్టు
అసెంబ్లీ
స్పీకర్
కు
ఈ
అంశం
పైన
నిర్ణయం
వెలువరించటానికి
సమయం
నిర్దేశించింది.
కాగా,
విచారణ
చేసిన
స్పీకర్
ముందుగా
పది
మందిలో
అయిదుగురు
ఎమ్మెల్యేలు
నోటీసులకు
ఇచ్చిన
సమాధానం
ఆధారంగా
నిర్ణయం
తీసుకున్నారు.
వారు
పార్టీ
ఫిరాయించినట్లు
ఆధారాలు
లేవని
పేర్కొన్నారు.
ఇక..
ఇప్పుడు
మరో
ఇద్దరి
విషయంలోనూ
తీర్పు
వెల్లడించారు.
మిగిలిన
అయిదుగురిలో
కాలే
యాదయ్య,
పోచారం
శ్రీనివాస్
రెడ్డిలకు
సంబంధించి
అనర్హత
పిటీషన్
పై
విచారణ
తర్వాత
స్పీకర్
గడ్డం
ప్రసాదరావు
తన
నిర్ణయాన్ని
ప్రకటించారు.
గతంలో
తీర్పు
ఇచ్చిన
అయిదుగురు
తరహాలోనే
ఈ
ఇద్దరి
విషయంలోనూ
అదే
తరహా
తీర్పును
స్పీకర్
వెల్లడించారు.
ఈ
ఇద్దరు
పార్టీ
ఫిరాయించినట్లు
ఆధారాలు
లేవని
తేల్చి
చెప్పారు.
కాగా..
మిగిలిన
ముగ్గురు
ఖైరతాబాద్
ఎమ్మెల్యే
దానం
నాగేందర్,
స్టేషన్
ఘన్
పూర్
కు
చెందిన
కడియం
శ్రీహరి
తో
పాటుగా
సంజయ్
పైన
నిర్ణయం
తీసుకోవాల్సి
ఉంది.
కాగా..
దానం,
కడియం
విషయంలో
మాత్రం
ఇంకా
సస్పెన్స్
కొనసాగుతోంది.
ఈ
ఇద్దరు
స్పీకర్
నోటీసులకు
సమాధానం
ఇవ్వటానికి
మరింత
సమయం
కోరారు.
ఇక..
ఇప్పుడు
ఈ
ఇద్దరి
విషయంలో
స్పీకర్
తన
నిర్ణయం
వెల్లడించటంతో
మిగిలిన
ముగ్గురు
విషయంలో
ఎలాంటి
పరిణామాలు
చోటు
చేసుకుంటాయనేది
ఆసక్తి
కరంగా
మారుతోంది.


