Business
oi-Syed Ahmed
దేశవ్యాప్తంగా
నగదు
ప్రవాహాన్ని
నియంత్రించడానికి
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
పలు
చర్యలు
చేపడుతోంది.
ఇందులో
భాగంగా
అత్యధిక
విలువ
ఉన్న
నోట్లను
ఎప్పటికప్పుడు
సమీక్షిస్తూ
వాటి
ప్రవాహంలో
మార్పులు
చేర్పులు
చేస్తోంది.
అలాగే
కొత్త
నోట్ల
జారీ
విషయంలోనూ
ఆచితూచి
వ్యవహరిస్తోంది.
అయితే
తాజాగా
ఈ
ఏడాది
మార్చి
నుంచి
ఓ
నోట్లను
ఏటీఎంల
నుంచి
ఆర్బీఐ
తొలగించబోతున్నట్లు
విస్తృతంగా
ప్రచారం
జరుగుతోంది.
దీనిపై
ఇవాళ
రిజర్వ్
బ్యాంక్
స్పష్టత
ఇచ్చింది.
దేశంలో
గతంలో
మోడీ
సర్కార్
చేసిన
నోట్ల
రద్దు
తర్వాత
రద్దు
చేసిన
500
నోట్ల
స్ధానంలో
కొత్త
నోట్లను
తీసుకుని
వచ్చారు.
అయితే
వీటితో
పాటు
అమల్లోకి
తెచ్చిన
2
వేల
రూపాయల
నోట్లు
ప్రస్తుతం
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఈ
నేపథ్యంలో
500
నోట్లను
కూడా
రద్దు
చేసి
ఏటీఎంల
నుంచి
ఆర్బీఐ
తొలగించబోతున్నట్లు
ప్రచారం
జరుగుతోంది.
దీనిపై
ఆర్బీఐ
క్లారిటీ
ఇవ్వకపోవడంతో
మార్చి
నుంచి
500
నోట్లు
ఏటీఎంల
నుంచి
మాయం
కావడం
ఖాయమని
అంతా
భావిస్తున్నారు.
RBI
to
stop
₹500
notes
from
ATMs
by
March
2026❓🤔Some
social
media
posts
claim
that
the
Reserve
Bank
of
India
will
discontinue
the
circulation
of
₹500
notes
by
March
2026.#PIBFactCheck:❌This
claim
is
#fake!✅
@RBI
has
made
NO
such
announcement.✅
₹500
notes
have…
pic.twitter.com/F0Y3t0wHSf—
PIB
Fact
Check
(@PIBFactCheck)
January
2,
2026
ఈ
నేపథ్యంలో
రిజర్వ్
బ్యాంక్
ఇవాళ
ఎక్స్
లో
ఫ్యాక్ట్
చెక్
ద్వారా
500
నోట్ల
రద్దుపై
స్పష్టత
ఇచ్చింది.
ఈ
ఏడాది
మార్చి
కల్లా
ఏటీఎంల
నుంచి
500
నోట్లు
తీసేస్తారంటూ
జరుగుతున్న
ప్రచారంలో
వాస్తవం
లేదని
ఇందులో
తేల్చిచెప్పేసింది.
తాము
ఇప్పటివరకూ
దీనిపై
ఎలాంటి
ప్రకటనా
చేయలేదని
తెలిపింది.
500
నోట్లు
రద్దు
కావడం
లేదని,
భవిష్యత్తులోనూ
అవి
కొనసాగుతాయని
తెలిపింది.
500
నోట్ల
రద్దుపై
జరుగుతున్న
ప్రచారాన్ని
నమ్మవద్దని,
ఎప్పుడైనా
అధికారిక
హ్యాండిల్స్
ద్వారా
ఇచ్చే
సమాచారాన్ని
మాత్రమే
విశ్వసించాలని
ఆర్బీఐ
కోరింది.


