Andhra Pradesh
oi-Chandrasekhar Rao
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
సీనియర్
నాయకుడు,
చంద్రగిరి
మాజీ
శాసన
సభ్యుడు
చెవిరెడ్డి
భాస్కర్
రెడ్డి..
ఈ
ఉదయం
పార్టీ
అధినేత,
మాజీ
ముఖ్యమంత్రి
వైఎస్
జగన్మోహన్
రెడ్డని
కలిశారు.
ఆ
సమయంలో
వెంట
ఆయన
ఇద్దరు
కుమారులు
మోహిత్
రెడ్డి,
హర్షిత్
రెడ్డి
ఉన్నారు.
ఇద్దరు
కుమారులతో
కలిసి
తాడేపల్లిలోని
జగన్
నివాసానికి
వెళ్లారు.
ఈ
సందర్భంగా
ఆయన
వారిని
ఆప్యాయంగా
ఆహ్వానించారు.
ఆలింగనం
చేసుకున్నారు.
అనంతరం
జగన్
తో
కలిసి
చెవిరెడ్డి
గన్నవరం
విమానాశ్రయానికి
బయలుదేరి
వెళ్లారు.
గత
ఏడాది
జూన్
17వ
తేదీన
చెవిరెడ్డిని
పోలీసులు
అరెస్ట్
చేసిన
విషయం
తెలిసిందే.
విదేశాలకు
బయలుదేరి
వెళ్లడానికి
సిద్ధపడిన
ఆయనను
బెంగళూరు
కెంపెగౌడ
అంతర్జాతీయ
విమానాశ్రయంలో
అడ్డుకున్నారు.
మద్యం
అక్రమ
కేసులో
చెవిరెడ్డిపై
అప్పటికే
లుకౌట్
నోటీసులు
జారీ
కావడం
కూడా
దీనికి
ప్రధాన
కారణమైంది.
ఈ
కేసులో
గురువారంబెయిల్
లభించింది.
రాత్రి
ఆయన
జైలు
నుంచి
విడుదల
అయ్యారు.
అనంతరం
విలేకరులతో
మాట్లాడారు.
ఎన్ని
అక్రమ
కేసులు
పెట్టినా
ధైర్యంగా
ఎదుర్కొంటామని
స్పష్టం
చేశారు.
చంద్రబాబు
సంతృప్తి
పొందే
వరకు
ఎన్ని
కేసులైనా
పెట్టుకోవచ్చని
సవాల్
విసిరారు.
కేసులు
పెట్టే
కొద్దీ
ఇంకా
బలంగా
తయారవుతామని,
భయపడే
ప్రసక్తే
లేదని
అన్నారు.
చంద్రబాబు
సొంత
ఊరి
నుంచి
రాజకీయాల్లో
ఎదిగానని,
అది
తట్టుకోలేక
అధికారంలోకి
వచ్చిన
ప్రతీసారీ
జైలుకు
పంపిస్తుంటాడని
విమర్శించారు.
2014-
19
మధ్య
72
కేసులు
పెట్టారని.
చిత్తూరు
జిల్లాలోని
డిస్ట్రిక్ట్
జైలు
మొదలు
అన్ని
సబ్
జైళ్లలో
నెలలపాటు
పెట్టించాడని
ఆరోపించారు.
2024
ఎన్నికల్లో
చంద్రబాబు
సొంత
ఊరి
నుంచి
ఎమ్మెల్యేగా
పోటీ
చేసినందుకు
తన
కొడుకుపై
10
కేసులు
పెట్టి
వేధిస్తున్నారని
చెవిరెడ్డి
గుర్తు
చేశారు.
హర్షిత్రెడ్డిని
విద్యార్థి
నాయకుడిగా
ఎదిగాడనే
కారణంతో
ఇప్పుడు
అతనిపైనా
కూడా
కేసులు
నమోదు
చేయించాడని
మండిపడ్డారు.
వైఎస్
రాజారెడ్డి,
వైఎస్
రాజశేఖరరెడ్డి,
వైఎస్
జగన్మోహన్రెడ్డి..
ఇలా
ఒకే
కుటుంబంలోని
మూడు
తరాల
నాయకుల
వద్ద
ప్రియ
శిష్యుడిగా
కొనసాగానని,
ఓ
సైనికుడిగా
ఉన్నానని
చెవిరెడ్డి
పేర్కొన్నారు.
వైఎస్
కుటుంబం
నుంచి
తాను
నేర్చుకొన్నది-
ఎన్ని
కష్టాలు
వచ్చినా,
ఎవరెన్ని
ఇబ్బందులు
పెట్టినా
మొండిగా
నిలబడి
ఎదుర్కోవడమేనని
వ్యాఖ్యానించారు.
ఎన్ని
కేసులు
పెట్టినా,
అసత్యపు
ప్రచారాలతో
ఎంత
అవమానించినా,
ఎంత
మంది
ఒక్కటై
దాడులు
చేసినా
తట్టుకుని
నిలబడే
స్థైర్యాన్ని
మా
లీడర్
జగనన్నను
దగ్గరగా
చూసి
నేర్చుకున్నానని
అన్నారు.


