APCRDA: అమరావతిపై సీఆర్డీఏ కీలక నిర్ణయాలు..! క్వాంటం, ఆయుష్ సహా..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

అమరావతి
రాజధాని
నిర్మాణాన్ని
పరుగులు
తీయిచాలని
భావిస్తున్న
కూటమి
సర్కార్
ఆలోచనలకు
అనుగుణంగా
ఇవాళ
సీఆర్డీయే
అథారిటీ
పలు
కీలక
నిర్ణయాలు
తీసుకుంది.
సీఎం
చంద్రబాబు
అధ్యక్షతన
జరిగిన
సీఆర్డీయే
65వ
అధారిటీ
సమావేశంలో
మున్సిపల్
మంత్రి
నారాయణతో
పాటు
పలువురు
ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.

భేటీలో
మంత్రివర్గ
ఉపసంఘం
ఇప్పటికే
సమర్పించిన
పలు
ప్రతిపాదనకు
ఆమోద
ముద్ర
వేశారు.

అమరావతి
లో
క్వాంటం
వ్యాలీకి
సంబంధించిన
సామాగ్రి
కోసం
ఒక
ప్రత్యేక
భవనాన్ని
నిర్మించాలని
అధారిటీ
నిర్ణయం
తీసుకుంది.
సుమారు
43,000
చదరపు
అడుగుల
విస్తీర్ణంలో
103.96
కోట్ల
రూపాయల
అంచనా
వ్యయంతో
దీనికి
టెండర్లు
పిలిచి
ఎల్1ని
ఖరారు
చేశారు.

ప్రత్యేక
భవనం
రెండు
ఎకరాల
విస్తీర్ణంలో
టెక్నికల్
నిపుణుల
డిజైన్
ప్రకారం
నిర్మించనున్నారు.
దీంతో
పాటు
క్వాంటం
వ్యాలీలో
మరో
రెండు
భవనాల
నిర్మాణాన్ని
కూడా
వెంటనే
చేపట్టాలని
సీఎం
చంద్రబాబు
ఆదేశాలు
ఇచ్చారు.

అలాగే
ఐఏఎస్
ఆఫీసర్ల
బంగ్లాలకు
అంతర్గత
మౌలిక
సదుపాయాల
కల్పనకు
109.52కోట్లు
విడుదలకు
ఆమోదం
తెలిపారు.
కేంద్ర
ఆయుష్
మంత్రిత్వ
శాఖకు
ఆసుపత్రి,
యూనివర్సిటీ
కోసం
60
ఏళ్ల
పాటు
ఎకరం
రూపాయి
చొప్పున
లీజుకు
ఇవ్వాలని
నిర్ణయించారు.

ప్రాంతంలో
750
కోట్లతో
ఆయుష్
ఆధ్వర్యంలో
దీన్ని
ఏర్పాటు
చేస్తారు.
అమరావతిలో
వరద
నివారణకు
కొండవీటి
వాగు
,
పాలవాగు
,
గ్రావీటి
కెనాల్
తో
పాటు
ఆరు
రిజర్వాయర్
లు
ఇప్పటికే
ప్రతిపాదించారు.
వీటితో
పాటు
కొత్తగా
గుంటూరు
ఛానల్
ద్వారా
4వేల
క్యూసెక్కులు
బయటికి
పంపేలా
పంపింగ్
స్టేషన్
నిర్మించాలని
నిర్ణయించారు.

ఇప్పడున్న
పంపింగ్
సామర్ధ్యానికి
అధనంగా
మరో
8500క్యూసెక్కుల
సామర్ధ్యం
గల
పంపింగ్
స్టేషన్
ను
443
కోట్లతో
ఏర్పాటుకు
అధారిటీ
ఆమోదం
తెలిపింది.
ఎల్పీఎస్
జోన్
8లో
1351కోట్లతో
పనులకు
అథారిటీ
ఆమోదం
తెలిపింది.
జరీబు
,నాన్
జరీబు
భూముల
సమస్య
పరిష్కారానికి
జిల్లా
స్థాయి
అధికారుల
కమిటీ
ఏర్పాటుకు
కూడా
ఆమోదం
తెలిపారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related