Andhra Pradesh
oi-Korivi Jayakumar
తెలుగు
రాష్ట్రాల్లో
ఇటీవల
ఉష్ణోగ్రతలు
గణనీయంగా
పడిపోయిన
విషయం
తెలిసిందే.
కొద్దిరోజుల
క్రితం
వరకు
చలి
ప్రభావం
కొంత
తగ్గినట్లు
కనిపించినప్పటికీ,
గత
నాలుగు
రోజులుగా
మళ్లీ
ఒక్కసారిగా
చలి
తీవ్రత
పెరిగింది.
ముఖ్యంగా
ఉదయం,
రాత్రి
వేళల్లో
చలి
తీవ్రంగా
పెరుగుతుండడం
పట్ల
ప్రజలు
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
కాగా
ఉదయం
పూట
చలి
పెరగడంతో
పాటు
రోడ్లపై
విపరీతంగా
పొగమంచు
కురుస్తోంది.
ఉదయం
6
గంటల
నుంచి
8
గంటల
వరకు
కూడా
పొగమంచు
పూర్తిగా
తొలగకపోవడంతో
వాహనదారులు
ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.
దీంతో
రహదారులపై
వాహనాలు
నెమ్మదిగా
సాగాల్సిన
పరిస్థితి
నెలకొంది.
కానీ
ఈ
క్రమంలోనే
వాతావరణ
శాఖ
ఏపీ
వాసులకు
ఊహించని
షాక్
ఇచ్చింది.
rain
alert
వాతావరణ
శాఖ
కీలక
ప్రకటన..
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని
పలు
ప్రాంతాల్లో
ఇవాళ,
రేపు
వర్షాలు
కురిసే
అవకాశం
ఉందని
అమరావతి
వాతావరణ
శాఖ
వెల్లడించింది.
చలి
వాతావరణంతో
పాటు
వర్షాలు
కూడా
పడే
సూచనలు
ఉన్నాయని
పేర్కొంది.
ఈ
జిల్లాల్లో
వర్ష
సూచన..
వాతావరణ
శాఖ
అంచనాల
ప్రకారం,
నెల్లూరు,
చిత్తూరు,
తిరుపతి
జిల్లాల్లో
తేలికపాటి
నుంచి
మోస్తరు
వర్షాలు
కురిసే
అవకాశం
ఉంది.
ఇప్పటికే
నిన్న
(
జనవరి
24,
2026
)
రాయలసీమలోని
పలు
ప్రాంతాల్లో
స్వల్ప
వర్షం
కురిసిన
విషయం
తెలిసిందే.
ఇప్పుడు
అదే
ప్రభావం
ఈ
మూడు
జిల్లాలకు
విస్తరించనున్నట్లు
తెలుస్తోంది.
కాగా
వర్షాలు
కురిసే
ప్రాంతాల్లో
చలి
తీవ్రత
మరింత
పెరిగే
అవకాశం
ఉందని
అధికారులు
హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా
ఉదయం,
రాత్రి
వేళల్లో
చలి
మరింత
ఎక్కువగా
ఉండొచ్చని
అంచనా
వేస్తున్నారు.
వృద్ధులు,
చిన్నారులు
తగిన
జాగ్రత్తలు
తీసుకోవాలని
సూచిస్తున్నారు.
ప్రజలకు
హెచ్చరికలు..
పొగమంచు
కారణంగా
వాహనదారులు
అప్రమత్తంగా
ఉండాలని
సూచించారు.
అవసరం
లేని
ప్రయాణాలను
నివారించడంతో
పాటు,
ద్విచక్ర
వాహనదారులు
హెల్మెట్,
లైట్స్
తప్పనిసరిగా
వినియోగించాలని
తెలిపారు.
రైతులు
కూడా
వాతావరణ
మార్పులపై
అప్రమత్తంగా
ఉండాలని
వ్యవసాయ
శాఖ
అధికారులు
సూచిస్తున్నారు.
రాబోయే
రెండు
రోజులు
చలి,
వర్షాల
ప్రభావం
కొనసాగే
అవకాశం
ఉన్నందున
ప్రజలు
తగిన
జాగ్రత్తలు
తీసుకోవాలని
వాతావరణ
శాఖ
స్పష్టం
చేసింది.
తాజా
వాతావరణ
సమాచారం
కోసం
అధికారిక
ప్రకటనలను
అనుసరించాలని
సూచించింది.


