Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రాష్ట్రంలో
ట్రాఫిక్
నిబంధనలు
పాటించని
వాహనదారులపైన
కఠిన
చర్యలు
తీసుకోమని
ట్రాఫిక్
నిబంధనలను
కఠినతరం
చేస్తూ
చలాన్ల
చెల్లింపులో
రాయితీలు
ఉండవని
తెలంగాణ
సీఎం
రేవంత్
రెడ్డి
స్పష్టం
చేసిన
విషయం
తెలిసిందే.
అంతేకాదు
ట్రాఫిక్
ఈ
చలాన్
లను
ఆటో
డెబిట్
చేసే
ప్రతిపాదనను
కూడా
సీఎం
రేవంత్
రెడ్డి
చేయడం
రాష్ట్రవ్యాప్తంగా
ప్రజల
నుంచి
విమర్శలకు
కారణమైంది.
వాహనదారులకు
భారీ
ఊరట
కల్పించిన
హైకోర్టు
ఇదే
సమయంలో
తాజాగా
వాహనదారులకు
రాష్ట్ర
హైకోర్టు
భారీ
ఊరట
కల్పించింది.
పెండింగ్
చలాన్ల
వసూలు
విషయంలో
కీలక
తీర్పును
వెల్లడించింది.
న్యాయవాది
విజయ్
గోపాల్
దాఖలు
చేసిన
పిటిషన్
పైన
విచారణ
జరిపిన
హైకోర్టు
ధర్మాసనం
ఈ
కీలక
ఆదేశాలను
జారీ
చేసింది.
రోడ్లపైన
పోలీసులు
బలవంతపు
చలాన్ల
వసూళ్లను
చేయరాదని,
వాహనాల
కీలు
లాక్కోవడాన్ని
హైకోర్టు
నిషేధించింది.
ట్రాఫిక్
పోలీసుల
చలాన్ల
వసూళ్ళపై
ఫిర్యాదులతో
హైకోర్టు
కీలక
తీర్పు
బకాయిలను
కచ్చితంగా
చట్టపరమైన
పద్ధతిలోనే
వసూలు
చేసుకోవాలని
స్పష్టం
చేసింది.
చలాన్ల
పేరుతో
ట్రాఫిక్
పోలీసులు
వాహనదారులను
ఇబ్బందులకు
గురి
చేస్తున్న
క్రమంలో
వారిపై
వస్తున్న
ఫిర్యాదుల
నేపథ్యంలో
న్యాయస్థానం
కీలక
ఆదేశాలను
ఇచ్చింది.
ట్రాఫిక్
పోలీసులు
తనిఖీలు
చేపట్టిన
సమయంలో
బలవంతంగా
చలాన్లు
వసూలు
చేయడం,
వాహనాల
కీలను
లాక్కోవడం,
వాహనాలను
అక్కడే
నిలిపి
ట్రాఫిక్
ఆటంకం
కలిగించడం
వంటి
వాటిపైన
ఫిర్యాదులతో
హైకోర్టు
ఈ
కీలకతీర్పును
ఇచ్చింది.
బలవంతంగా
వసూళ్లు
చేయరాదన్న
హైకోర్టు
బలవంతంగా
చలాన్లు
వసూలు
చేయకూడదని
పేర్కొంది.
రోడ్లపైన
ట్రాఫిక్
నిలిపి
ట్రాఫిక్
అంతరాయం
కలిగించకూడదని
వెల్లడించింది.
పోలీసుల
విధులు
నిబంధనలను
పర్యవేక్షించడమేనని,
వసూళ్ల
కోసం
వాహనదారులను
వేధించడం
చట్ట
విరుద్ధమని
కోర్టు
ఈ
సందర్భంగా
స్పష్టం
చేసింది.
వాహనదారులు
స్వచ్ఛందంగా
ముందుకు
వస్తేనే
చలాన్లు
తీసుకోవాలని,
బలవంతంగా
చెల్లించేలా
చేయకూడదని
హైకోర్టు
స్పష్టం
చేసింది.
కోర్టు
నుండి
నోటీసులు
పంపాలని
సూచించిన
కోర్టు
ట్రాఫిక్
పోలీసులు
పెండింగ్
చలాన్ల
వసూళ్లకు
చట్టబద్ధమైన
ప్రక్రియను
అనుసరించాలి
కానీ,
బలవంతపు
వసూళ్లు
చేయడం
మంచిది
కాదని
పేర్కొంది.
చట్టబద్ధంగా
కోర్టు
నుంచి
నోటీసులు
పంపాలని
ఆదేశించింది.
నేరుగా
రోడ్ల
పైన
వసూళ్లు
చేయడం
సరికాదని
హైకోర్టు
ధర్మాసనం
పేర్కొంది


