పెండింగ్ పథకాల అమలుపై బడ్జెట్ వేళ కీలక నిర్ణయం..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగు లో ప్రసంగం మొదలుపెట్టారు. శ్రమించే తత్వం గల శాంతికాముక తెలంగాణ ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీకి తెలంగాణ 4.99 శాతం అందిస్తోందని తెలిపారు. ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. ఏడాది కాలంలో సంక్షేమ ఫలితాలు అందరికీ అందేలా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్, ప్యూర్, రేర్‌గా (CORE, PURE, RARE) విభజించామని, హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామని గవర్నర్ తెలిపారు. హిల్డ్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు చేపట్టామని గవర్నర్ తెలిపారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించేందుకు నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తున్నామని, తొలి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీసరోవర్ వరకు అభివృద్ధి చేపడతామని ఆయన చెప్పారు.మూసీలో మురుగు నీరు చేరకుండా 39 STPలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ 2047 లక్ష్యంగా ప్రణాళికల అమలు

పెండింగ్ హామీల అమల్లో భాగంగా ఈ సారి బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 2,500.. పెన్షన్ల పెంపు పైన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గవర్నర్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5 లక్షల 72 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపడతామని వివరించారు. బుల్లెట్ రైళ్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందన్నారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతు న్నాయని గవర్నర్ వెల్లడించారు. ఇల్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా మని గవర్నర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 4లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9వేల కోట్లు అందించామని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోందని గవర్నర్ వెల్లడించారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరాయన్నారు. ప్రజావానికి వచ్చిన 64,697 పిటిషన్లలో 47,670 పరిష్కరించామని గవర్నర్ శుక్లా పేర్కొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Sara Bareilles Finds Skull in Her House, Animal Carcass

Sara Bareilles had to be extra brave for this...

Justin Timberlake’s DWI Arrest Video Released After Redactions Deal

Officer body camera footage of Justin Timberlake’s 2024 arrest...

Zhu, Innellea, Ian Snow, Horsegirrl: Best New Dance Songs

Simply the best new dance tracks of the week....

Jim Cramer says to prepare for further stock declines but be open to opportunities

The stock market just closed out a rough week...