భద్రాచలానికి మహర్దశ.. అయోధ్యను తలపించేలా: సీఎం రేవంత్ రెడ్డి

Date:


Telangana

oi-Dr Veena Srinivas

భద్రాచలంలోని
శ్రీ
సీతారామచంద్ర
మూర్తి
ఆలయానికి
మహర్దశ
పట్టనుంది.
సాక్షాత్తు
అయోధ్యలోని
రామాలయాన్ని
తలపించేలా
భద్రాద్రి
రామయ్య
ఆలయాన్ని
నిర్మిస్తామని
తెలంగాణ
సీఎం
రేవంత్
రెడ్డి
శుభవార్త
చెప్పారు.
తెలంగాణ
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
ఆదివారం
ఖమ్మంలో
రూ.362
కోట్ల
విలువైన
అభివృద్ధి
పనులకు
శంకుస్థాపన
చేశారు.
అనంతరం
జరిగిన
సభలో
మాట్లాడుతూ,
తన
రాజకీయ
ప్రస్థానం
ఖమ్మం
జిల్లా
నుంచే
మొదలైందని
గుర్తు
చేసుకున్నారు.


అయోధ్యను
తలపించేలా
భద్రాద్రి
ఆలయాన్ని
నిర్మిస్తాం

ఇదే
సమయంలో
ఖమ్మం
జిల్లాకు
వరాలను
ప్రకటించారు.
ఇందులో
అత్యంత
ముఖ్యమైన
భద్రాద్రి
శ్రీ
సీతారామచంద్ర
స్వామి
ఆలయం
గురించి
కీలక
ప్రకటన
చేశారు.తెలంగాణ
రాష్ట్రంలో
ఆలయాలను
అద్భుతంగా
నిర్మిస్తున్నామని,
అభివృద్ధి
చేస్తున్నామని
చెప్పిన
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
అయోధ్యను
తలపించేలా
భద్రాద్రి
ఆలయాన్ని
నిర్మించి
తీరుతాం
అన్నారు.


భద్రాద్రి
ఆలయ
అభివృద్ధికి
భూసేకరణ

గతంలో
కెసిఆర్
ముఖ్యమంత్రిగా
ఉన్న
సమయంలో
భద్రాచలానికి
100
కోట్ల
రూపాయలు
ఇస్తానని
హామీ
ఇచ్చారని,

హామీని
నెరవేర్చలేదని
గుర్తు
చేశారు.
తమ
ప్రభుత్వ
హయాంలో
భద్రాచలం
ఆలయాన్ని
అభివృద్ధి
చేయడానికి
భూ
సేకరణ
జరుగుతోందని
ఆయన
అన్నారు.
భూసేకరణ
పూర్తయిన
తర్వాత
అత్యద్భుతంగా
భద్రాద్రి
శ్రీ
సీతారామచంద్ర
మూర్తి
ఆలయాన్ని
నిర్మిస్తామని
బహిరంగ
సభ
వేదికగా
సీఎం
రేవంత్
రెడ్డి
ప్రకటించారు.


భద్రాచలానికి
మహర్దశ

దీంతో
స్థానికులు
సీఎం
ప్రకటనతో
భద్రాచలానికి
మహర్దశ
పట్టబోతుంది
అని
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.
ఎంతో
చారిత్రక
వైభవం,
ప్రాశస్త్యం
ఉన్నటువంటి
భద్రాచలం
ఆలయాన్ని,
అయోధ్య
రామాలయం
తరహాలో
అభివృద్ధి
చేయాలని
సంకల్పించినట్టు
సీఎం
రేవంత్
రెడ్డి
చెప్పడం
ఖమ్మం
జిల్లా
వాసులకు
సంతోషం
కలిగించింది.
ఇక
ఇదే
సమయంలో
సీఎం
రేవంత్
రెడ్డి
తమ
ప్రభుత్వ
హయాంలో
అమలవుతున్న
అభివృద్ధి
సంక్షేమ
కార్యక్రమాల
పైన
కీలక
వ్యాఖ్యలు
చేశారు.


కాంగ్రెస్
హయాంలోనే
సంక్షేమం,
అభివృద్ధి

మంత్రి
ఉత్తమ్
కుమార్
సారథ్యంలో
ఉచితంగా
సన్నబియ్యం
అందిస్తున్నామని
చెబుతూ,
ఎన్టీఆర్
ఆశయ
సాధనే
ఆయనకు
ఘన
నివాళి
అని
వ్యాఖ్యానించారు.
గత
ప్రభుత్వ
హయాంలో
రేషన్
కార్డు
రావాలంటే
ఎవరో
ఒకరు
చనిపోవాలనే
పరిస్థితి
ఉండేదని,
కానీ
కాంగ్రెస్
ప్రభుత్వ
హయాంలో
లక్షలాది
రేషన్
కార్డులు
ప్రజలకు
అందించామని
రేవంత్
రెడ్డి
గుర్తు
చేశారు.
సమస్యల
పరిష్కారానికి
కూడా
తమ
ప్రభుత్వం
కృషి
చేస్తుందన్నారు.


అన్ని
వర్గాల
సంక్షేమానికి
కట్టుబడి
పని
చేస్తున్నామన్న
సీఎం

కాంగ్రెస్
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
నాలుగున్నర
లక్షల
ఇందిరమ్మ
ఇళ్ళను
పంపిణీ
చేసి,
గృహ
నిర్మాణ
బాధ్యతలను
కూడా
తీసుకుందని
వివరించారు.
బీఆర్ఎస్
ప్రభుత్వ
హయాంలో
పేదల
ఇళ్ల
పైన
కుట్ర
చేసిందని
రేవంత్
రెడ్డి
ఆరోపించారు.
తమ
ప్రభుత్వం
అన్ని
వర్గాల
సంక్షేమానికి
కట్టుబడి
పని
చేస్తుందని
ఆయన
అన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Independent Venue Week 2026 kicks off with over 700 shows across the UK

Independent Venue Week is kicking off the 2026 edition...

This Shopper-Loved Wireless Bra Is Just $15 at Target

Even the coziest winter sweater can feel uncomfortable...

Myke Towers Teams With Taco Bell for Taco Tuesday Campaign: Interview

Taco Tuesday just got tastier. Puerto Rican superstar Myke...

Memory chip shortage to last through 2027: Synopsys CEO

LEDs light up in a server rack in a...