Karthika deepam 2 December 2nd:దీపను కాపాడటానికి కార్తీక్ ఆరాటం..ఇంతకీ ఏమైంది..? | Karthika deepam 2 Serial December 2nd Episode 530,Here is todays full story

Date:


Entertainment

oi-Kannaiah

కార్తీకదీపం
2
సీరియల్‌లో
గత
ఎపిసోడ్
(530వ
ఎపిసోడ్)
లో
జరిగిన
ఉత్కంఠభరిత
ఘట్టాలను
గుర్తుచేసుకుంటే..
అనుకోని
అతిథిగా
కావేరి
రావడం,
ఆమె
ద్వారా
దీప
కడుపుతో
ఉన్న
విషయం
తెలుసుకోవడం,

తర్వాత
శ్రీధర్
ఎమోషనల్‌గా
కల్పించుకుని
దీప
కిందపడబోయిన
విషయాన్ని
బయటపెట్టడం
చూశాం.
దాంతో
అప్రమత్తమైన
కాంచన,
ఇకపై
దీపను
శివన్నారాయణ
గారి
ఇంటికి
పంపనని
తేల్చి
చెప్పింది.
మరోవైపు,
శ్రీధర్
తన
పీఏగా
ఉద్యోగం
ఆఫర్
చేస్తే,
కాశీ
రగిలిపోయాడు.
చివరికి,
స్వప్న
బెదిరింపులతో
ఉద్యోగానికి
ఒప్పుకోవడం
హైలైట్‌గా
నిలిచింది.మరి
డిసెంబర్
2వ
తేదీ
(530వ
ఎపిసోడ్)
లో
ఏం
జరిగిందో
ఇప్పుడు
చూద్దాం.


జ్యోత్స్న
రహస్యం
బయటపెట్టిన
పారిజాతం

కోపంతో
బట్టలు
సర్దుకుంటున్న
పారిజాతాన్ని
చూసి
జ్యోత్స్న
ఆశ్చర్యపోతుంది.
దీపకు
కాలు
అడ్డుపెట్టేందుకు
జ్యోత్స్న
ప్రయత్నించడాన్ని
తాను
చూశానని,
కార్తీక్
హెచ్చరించడాన్ని
కూడా
గమనించానని
పారు
బయటపెట్టింది.
జ్యోత్స్న
జీవితంలో
మారదని
అర్థమైందని,
అందుకే
ఇక్కడి
నుంచి
వెళ్లిపోతున్నానని
పారు
చెప్పడంతో
జ్యోత్స్న
వణికిపోతుంది.
అయితే,
దీప
కడుపులోని
బిడ్డను
పుట్టనివ్వనని
జ్యోత్స్న
శపథం
చేయడంతో
పారిజాతం
షాక్
అవుతుంది.
కొన్నాళ్లు
దేశం
వదిలి
వెళ్లిపోవాలని
పారు
సలహా
ఇవ్వగా..
దీప
నాశనం
అయ్యే
వరకు
తాను
ఇక్కడే
ఉంటానని
జ్యోత్స్న
భీష్మించుకుంటుంది.

Karthika deepam 2 Serial December 2nd Episode 530 Here is todays full story


తల్లి-భార్య
మధ్య
కార్తీక్
నలిగిపోతూ..

శివన్నారాయణ
ఇంటికి
వెళ్లొద్దని
కాంచన
చెప్పడంతో
దీప,
కార్తీక్‌లు
బాధపడ్డారు.
ఇన్ని
తెలిసిన
దానివి
అత్తయ్య
మాట్లాడినప్పుడు
సైలెంట్‌గా
ఉండొచ్చు
కదా
అని
కార్తీక్
అనగా..
అత్తయ్య
అడిగిన
దానికి
సరైన
సమాధానం
మన
దగ్గర
లేదని,
అందుకే
తను
మాట్లాడినది
కరెక్టేనని
దీప
వాదిస్తుంది.
పాపం
శౌర్యకి
అనవసరంగా
తిట్లు
పడ్డాయని
కార్తీక్
బాధపడగా..
అది
పెద్దవాళ్ల
విషయాల్లో
జోక్యం
చేసుకుంటోందని
దీప
చమత్కరించింది.
ప్రపంచంలో

మేధావి
అయినా
తల్లి,
పెళ్లాం
మధ్యలో
నలిగిపోతుంటే
తల
పట్టుకోవాల్సిందేనని
కార్తీక్
నిస్సహాయత
వ్యక్తం
చేశాడు.


శౌర్యపై
విషం
నింపాలని
పారిజాతం
ప్రయత్నం

శౌర్య
సున్నుండల
విషయంలో
కాంచనతో
అలిగి,
కార్తీక్,
దీపల
గదిలో
పడుకోవడానికి
వెళ్తుంది.
ఇదే
అదునుగా
భావించిన
పారిజాతం..
కాంచనకు
ఫోన్
చేసి
విషం
చిమ్మింది.
శౌర్య
కార్తీక్
కూతురు
కాదని,
దీపకు
ఎవరికో
పుట్టిన
బిడ్డ
అని,
అందుకే
శౌర్యను
పరాయిదానిలా
చూడాలని
రెచ్చగొట్టింది.
రేపు
కార్తీక్‌కు
బిడ్డ
పుట్టాక
శౌర్యను
అనాథ
శరణాలయంలో
పెట్టాల్సిందేనని
పారు
అనడంతో
కాంచన
సీరియస్
అయ్యింది.
అయినప్పటికీ,
పారు
మాటలు
కాంచనలో
ఆలోచన
రేకెత్తించాయి.


కడుపులో
నొప్పితో
దీప
విలవిల

నిద్రపోతున్నప్పుడు
పొరపాటున
శౌర్య
కాలు
దీప
కడుపుకు
తగలడంతో
ఆమె
నొప్పితో
ఏడుస్తుంది.
కంగారుపడిన
కాంచన
తలుపు
కొట్టి
ఆసుపత్రికి
వెళ్లమని
పట్టుబట్టింది.
నొప్పి
తగ్గిపోయిందని
దీప
పంటి
బిగువున
భరించినా,
కాంచనకు
అనుమానం
వచ్చింది.
ఆసుపత్రికి
వెళ్లడానికి
దీప
ఒప్పుకోకపోవడంతో
కార్తీక్
కంటతడి
పెట్టుకుంటాడు.
దీప
తన
గుండెల
మీద
పడుకుంటే
నొప్పి
తగ్గిపోతుందని
చెప్పడంతో
కార్తీక్
భార్య
పరిస్థితి
చూసి
నలిగిపోతాడు.రాబోయే
ఎపిసోడ్‌లో
జ్యోత్స్న
ప్లాన్
ఏమై
ఉంటుంది?
దీప,
కార్తీక్‌లు
కాంచన
నిర్ణయాన్ని
ఎలా
ఎదుర్కొంటారు?
వేచి
చూద్దాం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related