India
oi-Sai Chaitanya
అజిత్
పవార్
మరణం
ఇప్పుడు
రాజకీయ
వర్గాల్లో
షాకింగ్
గా
మారింది.
విమాన
ప్రమాదంలో
అజిత్
పవార్
మరణం
మరాఠా
రాజకీయాల్లో
విషాదం
నింపింది.
మహారాష్ట్ర
రాజకీయాల్లో
తనదైన
ముద్ర
వేసుకున్న
అజిత్
పవార్
రాజకీయ
వ్యూహకర్తగా
పేరు
సాధించారు.
బాబాయ్
అడుగుజాడల్లో
తొలి
నుంచి
రాజకీయగా
అనేక
ఆటు
పోట్లు
ఎదుర్కొన్న
అజిత్
పవార్
ఆరు
సార్లు
డిప్యూటీ
సీఎం
గా
మహారాష్ట్రలో
అరుదైన
రికార్డు
దక్కించుకున్నారు.
అయితే,
సుదీర్ఘ
రాజకీయ
ప్రస్థానం
ఉన్న
అజిత్
పవార్
కు
రాజకీయంగా
మాత్రం
తన
కల
నెరవేరకుండానే
అస్తమించారు.
మహారాష్ట్ర
రాజకీయాల్లో
చక్రం
తిప్పిన
అజిత్
పవార్
ది
సుదీర్ఘ
రాజకీయ
ప్రస్థానం.
1982లో
సహకార
చక్కెర
కర్మాగారం
పాలక
మండలిలో
సభ్యుడిగా
రాజకీయ
ప్రస్థానాన్ని
మొదలుపెట్టి
అంచెలంచెలుగా
రాజకీయాల్లో
ఎదిగారు.
అజిత్
రాజకీయంగా
ప్రవేశించే
సమయానికి
శరద్
పవార్
కాంగ్రెస్
లో
కీలక
నేతగా
ఉన్నారు.
2023
జులై
1
వరకు
శరద్
పవార్
అడుగు
జాడల్లోనే
అజిత్
నడిచారు.
కానీ
2023
జులై
2న
ఎన్సీపీని
సొంతం
చేసుకున్నారు.
విధేయత..
చతురత
అజిత్
పవార్
సొంతం.
అహ్మద్నగర్లోని
దేవ్లాలి
ప్రవర
గ్రామంలో
1959
జులై
22న
జన్మించారు.
పవార్
కుటుంబానికి
నేటికీ
మహారాష్ట్రలోని
పుణె,
సతారా,
సంగ్లి,
కొల్హాపూర్,
సోలాపూర్,
అహ్మద్
నగర్
జిల్లాలపై
మంచి
పట్టు
ఉంది.
1991లో
పుణె
జిల్లా
సెంట్రల్
కోఆపరేటివ్
బ్యాంక్
పాలక
మండలి
ఛైర్మన్గా
అజిత్
ఎన్నికయ్యారు.
ఆ
పదవిలో
ఏకంగా
16
ఏళ్లపాటు
కొనసాగారు.
1191
లో
అజిత్
పవార్
అజిత్
ఎంపీ
అయ్యారు.
ఆ
వెంటనే
పీవీ
నర్సింహారావు
సర్కారులో
రక్షణ
మంత్రి
పదవిని
శరద్
పవార్
దక్కించుకున్నారు.
బారామతి
నుంచి
అజిత్
వరుసగా
7
సార్లు
ఎమ్మెల్యే
అయ్యారు.
తొలిసారి
1991
బారామతి
అసెంబ్లీ
ఉప
ఎన్నికల్లో
ఆయన
గెలిచారు.
మహారాష్ట్ర
ప్రభుత్వంలో
వ్యవసాయ,
ఇంధన
శాఖ
సహాయ
మంత్రి
పదవి
దక్కింది.
1992లో
శరద్
పవార్
మహారాష్ట్ర
సీఎం
అయ్యారు.
ఈ
టర్మ్లో
రాష్ట్ర
ప్రణాళిక,
ఇంధన,
నేల
సంరక్షణ
శాఖ
సహాయ
మంత్రి
పదవిని
అజిత్
పొందారు.
1999లో
శరద్
పవార్
కాంగ్రెస్
నుంచి
బయటకు
వచ్చి
నేషనలిస్ట్
కాంగ్రెస్
పార్టీ
ఏర్పాటు
చేసారు.
1999లో
మహారాష్ట్రలో
ఏర్పడిన
కాంగ్రెస్
–
ఎన్సీపీ
సంకీర్ణ
సర్కారులో
కీలకంగా
వ్యవహరించారు.
మంత్రి
పదవులను
పొందుతూనే,
మరోవైపు
పశ్చిమ
మహారాష్ట్ర
ప్రాంతంలో
ఎన్సీపీ
బలోపేతానికి
పని
చేసారు.
మహారాష్ట్రలో
అత్యధిక
కాలం
పాటు
డిప్యూటీ
సీఎంగా
సేవలు
అందించిన
రికార్డు
అజిత్
పవార్
పేరిటే
ఉంది.
ఇప్పటివరకు
ఆయన
6సార్లు
డిప్యూటీ
సీఎంగా
పనిచేశారు.
అజిత్
పవార్కు
భార్య
సునేత్రా
పవార్,
ఇద్దరు
కుమారులు
పార్థ
పవార్,
జై
పవార్
ఉన్నారు.
ప్రస్తుతం
సునేత్రా
పవార్
రాజ్యసభ
ఎంపీగా
ఉన్నారు.
పెద్ద
కుమారుడు
పార్థ
పవార్
2019
లోక్సభ
ఎన్నికల్లోనే
రాజకీయాల్లోకి
ఎంట్రీ
ఇచ్చారు.
అయితే,
ముఖ్యమంత్రి
అవ్వాలనే
అజిత్
పవార్
కోరిక
మాత్రం
నెరవేరలేదు.
విమాన
ప్రమాదంలో
అజిత్
పవార్
మరణం
ఇప్పుడు
ఆయన
అనుచరులకు
తీరని
విషాదంగా
మారింది.


