పాకిస్థానీయులకు పిచ్చెక్కిస్తున్న ఇండియన్ సినిమా..! | Mahavathar Narasimha movie screening at swami Narayana temple in pakisthan

Date:


Cinema

oi-Korivi Jayakumar

ఎటువంటి
అంచనాలు
లేకుండా
వచ్చి
బాక్సాఫీస్‌
వద్ద
సంచలనం
సృష్టించింది
‘మహావతార్
నరసింహ’
చిత్రం.

సినిమాకు
అశ్విన్
కుమార్
దర్శకత్వం
వహించగా..
సుమారు
రూ.30
కోట్ల
బడ్జెట్
తో
రూపొందించారు.
మహావిష్ణువు
అవతారమైన
నరసింహ
స్వామి

భక్త
ప్రహ్లాద
కథాంశంతో

మూవీ
తెరకెక్కింది.
ఎలాంటి
భారీ
ప్రమోషన్స్
లేకుండానే
విడుదలైన

యానిమేటెడ్
మూవీ..
కేవలం
మౌత్
టాక్
ద్వారానే
ప్రేక్షకుల
నుంచి
అద్భుతమైన
స్పందన
తెచ్చుకుంది.
రూ.300
కోట్లకు
పైగా
వసూలు
చేసి
రికార్డు
సృష్టించింది.

ముఖ్యంగా

సినిమాలో
కథ,
కథనం,
అద్భుతమైన
గ్రాఫిక్స్,
వీఎఫ్‌ఎక్స్
ప్రేక్షకులను
విపరీతంగా
ఆకట్టుకున్నాయి.
నిజంగా
నరసింహ
స్వామి
వచ్చి
కనిపించాడా
అన్న
స్థాయిలో
విజువల్స్
అదిరిపోయాయి.

ఎలివేషన్
సీన్స్..
అందుకు
తగ్గట్టుగా
వచ్చే
మ్యూజిక్
రోమాలు
నిక్కబొడుచుకునేలా
చేశాయి.
యానిమేషన్
చిత్రాలంటే
కేవలం
చిన్నపిల్లల
కోసమే
అనుకునే
ధోరణికి

మూవీ
ఫుల్
స్టాప్
పెట్టేసింది.
చిన్నారుల
నుంచి
పెద్దల
వరకు

మూవీని
చూసేందుకు
థియేటర్లకు
క్యూ
కట్టారు.
ఇప్పుడు

చిత్రం
మరో
అరుదైన
ఘనత
సాధించింది.

mahavathar-narasimha-movie-screening-at-swami-narayana-temple-in-pakisthan

పాకిస్తాన్‌లోని
కరాచీలో
గల
చారిత్రక
శ్రీ
స్వామినారాయణ
మందిరంలో
“మహావతార్
నరసింహ”
ప్రదర్శించబడిందంటూ
సోషల్
మీడియాలో
జోరుగా
ప్రచారం
నడుస్తోంది.
200
సంవత్సరాల
చరిత్ర
కలిగిన

పురాతన
ఆలయం..
కరాచీలో
మిగిలి
ఉన్న
కొన్ని
క్రియాశీల
హిందూ
దేవాలయాలలో
ఒకటిగా
నిలుస్తుంది.
ప్రస్తుతం
భారత్

పాకిస్థాన్
దేశాల
మధ్య
పచ్చగడ్డి
వేసినా
కూడా
భగ్గుమనేలా
పరిస్థితులు
ఉన్నాయి.
కానీ
ఇలాంటి
పరిస్థితుల్లో
ఒక
ఇండియన్
సినిమాకి
పాకిస్థాన్
దేశంలో
నీరాజనాలు
పలకడం
హాట్
టాపిక్
గా
మారింది.


యానిమేటెడ్
చిత్రం
హిందూ
ఇతిహాసాలపై
ఆధారపడడంతో..
వేలాది
మంది
భక్తులు
ఆలయం
వద్దకు
తరలివచ్చి
సినిమాని
వీక్షిస్తునట్టు
చెబుతున్నారు.
అయితే

కార్యక్రమానికి
సంబంధించి
ఎటువంటి
సమాచారం
గానీ..
అధికారిక
ధృవీకరణ
గానీ
ఇంకా
లభ్యం
కాలేదు.

ప్రధాన
వార్తా
సంస్థ
గానీ,
ఆలయ
అధికారిక
వర్గాలు
గానీ

ప్రదర్శన
జరిగినట్లు
నిర్ధారించలేదు.
దీంతో
అసలు

వ్యవహారం
నిజమేనా
కాదా
అనే
అనుమానాలు
సైతం
వ్యక్తం
అవుతున్నాయి.
కానీ
ఇందుకు
సంబంధించిన
వీడియోలు
మాత్రం
నెట్టింట
వైరల్
గా
మారాయి.

మరోవైపు
లేటెస్ట్
గానే

మూవీ
మరో
ఘనత
సాధించింది.
98వ
ఆస్కార్
అవార్డుల
బరిలో
నిలిచి
ప్రపంచ
వ్యాప్తంగా
గుర్తింపు
తెచ్చుకుంది.
యానిమేషన్
కేటగిరీలో

సినిమా
ఆస్కార్
లో
ఎంట్రీ
పొందింది.

విషయాన్ని
అకాడమీ
అధికారిక
వెబ్
సైట్
లో
వెల్లడించింది.
మహావతార్
నరసింహా
సినిమా
ఆస్కార్
కు
ఎంపికవడం
పట్ల
సర్వత్రా
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BTS Leads This Week’s Best New Music: Friday Music Guide

Billboard’s Friday Music Guide serves as a handy guide to New...

BTS Sets Sail In ‘SWIM’ Music Video: Watch

Grab your suit, or your Speedos. And get ready...