Nuclear war:ఒకేసారి 12వేల అణుబాంబులు పేలితే పరిస్థితేంటి..భయంకర నిజాలు..!!

Date:


International

oi-Kannaiah

Nuclear war:ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే,ప్రపంచం మరో ‘మహా యుద్ధం’అంచున ఉందా అనే భయం కలుగుతోంది. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు,అగ్రరాజ్యాల హెచ్చరికల నేపథ్యంలో అసలు ఈ అణు ఆయుధాల వినాశన శక్తి ఎంత?ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12,000 అణు బాంబులన్నీ ఒకేసారి పేలితే ఈ భూమి పరిస్థితి ఏంటి? మానవజాతి మనుగడ సాధ్యమేనా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రష్యా,అమెరికా,చైనా,ఫ్రాన్స్,బ్రిటన్,ఇండియా,పాకిస్థాన్,ఇజ్రాయెల్,ఉత్తర కొరియా వంటి దేశాల వద్ద కలిపి సుమారు 12,121 అణు బాంబులు ఉన్నాయని అంచనా. ఇవన్నీ ఒకేసారి పేలితే జరిగేది కేవలం ఒక యుద్ధం కాదు..అది భూమిపై జీవరాశికి చివరి రోజు అవుతుంది.

1.మొదటి నిమిషం: సూర్యుడి కంటే వెయ్యి రెట్లు వేడి

ఈ 12 వేల బాంబులు పేలిన తక్షణమే, భూమిపై వేల సంఖ్యలో ‘కృత్రిమ సూర్యుళ్లు’ ఉదయించినట్లు అవుతుంది. పేలుడు కేంద్రం వద్ద ఉష్ణోగ్రత కోట్లాది డిగ్రీలకు చేరుకుంటుంది. ఆ సెకనులోనే కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలోని ప్రతి వస్తువు – మనుషులు, జంతువులు, భవనాలు, కొండలు – ఆవిరైపోతాయి. కాంతి వేగంతో వచ్చే రేడియేషన్ వల్ల కళ్లు తెరిచి ఉన్న ప్రతి జీవి తక్షణమే గుడ్డిదవుతుంది.

2. గంటల వ్యవధిలో:అణు తుఫాను

పేలుడు జరిగిన ప్రాంతాల నుండి వెలువడే షాక్ వేవ్స్ గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.అడవులు,నగరాలు అగ్నిగుండాలుగా మారుతాయి.ఆక్సిజన్ మొత్తం కాలిపోవడంతో ఊపిరి ఆడక కోట్లాది మంది మరణిస్తారు.వాతావరణంలోకి లక్షల టన్నుల రేడియోధార్మిక ధూళి,పొగ చేరుకుంటుంది.

3. నెలల తర్వాత:అణు శీతాకాలం

ఇది అత్యంత భయంకరమైన ఘట్టం.12 వేల అణుబాంబుల పేలుడు వల్ల వెలువడే నల్లటి పొగ,బూడిద ఆకాశాన్ని పూర్తిగా కమ్మేస్తాయి.సూర్యరశ్మి భూమిని తాకదు.ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుండి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి.దీనినే ‘న్యూక్లియర్ వింటర్’అంటారు.సూర్యరశ్మి లేక మొక్కలు చనిపోతాయి,కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది.పంటలు పండవు.ఆకలి చావులు ప్రపంచాన్ని పాలిస్తాయి.

4. ఓజోన్ పొర మాయం.. రేడియేషన్ నరకం

కొన్ని ఏళ్ల తర్వాత ఆ పొగ విడిపోయినా,భూమికి రక్షణగా ఉన్న ఓజోన్ పొర అప్పటికే పూర్తిగా దెబ్బతింటుంది.అప్పుడు నేరుగా వచ్చే అల్ట్రా వైలట్ కిరణాలు భూమిపై ఉన్న కొద్దిపాటి జీవరాశిని కూడా క్యాన్సర్ వంటి వ్యాధులతో అంతం చేస్తాయి.రేడియేషన్ ప్రభావం వల్ల పుట్టబోయే తరాలు వికలాంగులుగా జన్మిస్తాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం ఎందుకు భయంకరమైనది?
ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో అమెరికా నేరుగా ప్రమేయం కలిగి ఉంది.ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయాలని ఇజ్రాయెల్,తన మనుగడ కోసం అణు బాంబును ప్రయోగించాలని ఇరాన్ భావిస్తే..అది చైన్ రియాక్షన్ లాగా మారి రష్యా,చైనాలను కూడా యుద్ధంలోకి లాగుతుంది.ఒక్క బాంబు పేలినా అది ప్రపంచ వినాశనానికి నాంది అవుతుంది.

12 వేల అణు బాంబులు పేలితే భూమి ముక్కలు కాకపోవచ్చు, కానీ భూమిపై ‘జీవం’ ముక్కలవుతుంది. మనిషి నిర్మించుకున్న నాగరికత బూడిదలో కలిసిపోతుంది.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకసారి అన్నట్లు “మూడవ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు కానీ,నాలుగవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లు,రప్పలతో జరుగుతుంది.” అంటే, అణు యుద్ధం తర్వాత మిగిలేది కేవలం రాతి యుగం మాత్రమే.శాంతి ఒక్కటే మానవాళిని కాపాడగల ఏకైక మార్గం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘Sinners’ & ‘KPop Demon Hunters’ Soundtracks Up After Oscars

Welcome to Billboard Pro’s Trending Up newsletter, where we...

Congress considers blowing up internet law

Internet platforms’ liability shield Section 230 faced another round...

Music Giant Sues Claude Maker Anthropic

BMG has sued Anthropic for copyright infringement, joining the...

Where To Buy Stanley’s New Clutch Bottle & Clutch Bottle Side-Kit Now

All products and services featured are independently chosen by...