India
oi-Bomma Shivakumar
కరూర్
తొక్కిసలాట
ఘటనలో
తమిళ
స్టార్
హీరో,
టీవీకే
పార్టీ
అధ్యక్షుడు
విజయ్
సీబీఐ
విచారణ
ముగిసింది.
విజయ్
ను
సీబీఐ
అధికారులు
సుమారు
6
గంటలపాటు
ప్రశ్నించారు.
ఇవాళ
అనుమానితుడిగా
సీబీఐ
ప్రశ్నించింది.
అలాగే
మొన్న
సాక్షిగా
ప్రశ్నించింది.
ఈ
మేరకు
ఫిబ్రవరి
రెండో
వారంలో
విజయ్
పేరుతో
ఛార్జిషీట్
వేసే
అవకాశం
ఉన్నట్లు
తెలుస్తోంది.
తమిళనాడులోని
కరూర్
కార్నర్
మీటింగ్
లో
జరిగిన
తొక్కిసలాటలో
41
మంది
మృతి
చెందిన
విషయం
తెలిసిందే.
అయితే
ఈ
కేసులో
టీవీకే
పార్టీ
అధ్యక్షుడు
విజయ్
పేరును
చేర్చనున్నట్లు
సమాచారం
అందుతోంది.
తాజాగా
విజయ్
సీబీఐ
విచారణ
ముగిసింది.
సీబీఐ
అధికారులు
సుమారు
6
గంటలపాటు
విజయ్
పై
ప్రశ్నల
వర్షం
కురిపించారు.
ఈ
మేరకు
ఫిబ్రవరి
రెండో
వారంలో
విజయ్
పేరుతో
ఛార్జిషీట్
వేసే
అవకాశం
ఉంది.
ఈ
ఏడాది
తమిళనాడులో
అసెంబ్లీ
ఎన్నికల
నేపథ్యంలో
విజయ్
సీబీఐ
విచారణకు
హాజరు
కావడం
చర్చనీయాంశంగా
మారింది.
కరూర్
తొక్కిసలాట
కేసును
ప్రస్తుతం
సీబీఐ
విచారిస్తున్న
విషయం
తెలిసిందే.
ఈ
క్రమంలో
ఈ
కేసుతో
సంబంధం
ఉన్నవారందరినీ
దిల్లీలో
ఉన్న
కార్యాలయానికి
రప్పించి
ప్రశ్నిస్తోంది.
ఇందులో
భాగంగానే
ఈ
నెల
12
న
విజయ్
ను
సీబీఐ
అధికారులు
సుమారు
ఆరు
గంటలపాటు
ప్రశ్నించారు.
ఈ
సందర్భంగా
కరూర్
తొక్కిసలాట
ఘటనతో
టీవీకే
పార్టీకి
ఎలాంటి
సంబంధం
లేదని
తెలిపారు.
అయినా
మరోసారి
హాజరు
కావాలని
చెప్పడంతో
డిసెంబర్
19న
దిల్లీ
సీబీఐ
కార్యాలయానికి
వచ్చారు.
ఇక
ఈ
ఏడాది
తమిళనాడులో
అసెంబ్లీ
ఎన్నికలు
జరగనున్న
విషయం
తెలిసిందే.
ఈ
క్రమంలో
అన్ని
పార్టీలు
సన్నద్ధం
అవుతున్నాయి.
ఈ
క్రమంలో
విజయ్
సీబీఐ
విచారణకు
హాజరుకావడం
చర్చనీయాంశంగా
మారింది.
మరోవైపు
విజయ్
నటించిన
చివరి
సినిమా
జన
నాయగన్
ఈ
సంక్రాంతికి
విడుదల
కావాల్సి
ఉండగా
అది
వాయిదా
పడిన
విషయం
తెలిసిందే.
ఈ
మేరకు
ఈ
సినిమాపై
వివాదం
నడుస్తోంది.


