India
oi-Syed Ahmed
దేశవ్యాప్తంగా
వివిధ
రాష్ట్రాల్లో
ప్రత్యేక
ఓటర్ల
జాబితాల
సవరణ
పేరుతో
ఎన్నికల
సంఘం
చేస్తున్న
ప్రహసనానికి
బెంగాల్లో
సుప్రీంకోర్టు
షాకిచ్చింది.
పశ్చిమ
బెంగాల్లో
జరుగుతున్న
ఓటరు
జాబితాల
సవరణ
వల్ల
ప్రజలు
ఎదుర్కొంటున్న
ఒత్తిడిని
ఎన్నికల
సంఘం
అర్థం
చేసుకోవాలని
సుప్రీంకోర్టు
ఎన్నికల
సంఘాన్ని
సూచించింది.
తార్కిక
వ్యత్యాస
వర్గం
కింద
నోటీసులు
అందుకున్న
ఓటర్ల
పేర్లను
విడుదల
చేయాలని
సుప్రీంకోర్టు
ఈసీని
సుప్రీం
ఆదేశించింది.
ప్రస్తుతం
బెంగాల్లో
జరుగుతున్న
ఓటర్ల
జాబితాల
సవరణలో
భాగంగా
ఈసీ
ప్రధానంగా
మూడు
వర్గాలకు
నోటీసులు
ఇస్తోంది.
ఇందులో
మ్యాప్
చేయబడినవి,
మ్యాప్
చేయనివి,
తార్కిక
వ్యత్యాసాలు
ఉన్నవి
ఉన్నాయి.
మ్యాప్
చేసిన
వర్గంలో
ఓటర్ల
డేటాకు
అనుసంధానించిన
రికార్డులు
లేని
ఓటర్లు
ఉన్నారు.
అలాగే
మ్యాప్
చేయని
వర్గంలో
ఎన్నికల
డేటాకు
అనుసంధానించిన
రికార్డులు
లేని
ఓటర్లూ
ఉన్నారు.
వీటితో
పాటు
తార్కిక
వ్యత్యాసాల
వర్గంలో
తల్లిదండ్రుల
పేర్లలో
అసమతుల్యత,
విభిన్న
స్పెల్లింగ్లు,
పిల్లలు,
తల్లిదండ్రుల
మధ్య
నమ్మశక్యం
కాని
వయస్సు
అంతరాలు
వంటి
సమస్యలుు
ఉన్నాయి.
ఈ
వర్గం
కింద
నోటీసులు
జారీ
చేసిన
సుమారు
1.25
కోట్ల
మంది
పేర్లను
బహిర్గతం
చేయాలని
సుప్రీంకోర్టు
ఇవాళ
ఈసీని
ఆదేశించింది.
ఈ
పేర్లను
గ్రామ
పంచాయతీలు,
బ్లాక్
కార్యాలయాలు,
వార్డు
కార్యాలయాలలో
ప్రదర్శించాలని,
నోటీసులు
అందిన
వారికి
పత్రాలను
సమర్పించడానికి
తగినంత
సమయం
ఇవ్వాలని
కోర్టు
పేర్కొంది.
అలాగే
విచారణల
సమయంలో
తగినంత
సిబ్బందిని
నియమించాలని,
స్థానిక
అధికారులు
అందుకున్న
పత్రాలకు
రశీదులు
అందించాలని,
అభ్యంతరాలపై
తుది
నిర్ణయం
కోసం
కారణాలను
వెల్లడించాలని
పేర్కొంది.


