మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదేనా..!

Date:


Telangana

oi-Bomma Shivakumar

తెలంగాణలో
మున్సిపల్
ఎన్నికలకు
సంబంధించిన
నోటిఫికేషన్
వచ్చిన
విషయం
తెలిసిందే.
రాష్ట్రంలోని
116
మున్సిపాలిటీలు,
7
కార్పొరేషన్లలో
ఎన్నికలు
జరగనున్నాయి.

ఎన్నికల
ద్వారా
రాష్ట్రవ్యాప్తంగా
మొత్తం
52.43
లక్షల
ఓటర్లు
తమ
ఓటు
హక్కును
వినియోగించుకోనున్నారు.
అయితే
మున్సిపల్
ఎన్నికల
సమరానికి
అధికార
కాంగ్రెస్
పార్టీతోపాటు
బీఆర్ఎస్,
బీజేపీ
పార్టీలు
సిద్ధం
అవుతున్నాయి.

మేరకు
పూర్తి
ప్రణాళికతో
కార్యాచరణను
రూపొందిస్తున్నాయి.

అయితే
తెలంగాణలో
మున్సిపల్
ఎన్నికలను
బీజేపీ
ప్రతిష్టాత్మకంగా
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
ఈమేరకు
ఎన్నికల
ప్రచారానికి
బీజేపీ
అగ్రనేతలు
అమిత్‌షా,
నితిన్‌
నబిన్‌
రానున్నట్లు
సమాచారం.
ఫిబ్రవరి
2,
3
తేదీల్లో
మహబూబ్‌
నగర్‌
లో
నితిన్‌
నబిన్‌
సభ
ఉండే
అవకాశం
ఉన్నట్లు
సమాచారం
అందుతోంది.
అలాగే
ఫిబ్రవరి
8,
9
తేదీల్లో
నిర్మల్‌
లో
అమిత్‌
షా
సభ
ఉండే
అవకాశం
ఉంది.
మొత్తానికి
దక్షిణ
తెలంగాణలో
ఒక
సభ,
ఉత్తర
తెలంగాణలో
ఒక
సభ
పెట్టే
ఆలోచనలో
బీజేపీ
ఉన్నట్లు
తెలుస్తోంది.

ఇక
2020
మున్సిపల్
ఎన్నికల్లో
బీజేపీ
ఆశించినంత
ప్రభావం
చూపలేకపోయింది.
అప్పుడు
120
మున్సిపాలిటీలు,
10
మున్సిపల్
కార్పొరేషన్లకు
ఎన్నికలు
జరగ్గా
కాషాయ
పార్టీ
కేవలం
రెండు
మున్సిపాలిటీలు
అవికూడా
మహబూబ్
నగర్
జిల్లా
పరిధిలోని
మక్తల్,
ఆమనగల్
లో
మాత్రమే
విజయం
సాధించింది.
కరీంనగర్,
నిజామాబాద్
కార్పొరేషన్స్
ఎన్నికల్లో
మాత్రమే
బీజేపీ
ప్రభావం
చూపగలిగింది.
మరి
ఈసారి
ఎలాంటి
ఫలితాలను
రాబడుతుందో
చూడాలి.

ఇక
మున్సిపల్
ఎన్నికల్లో
వీలైనన్ని
ఎక్కువ
స్థానాలను
కైవసం
చేసుకునేందుకు
అధికార
కాంగ్రెస్
పార్టీ
సిద్ధం
అవుతోంది.
ప్రస్తుతం
అమెరికా
పర్యటనలో
ఉన్న
సీఎం
రేవంత్
రెడ్డి..
తిరిగి
స్వదేశానికి
రాగానే
ఎన్నికల
శంఖారావం
పూరించనున్నారు.

మేరకు
ఫిబ్రవరి
3న
నల్గొండ
జిల్లా
మిర్యాలగూడ,
4న
కరీంనగర్‌
జిల్లా
జగిత్యాల,
5న
రంగారెడ్డి
జిల్లా
చేవెళ్ల,
6న
భూపాలపల్లి,
7న
మెదక్,
8న
నిజామాబాద్‌
లో
సీఎం
రేవంత్‌
పర్యటించనున్నట్లు
సమాచారం.

ఇదిలాఉంటే
రాష్ట్రవ్యాప్తంగా
తొలి
రోజు
890
మంది
అభ్యర్థుల
నుంచి
902
నామినేషన్లు
దాఖలయ్యాయి.
ఇక
వీరిలో
382
మంది
కాంగ్రెస్‌
అభ్యర్థులు,
258
మంది
బీఆర్‌ఎస్‌
అభ్యర్థులు,
169
మంది
బీజేపీ
అభ్యర్థులు
ఉన్నారు.
ఇక
మున్సిపల్
ఎన్నికలకు
సంబంధించి
ఫిబ్రవరి
11న
పోలింగ్
జరగనుంది.
అలాగే
ఫిబ్రవరి
13న
ఓట్ల
లెక్కింపు
అదే
రోజు
ఫలితాలు
వెలువడనున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related