Andhra Pradesh
oi-Sai Chaitanya
ముఖ్యమంత్రి
చంద్రబాబు
కీలక
నిర్ణయం
తీసుకున్నారు.
ఎన్నికల
సమయంలో
ఇచ్చిన
హామీ
అమలు
దిశగా
ముహూర్తం
ఫిక్స్
చేసారు.
ఉగాది
నాటికి
రెండు
నిర్ణయాలు
అందుబాటులోకి
తీసు
కొచ్చే
విధంగా
నిర్ణయించారు.
ఈ
మేరకు
ప్రభుత్వం
కసరత్తు
ప్రారంభించింది.
దీని
ద్వారా
గ్రామీణ
ప్రాంతాల్లోని
పేదలకు
ప్రయోజనం
దక్కనుంది.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
దావోస్
పర్యటన
వేళ
ఈ
మేరకు
కొత్త
నిర్ణయాలు
ప్రకటించారు.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
మరో
హామీ
అమలు
దిశగా
స్పష్టత
ఇచ్చారు.
తాము
అధికారంలోకి
వస్తే
రాష్ట్ర
వ్యాప్తంగా
అన్నా
క్యాంటీన్ల
విస్తరణ..
పేదలకు
ఇళ్ల
పథకం
అమలు
చేస్తామని
ఎన్నికల
సమయంలో
హామీ
ఇచ్చారు.
అందులో
భాగంగా
ఇప్పటికే
రాష్ట్రంలో
అన్నా
క్యాంటీన్లు
పలు
ప్రాంతాల్లో
కొనసాగుతున్నాయి.
ఇక..
గ్రామీణ
ప్రాంతంలోనూ
ప్రారంభించేందుకు
ముహూర్తం
ఖరారు
చేసారు.
ఉగాది
నాడు
రాష్ట్ర
వ్యాప్తంగా
గ్రామీణ
ప్రాంతంలో
700
అన్నా
క్యాంటీన్లను
ప్రారంభించాలని
నిర్ణయించారు.
అదే
విధంగా
పేదలకు
ఇళ్ల
పథకం
పైనా
ప్రకటన
చేసారు.
ఉగాది
నాడు
రాష్ట్ర
వ్యాప్తంగా
అయిదు
లక్షల
కొత్త
ఇళ్లను
లబ్దిదారులకు
అందించి..
ఒకే
ముహుర్తాన
గృహప్రవేశాలు
నిర్వహించనున్నట్లు
సీఎం
చంద్రబాబు
ప్రకటించారు.
ఉగాది
నుంచి
మండల
కేంద్రాల్లో
కూడా
అన్న
క్యాంటీన్లు
ఏర్పాటు
అవుతాయన్నారు.
మండల
కేంద్రాల్లో
కూడా
వీటిని
ఏర్పాటు
చేయాలని
ఎమ్మెల్యేల
నుంచి
వినతులు
వచ్చాయని..
దీనికి
అనుగుణంగా
సానుకూల
నిర్ణయం
తీసుకున్నట్లు
ప్రకటించారు.
తొలుత
ప్రభుత్వం
ఈ
సంక్రాంతికే
కొత్త
అన్న
క్యాంటీన్లను
ప్రారంభించాలని
భావించింది.
అయితే,
ఉగాది
నుంచి
ప్రారంభించాలని
డిసైడ్
అయ్యారు.
ఇక,
వచ్చే
మూడేళ్లల్లో
17
లక్షల
ఇళ్ల
నిర్మాణమే
లక్ష్యంగా
నిర్ణయించుకున్నట్లు
స్పష్టం
చేశారు.
ఇళ్ల
లబ్ధిదారుల
సర్వేను
త్వరితగతిన
పూర్తి
చేయాలని
తేల్చిచెప్పారు.
ఇప్పటి
నుంచే
లక్ష్యాలు
పెట్టుకుని
హౌసింగ్
ఫర్
ఆల్
కార్యక్రమా
న్ని
2029
జనవరి
నాటికి
పూర్తి
చేయాలని
ఆదేశించారు.
ప్రస్తుతం
గుర్తించిన
లబ్ధిదారులే
కాకుండా
ఇంకా
అర్హులైన
వారిని
గుర్తించి
చేర్చేందుకు
చేస్తున్న
సర్వేను
త్వరగా
పూర్తి
చేసి
జాబితా
సిద్ధం
చేయాలని
సీఎం
ఆదేశించారు.
ఆ
జాబితాను
గ్రామాల
వారీగా
ప్రదర్శించాలని
చెప్పారు.
ప్రజలు
తృప్తి
చెందితేనే
తనకు
సంతృప్తి
అని
వెల్లడించారు.
గృహ
నిర్మాణాల్లో
భాగంగా
ఎవరైనా
స్థలం
కావాలని
అడిగితే
స్థలం
ఇవ్వాలని,
తమకు
స్థలాలు
ఉన్నాయని
లబ్ధిదారులు
చెబితే
వాళ్లకు
పొజిషన్
సర్టిఫికెట్లు
ఇవ్వాలన్నారు.
ఇళ్ల
నిర్మాణాలకు
సంబంధించి
ప్రతి
పురోగతి
ఆన్లైన్లో
ఉండేలా
చూడాలని
దిశానిర్దేశం
చేశారు.


