Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
రాజకీయాల్లో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటున్నాయి.
మున్సిపల్
ఎన్నికలు
ప్రధాన
పార్టీలకు
ప్రతిష్ఠాత్మకంగా
మారుతున్నాయి.
సీఎం
రేవంత్
ఇప్పటికే
మంత్రులకు
జిల్లాల
వారీగా
మున్సిపల్
ఎన్నికల్లో
గెలుపు
బాధ్యతలను
అప్పగించారు.
జిల్లాల
పర్యటనలకు
సిద్దం
అయ్యారు.
బీజేపీ
రాష్ట్ర
ఇంఛార్జ్
లు
హైదరాబాద్
లో
మకాం
వేసి
మున్సిపల్
ఎన్నికల
కోసం
పార్టీ
ని
సమాయత్తం
చేస్తున్నారు.
ఇదే
సమయంలో
బీఆర్ఎస్
నాయకత్వం
కీలక
నిర్ణయం
తీసుకుంది.
పురపోరులో
సత్తా
చాటాలని
భావిస్తోంది.
మున్సిపల్
ఎన్నికలకు
కౌంట్
డౌన్
మొదలైంది.
ఒకటి,
రెండు
రోజుల్లోనే
మున్సిపల్
ఎన్నికల
షెడ్యూల్
విడుదల
కానుంది.
ఈ
మేరకు
ఎన్నికల
సంఘం
తుది
కసరత్తు
చేస్తోంది.
పార్టీలు
సైతం
కార్యాచరణ
వేగవంతం
చేసాయి.
నేరుగా
సీఎం
రేవంత్
మున్సిపల్
ఎన్నికల
కోసం
జిల్లాల
వారీగా
కసరత్తు
చేస్తున్నారు.
అభ్యర్ధుల
ఖరారు
నుంచి
గెలుపు
వరకు
మంత్రులకు
బాధ్యతలను
సీఎం
అప్పగించారు.
జిల్లా
పర్యటనల్లో
వరాలు
ప్రకటిస్తున్నారు.
అటు
పార్టీ
హైకమాండ్
సైతం
ఈ
పుర
పోరును
సీరియస్
గా
తీసుకుంది.
ఈ
ఫలితాలు
మంత్రుల
సమర్థతకు
పరీక్షగా
మారనున్నాయి.
త్వరలో
జరిగే
మంత్రివర్గ
విస్తరణలో
ఈ
ఫలితాలు
కీలకంగా
మారనున్నాయి.
కాగా,
ప్రతిపక్ష
పార్టీలు
బీఆర్ఎస్..
బీజేపీ
సైతం
ఈ
ఎన్నికల
కోసం
తమ
వ్యూహాలను
అమలు
చేస్తున్నాయి.
ఇందు
కోసం
తాజాగా
మాజీ
సీఎం
కేసీఆర్
తో
కేటీఆర్
సమావేశం
అయ్యారు.
కీలక
నిర్ణయాలు
కేసీఆర్
సూచనల
మేరకు
కేటీఆర్,
హరీష్
మున్సిపల్
ఎన్నికల
బాధ్యతలను
స్వీకరించారు.
తాజాగా…మున్సిపల్
ఎన్నికల
కోసం
బీఆర్ఎస్
ఇన్ఛార్జులను
నియమించింది.
ఎన్నికలు
జరగనున్న
కార్పొరేషన్లు,
మున్సిపాల్టీల
వారీగా
సమన్వయ
కర్తల
జాబితాను
ప్రకటించారు.
రాష్ట్ర
వ్యాప్తంగా
ప్రతి
మున్సిపాలిటీ,
కార్పొరేషన్కి
సీనియర్
నాయకుడికి
ఇన్ఛార్జిగా
బాధ్యతలు
అప్పగించారు.
ప్రజల
మద్దతుతో
మున్సిపల్
ఎన్నికల్లో
బీఆర్ఎస్
గెలుపే
లక్ష్యంగా
పార్టీ
శ్రేణులు
పనిచేయాలని
కేటీఆర్
పిలుపునిచ్చారు.
మున్సిపల్
ఎన్నికల్లో
కాంగ్రెస్
బెదిరింపు
ధోరణిలో
వ్యవహరిస్తుందని
ఎవరు
భయపడాల్సిన
అవసరం
లేదని
తెలిపారు.
అసెంబ్లీ
ఎన్నికల్లో
కాంగ్రెస్
మెజార్టీ
సాధించిన
ప్రాంతాల్లో
బీఆర్ఎస్
ప్రత్యేక
వ్యూహాలను
అమలు
చేస్తోంది.
అటు
బీజేపీ
సైతం
అభ్యర్ధుల
ఖరారు
బాధ్యతలను
నియోజకవర్గ
ఇంఛార్జ్
లకు
అప్పగించింది.
దీంతో,
ఇప్పుడు
మున్సిపల్
ఎన్నికల్లో
త్రిముఖ
పోరు
ఖాయంగా
కనిపిస్తోంది.


