India
oi-Bomma Shivakumar
సమాజంలో
రోజురోజుకూ
మహిళలపై
ఆకృత్యాలు
పెరిగిపోతున్నాయి.
చిన్నాపెద్దా
అన్న
తేడా
లేకుండా
కొన్ని
మానవ
మృగాలు
ప్రవర్తిస్తున్నాయి.
బహిరంగ
ప్రదేశాలు,
రద్దీ
ప్రాంతాల్లో
మహిళలు
కనపడితే
చాలు
వికృత
చేష్టలతో
వారికి
అసౌకర్యం
కలిగిస్తున్నారు.
ఆడపిల్ల
అయితే
చాలు
అని
మృగాళ్ల
మాదిరి
మీదపడిపోతున్నారు.
వావి
వరసలు
మరచి
అత్యాచారాలకు
తెగబడుతున్న
వారు
మరోవైపు
ఉన్నారు.
తమ
కామ
వాంఛ
కారణంతో
ఎన్నో
కుటుంబాలను
ఛిన్నాభిన్నం
చేస్తున్నారు.
ప్రభుత్వాలు
పోక్సో,
నిర్భయ,
దిశ
లాంటి
ఎన్ని
చట్టాలు
తెచ్చినా..
కఠినంగా
శిక్షించినా
ఇలాంటి
ఘటనలు
మాత్రం
ఆగడం
లేదు.
తాజాగా
ఉత్తర్
ప్రదేశ్
లో
ఇలాంటి
ఘటనే
వెలుగులోకి
వచ్చింది.
ఉత్తర్
ప్రదేశ్
లోని
నోయిడాలో
షాకింగ్
ఘటన
జరిగింది.
పక్క
కార్లలోని
మహిళకు
ఓ
వ్యక్తి
తన
కారులోంచి
ఫ్లయింగ్
కిస్
లు
ఇవ్వడం
చర్చనీయాంశంగా
మారింది.
ఈ
ఘటనకు
సంబంధించిన
17
సెకన్ల
వీడియో
ఇప్పుడు
సామాజిక
మాధ్యమాల్లో
వైరల్
అవుతోంది.
ఈ
ఘటన
ఉత్తర్
ప్రదేశ్
లోని
మహిళల
భద్రతపై
పలు
ప్రశ్నలు
వ్యక్తం
అవుతున్నాయి.
ఈ
వీడియోలో
కారును
నడుపుతున్న
ఓ
వ్యక్తి
పక్క
కారులోని
మహిళకు
అసభ్యకర
సిగ్నల్స్
ఇచ్చాడు.
ఆమెకు
చేయి
ఊపుతూ
సైగలు
చేశాడు.
అంతేకాక
ఆమె
కారును
చాలాదూరం
పాటు
వెంబడించాడు.
ప్రస్తుతం
ఇందుకు
సంబంధించిన
వీడియో
సామాజిక
మాధ్యమాల్లో
వైరల్
అవుతోంది.
అయితే
ఈ
ఘటనకు
సంబంధించి
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
నోయిడాలోని
సెక్టార్
135
కు
చెందిన
ఇద్దరు
నిందితుల్ని
అరెస్ట్
చేశారు.
#BREAKING
|
Noida:
2
men
arrested
after
obscene
act
caught
on
camera
pic.twitter.com/pAKULyHmYa—
NDTV
(@ndtv)
February
2,
2026
గతనెలలోనూ
ఇలాంటి
ఘటనే
జరిగింది.
సోషల్
మీడియా
ఇన్
ఫ్లూయెన్సర్
నీతూ
బిస్ట్
కారును
కొందరు
ఆకతాయిలు
వెంబడించారు.
ఆమెకు
ఫాలో
అవుతూ
వేధించారు.
ఇదే
విషయాన్ని
ఆమె
తన
సామాజిక
మాధ్యమంలో
పోస్టు
చేశారు.
ఇదే
విషయంపై
నీతూ
భర్త
మాట్లాడుతూ
ఆకతాయిలు
వాళ్ల
బైక్స్
తో
తమ
కారును
రెండు
సార్లు
ఢీ
కొట్టారని
పేర్కొన్నాడు.
అయితే
ప్రస్తుత
ఘటనల
నేపథ్యంలో
ఉత్తర్
ప్రదేశ్
లోని
మహిళల
భద్రతపై
ఆందోళన
వ్యక్తం
అవుతోంది.


