India
oi-Jakki Mahesh
దేశవ్యాప్తంగా
ఎంతో
ఆసక్తిగా
ఎదురుచూస్తున్న
పార్లమెంట్
బడ్జెట్
సమావేశాలకు
రంగం
సిద్ధమైంది.
జనవరి
28వ
తేదీ
నుంచి
ఈ
సమావేశాలు
ప్రారంభం
కానున్నాయి
అంత
కంటే
ఒక
రోజు
ముందు..
అంటే
జనవరి
27న
కేంద్ర
ప్రభుత్వం
అఖిలపక్ష
సమావేశాన్ని
ఏర్పాటు
చేసింది.
ఈ
సమావేశంలో
ఉభయ
సభలు
సజావుగా
సాగడం,
చేపట్టాల్సిన
కీలక
బిల్లులు,
ఇతర
అంశాలపై
ప్రభుత్వం
ప్రతిపక్షాలతో
చర్చించనుంది.
బడ్జెట్
షెడ్యూల్
ఇలా..
కేంద్ర
పార్లమెంటరీ
వ్యవహారాల
మంత్రి
కిరణ్
రిజిజు
బడ్జెట్
సమావేశాల
వివరాలను
వెల్లడించారు.
జనవరి
28న
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
ఉభయ
సభల
ఉమ్మడి
సమావేశాన్ని
ఉద్దేశించి
ప్రసంగించడంతో
పార్లమెంట్
సమావేశాలు
ప్రారంభమవుతాయి.జనవరి
31న
కేంద్ర
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
ఆర్థిక
సర్వే
నివేదికను
సభలో
ప్రవేశపెడతారు.
ఫిబ్రవరి
1
ఆదివారం
అయినప్పటికీ,
సంప్రదాయం
ప్రకారం
నిర్మలా
సీతారామన్
కేంద్ర
బడ్జెట్ను
ప్రవేశపెడతారు.
రెండు
విడతల్లో
సమావేశాలు
ఈ
బడ్జెట్
సమావేశాలు
రెండు
విడతల్లో
నిర్వహించనున్నారు.
మొదటి
విడత
జనవరి
28
నుంచి
ఫిబ్రవరి
13
వరకు
జరుగుతుంది.
రెండో
విడత
మార్చి
9
నుంచి
ప్రారంభమై
ఏప్రిల్
2
వరకు
కొనసాగుతుంది.
మధ్యలో
ఉన్న
విరామ
సమయంలో
పార్లమెంటరీ
స్థాయి
సంఘాలు
వివిధ
శాఖల
కేటాయింపులపై
లోతైన
అధ్యయనం
చేస్తాయి.
మోదీ
ప్రభుత్వం
ప్రతి
నిర్ణయం
ఆలోచించి
తీసుకుంటుంది:
కిరణ్
రిజిజు
మంత్రి
కిరణ్
రిజిజు
మాట్లాడుతూ..
“ప్రధాని
మోదీ
నాయకత్వంలోని
ప్రభుత్వం
ప్రతి
నిర్ణయాన్ని
దేశ
భవిష్యత్తును
దృష్టిలో
ఉంచుకుని
తీసుకుంటుంది.
సమాజంలోని
అన్ని
వర్గాల
సంక్షేమమే
లక్ష్యంగా
ఈ
బడ్జెట్
ఉంటుంది.
ప్రభుత్వ
పనుల్లో
ఎలాంటి
లోటుపాట్లు
లేకుండా,
ఆలోచనాత్మకంగా
నిర్ణయాలను
అమలు
చేస్తున్నాం”
అని
ధీమా
వ్యక్తం
చేశారు.


