Andhra Pradesh
oi-Sai Chaitanya
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ఎమ్మెల్యేల
పైన
ప్రత్యేకంగా
ఫోకస్
చేసారు.
కేబినెట్
సమావేశాలు..
పార్టీ
మీటింగ్స్
లోనూ
ఎమ్మెల్యేల
పని
తీరు
పై
పలు
సందర్భాల్లో
హెచ్చరికలు
చేసారు.
నేరుగా
వారితో
మాట్లాడారు.
నాలుగైదు
మార్గాల్లో
సర్వేల
ద్వారా
నివేదికలు
తెప్పించుకున్నారు.
37
మంది
ఎమ్మెల్యేల
పని
తీరు
సరిగ్గా
లేదని
తేల్చారు.
వీరి
నియోజకవర్గాల
పైన
ప్రత్యేకంగా
దృష్టి
సారించారు.
అదే
సమయంలో
పార్టీ
నాయకత్వానికి
కీలక
ఆదేశాలు
ఇచ్చారు.
సీఎం
చంద్రబాబు
సొంత
పార్టీ
ఎమ్మెల్యేల
పని
తీరు
పైన
నిరంతరం
ఫోకస్
చేస్తున్నారు.
పార్టీ
పరంగా
కీలక
నిర్ణయాలు
తీసుకుంటున్నారు.
ప్రతీ
నియోజకవర్గం
నుంచి
అందుబాటులో
ఉన్న
అన్ని
మార్గాల
నుంచి
సమాచారం
సేకరిస్తున్నారు.
తాజా
నివేదికల
మేరకు
37
మంది
ఎమ్మెల్యే
ల
పని
తీరు
మెరుగుపడాల్సి
ఉందని
చంద్రబాబు
పేర్కొన్నారు.
ఆయా
నియోజకవర్గాల
మీద
ప్రత్యేక
దృష్టి
పెట్టినట్లు
స్పష్టం
చేశారు.
నిరంతర
సమీక్షలు,
ఒక్కొక్కరితో
ముఖాముఖి
సమావే
శాల
ఫలితంగా
ఎమ్మెల్యేలు,
నేతల
పనితీరు
మెరుగైందని
వెల్లడించారు.
నేతలకు
కేడర్తో
వచ్చిన
అంతరం
తగ్గిందని
వివరించారు.
పార్టీ
రాష్ట్ర
అధ్యక్షుడు
పల్లా
శ్రీనివాసరావు
సహా
బ్యాక్
ఆఫీస్
ప్రతినిధులతో
చంద్రబాబు
సమావేశమయ్యారు.
పార్టీ
కీలక
బృందంతోనూ
రెండున్నర
గంటల
పాటు
భేటీ
అయ్యారు.
ఈ
సందర్భంగా
కీలక
ఆదేశాలిచ్చారు.
పార్టీ
లోక్సభ
నియోజకవర్గ
కమిటీ
నియామకం
లో
జరుగుతున్న
జాప్యంపై
చంద్రబాబు
అసంతృప్తి
వ్యక్తం
చేశారు.
వచ్చే
శనివారం
నాటికల్లా
సభ్యుల
పేర్లు
నిర్ణయించాలని
ఆదేశించారు.
పార్టీ
లోక్సభ
నియోజకవర్గ
అధ్యక్ష,
కార్యదర్శులు,
సభ్యుల
ఎంపిక
కోసం
ముగ్గురు
నేతలతో
కమిటీలు
వేశాం.
వాళ్లు
ఒక్కో
నియోజకవర్గానికి
వెళ్లి
మూడేసి
పేర్లు
సిఫార్సు
చేశారు.
ఇప్పటికే
అధ్యక్ష,
కార్యదర్శుల
పేర్లు
నిర్ణయించాం.
32
మంది
సభ్యుల
పేర్లు
పెండింగ్లో
ఉన్నాయి.
త్రిసభ్య
కమిటీని
పార్టీ
కేంద్ర
కార్యాలయానికి
పిలిపించండి.
ఎమ్మెల్యేలతో
సమన్వయం
చేసుకుంటూ
వారం
రోజుల్లో
లోక్సభ
నియోజకవర్గ
కమిటీ
సభ్యుల
తుది
జాబితా
పూర్తి
చేయాలని
చంద్రబాబు
దిశానిర్దేశం
చేశారు.


