అసలు కడితే చాలు.. వడ్డీ పూర్తిగా మాఫీ!

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది (SC Corporation loans), ఆర్థిక ఇబ్బందుల వల్ల వడ్డీ భారాన్ని మోయలేకపోతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ‘వడ్డీ మాఫీ’ రూపంలో గొప్ప ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాకుండా, రుణగ్రహీతలు తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒక సువర్ణ అవకాశంగా మారనుంది. శనివారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి (NSFDC), ఎన్ఎస్ఎకెఎఫ్డిసి (NSAKFDC) పథకాల కింద వాహనాల కొనుగోలు మరియు స్వయం ఉపాధి కోసం రుణాలు తీసుకున్న లబ్ధిదారులు, ఈ ఏడాది ఏప్రిల్ నెలలోపు తమ అసలు మొత్తాన్ని చెల్లిస్తే, వారిపై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ. 260 కోట్ల అసలు, రూ. 40 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం రూ. 300 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్‌పై..

పాలనలో పారదర్శకతను పెంచుతూ, ప్రభుత్వ సేవలను ప్రజల చేతిలోని మొబైల్‌కే చేర్చేందుకు రూపొందించిన ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎస్ ఈ సందర్భంగా సూచించారు. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల్లో ఈ వాట్సప్ సేవలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి, ప్రజలు వీటిని వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే..

సంక్షేమ పథకాల అమలుతో పాటు డేటా నిర్వహణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో సాగుతున్న ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ (Unified Family Survey)ను ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. డేటా సేకరణలో ఖచ్చితత్వం పాటిస్తూ, గడువులోగా ప్రక్రియను ముగించాలన్నారు. వీటితో పాటు పియం కుసుం (PM KUSUM) పథకం అమలు మరియు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ఇతర రుణాల రికవరీ అంశాలపై కూడా సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

పెండింగ్‌లో ఉన్న రికవరీలు..

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజయానంద్ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రికవరీలను పూర్తి చేస్తూనే, కొత్త సేవలను ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు జిల్లాల కలెక్టర్లు పాల్గొని పురోగతిని వివరించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Bessent says Treasury is not intervening in oil commodities markets and has no authority to do so

Treasury Secretary Scott Bessent said Monday that the administration...

BJP releases first list of 47 candidates for Assembly polls

The Bharatiya Janata Party (BJP) released its first list...