India
-Lingareddy Gajjala
రాజధాని దిల్లీలోని Bharat Mandapam వేదికగా నిర్వహించనున్న AI Impact Summit 2026పై ప్రధాని Narendra Modi హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్లో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సదస్సు భారత్లో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమిట్కు ప్రపంచ దేశాలు చురుకుగా పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు.
”సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే థీమ్తో జరుగుతున్న ఈ సదస్సు, కృత్రిమ మేధస్సును ప్రపంచ సంక్షేమానికి ఉపయోగించుకోవాలనే ఉమ్మడి సంకల్పానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన పాత్రను మరింత విస్తరించేందుకు ఇది కీలక వేదిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
AI Impact Summit 2026: ప్రపంచానికి చాటి చెప్పాలి..
భారత యువత ప్రతిభ, దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ఈ సమిట్ ప్రపంచానికి చాటి చెప్పనుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని, డిజిటల్ ప్రజా మౌలిక వసతుల విస్తరణలో భారత్ ముందంజలో ఉందన్నారు.
AI Impact Summit 2026: 45 దేశాల నుంచి ప్రతినిధులు
ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తమ తమ దేశాల ఏఐ అజెండాలను నిర్వచించుకోవడం, గ్లోబల్ సహకార అవకాశాలను అన్వేషించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ, అత్యాధునిక పరిశోధనలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సమిట్ ప్రత్యేకతగా నిలవనుంది.
డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు కీలక శక్తిగా మారుతున్న వేళ, భారత్ ఈ రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు ముందడుగు వేస్తోందని ఈ సదస్సు స్పష్టంచేస్తోంది.
Bringing the world together to discuss AI!
Starting today, India hosts the AI Impact Summit at Bharat Mandapam in Delhi. I warmly welcome world leaders, captains of industry, innovators, policymakers, researchers and tech enthusiasts from across the world for this Summit. The…
— Narendra Modi (@narendramodi) February 16, 2026


