Chandu Tilaru

31 POSTS

Exclusive articles:

కార్తీకమాసం వేళ ఏపీఆర్టీసీ గుడ్‌న్యూస్‌… విజ‌య‌వాడ నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులు..

<!-- --> రేప‌టి నుంచి కార్తీక‌మాసం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఏపీఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు ఓ శుభవార్తను అందించింది. విజయవాడ నుంచి ప‌లు పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేందుకు ఆర్‌టిసి ప‌లు ప్ర‌త్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే వీటిని ప్ర‌యాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి పూర్తి వివ‌రాల‌ను చూసేద్దాం.. అతి త‌క్కువ ధ‌ర‌కే.. పవిత్ర కార్తీక మాసం సంద‌ర్భంగా విజయవాడ నుండి ప్రత్యేక బస్సులు న‌డిపేందుకు ఏపీఎస్ఆర్‌టిసీ నిర్ణ‌యించింది. త్రిలింగ దర్శిని ప్యాకేజీలో భాగంగా ఏపీలోని యాగంటి, మహానంది, శ్రీశైలం శైవ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఇందుకోసం సూపర్ లగ్జరీ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రతి కార్తిక శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటుంది.‌ ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. పౌర్ణ‌మి సంద‌ర్భంగా.. వీటితోపాటు అరుణాచలం, గిరి ప్రదక్షిణకు కూడా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుక‌రానున్నారు. ఇందులో భాగంగానే సూపర్ లగ్జరీ సర్వీసులు నడపనున్నారు. అరుణాచలం, గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రెండు రోజుల ముందుగా విజయవాడ నుంచి ఈ ప్యాకేజీ ప్ర‌యాణికుల కోసం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌లో శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకోవ‌చ్చు. పౌర్ణమికి అరుణాచలం చేరి గిరి ప్రదక్షిణ అనంతరం విజయవాడ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క‌రికి టిక్కెట్ ధర రూ.2,500గా నిర్ణయించారు. విజయవాడ నుండి పంచారామాల ద‌ర్శనాలు.. ఇందులో భాగంగానే విజ‌య‌వాడ నుంచి పంచారామాల‌కు కూడా స్పెష‌ల్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు కార్తీక మాసంలో ప్రతి శ‌నివారం, ఆదివారం, సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్ర‌యాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. నవంబర్ 2, 3, 4, 9, 10, 11, 15, 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ఈ స్పెష‌ల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం‌ 4 గంటలకు విజయవాడ నుండి పంచారామాల‌కు స్పెష‌ల్ బ‌స్సులు బ‌యలుదేరుతాయి....

తిరుమల వెళ్లే భ‌క్తులకు అల‌ర్ట్‌.. రేపు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు..

<!-- --> క‌ళియుగ వైకుంఠ దైవ‌మైన తిరుమల స్వామివారిని ద‌ర్శించుకునేందుకు నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. సాధార‌ణ రోజుల్లోనే ఇక్క‌డ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. ఇక‌, పండుగ‌లు, ఉత్స‌వాలు, పూజ కార్య‌క్ర‌మాల వంటి స‌మ‌యంలో భ‌క్తుల ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్వామివారి ద‌ర్శ‌నానికి క్యూలైన్లో కూడా బారులు తీరుతారు. తిరుమ‌ల వెళ్లే భక్తుల‌కు ఆల‌య అధికారులు అల‌ర్ట్ జారీ చేశారు. రేపు దీపావ‌ళి పండుగ‌ల సంద‌ర్భంగా పలు ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు 'దీపావళి ఆస్థానాన్ని' నిర్వహించనున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటననను కూడా జారీ చేసింది. రేపు దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానాన్ని ఉదయం 7 గంట‌ల నుండి ఉదయం 9 గంటల వరకు నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుపుతున్నట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు. సహస్ర దీపాలంకరణ ‌సేవ‌.. దీపావ‌ళి ఆస్థానంలో భాగంగా ఆల‌యంలోని శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేయ‌నున్నారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేయనున్న‌ట్లు టీటీడీ తెలిపింది. ఆ త‌ర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించ‌నున్నారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. వీటితోపాటు సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొనున్న‌ట్లు తెలిపారు. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఆ ద‌ర్శ‌నాలు ర‌ద్దు.. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి 30వ తేదీ తిరుమలలో సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గ‌మ‌నంలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు ఆల‌య అధికారులు కోరారు. ...

దీపావ‌ళి, ఛ‌త్ పండుగ‌ల సంద‌ర్భంగా ఏపీ మీదుగా ప్ర‌త్యేక రైళ్లు..

<!-- --> ఏపీలోని రైలు ప్ర‌యాణికులకు రైల్వేశాఖ ఓ గుడ్‌న్యూస్ అందించింది. దీపావళితో పాటూ ఛ‌త్ వంటి పండుగల సంద‌ర్భంగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపేందుకు సిద్ధ‌మ‌య్యింది. పండుగ‌ల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ టు దానాపూర్ టు విశాఖ మధ్య ప‌లు స్పెష‌ల్ ట్రైన్స్‌, విశాఖ-భువనేశ్వర్‌-విశాఖ మధ్య అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు నడుపుతున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు తూర్పు కోస్తా రైల్వే ఓ ప్ర‌క‌ట‌న‌ను కూడా జారీ చేసింది. ఆ ట్రైన్ల వివ‌రాల‌ను ఓ సారి చూసేద్దాం. విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ .. వ‌చ్చే (నవంబరు) నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు 08520 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్ ట్రైన్ విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో నవంబరు 5వ తేదిన మధ్యాహ్నం 12.30 గంటలకు దానాపూర్ టు విశాఖ (08519) స్పెష‌ల్ ట్రైన్‌ దానాపూర్‌లో బయలుదేరుతోంది. ఆ మ‌రుస‌టి రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు విశాఖ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఇక‌, ఈ ట్రైన్‌లో 3 థర్డ్‌ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్, 2 సెకండ్‌ క్లాస్‌ కమ్‌ దివ్యాంగజన్‌ బోగీలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం టు భువనేశ్వర్.. 08536 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం టు భువనేశ్వర్ అన్‌రిజర్వుడ్ స్పెష‌ల్ ట్రైన్ నవంబరు 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. అదే రోజు రాత్రి 7.45గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08535 అనే నెంబ‌ర్‌గ‌ల భువనేశ్వర్ టు విశాఖపట్నం అన్‌రిజర్వుడ్ స్పెష‌ల్ ట్రైన్ నవంబరు 15వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 10.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతోంది. మ‌రుస‌టి రోజు ఉదయం 8.45 గంటలకు విశాఖపట్నం స్టేష‌న్‌కు వస్తుంది. ఈ ట్రైన్‌లో 10 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్, 1 దివ్యాంగజన్, 1 మోటార్‌ కార్‌ బోగీలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. 26 స్పెష‌ల్ ట్రైన్స్‌.. దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్ర‌యాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కాచిగూడ టు నిజాముద్దీన్‌‌‌‌, నాందేడ్‌‌‌‌ -పానిపట్‌‌‌‌, నాందేడ్‌‌‌‌-పాట్నా, ఛాప్రా-యశ్వంత్‌‌‌‌పూర్‌‌‌‌, చెన్నైటు అంబాలా కంటోన్మెంట్‌‌‌‌ మార్గాల్లో దీపావళి పండుగ స్పెష‌ల్ ట్రైన్స్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లతో పాటుగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా అధికారులు నియమించారు....

శ‌బ‌రిమ‌ల వెళ్లేవారికి శుభ‌వార్త‌… నంద్యాల మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్లు..

<!-- --> శ‌బ‌రిమ‌ల వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తులకు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త‌ను అందించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించింది. అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు త‌ర‌లి వెళ్తుంటారు. అయితే, చాలామంది శబరిమల వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలపై ఆధార‌ప‌డుతున్నారు. ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో భ‌క్తుల నుంచి శ‌బ‌రిమ‌ల‌కు సరైన రవాణా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌పై తాజాగా రైల్వే శాఖ కీలకమైన‌ ప్రకటనను జారీ చేసింది. 4 స్పెష‌ల్ ట్రైన్స్‌.. నంద్యాల జిల్లాలో దీక్ష చేస్తున్న అయ్యప్ప భక్తులంద‌రికీ రైల్వే శాఖ ఓ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింద‌ని, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప దీక్షా భక్తుల సౌకర్యార్థం, నంద్యాల మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. వారి డిమాండ్ మేర‌కు స్పెష‌ల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె వివ‌రించారు. ఇక‌, ఈ స్పెష‌ల్ ట్రైన్స్ నవంబర్ మొదటి వారం నుంచి నంద్యాల మీదుగా శబరిమలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఈ ట్రైన్స్‌తో పాటు భారత్ గౌరవ్ పేరుతో శబరిమలకు రైల్వే శాఖ మ‌రో స్పెష‌ల్ ట్రైన్‌ను నడుపుతోంది. ఇందులో మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ ప్ర‌త్యేక రైలు నవంబర్ 16వ తేదిన సికింద్రాబాద్‌లో బయలుదేరుతోంది. ఈ ట్రైన్ పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుకుంటుంద‌ని అధికారులు తెలిపారు. తిరిగి ఈ ట్రైన్ వ‌చ్చే నెల 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది. స్పెష‌ల్ ట్రైన్స్ పూర్తి వివ‌రాలు.. ఈ ట్రైన్‌లో టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమా అన్నీ వ‌ర్తిస్తాయి. ఇక‌, వీటి టికెట్ ధరల విష‌యానికొస్తే.. ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475 చెల్లించాల్సి ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో అయితే, రూ.18,790 చెల్లించాలి. సెకెండ్ ఏసీలో రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. శ‌బ‌రిమ‌ల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉన్న‌ట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు స్పెష‌ల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమల‌ను ద‌ర్శించుకునేందుకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల చివ‌రి వారం నుంచి డిసెంబర్, జనవరి నెలలో ప‌లు ప్ర‌త్యేక ట్రైన్స్‌ను నడిపే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ...

విజ‌య‌వాడ టు శ్రీ‌శైలం మ‌ధ్య సీ ప్లేన్ స‌ర్వీసులకు ముహుర్తం ఖ‌రారు..

<!-- --> విజయవాడ వాసులు ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న సీ ప్లేన్ సర్వీసులకు ఎట్ట‌కేల‌కు ముహుర్తం ఖరారైంది. ఇందులో భాగంగానే కృష్ణాన‌దిలో సీ ప్లేన్ స‌ర్వీసులు అతి త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరంలో సీ ప్లేన్‌ సర్వీసుల్ని ప్రారంభిస్తున్న‌ట్లు గ‌తంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించ‌నుంది. 2019లోనే.. కేంద్ర ప్రభుత్వం గ‌తంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు అనుమతులిచ్చింది. అయితే, అవి కార్య‌రూపం దాల్చలేదు. తాజాగా వీటి అమ‌లుకు ఏపీ ప్ర‌భుత్వం ముహుర్తం ఖారురు చేసింది. డిసెంబ‌ర్ 9వ తేది నుంచి కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2019లోనే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్ప‌డు సీప్లేన్ సర్వీసుల్ని ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏపీ టూరిజం శాఖ సిద్ధ‌మైంది. డిసెంబ‌ర్ 9న ప్రారంభం.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మ‌రో సారి ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్రకాశం బ్యారేజీలో మళ్లీ సీ ప్లేన్‌ అంశం బ‌య‌టికొచ్చింది. విజయవాడ నుంచి శ్రీశైలం క్షేత్రానికి తొలి సీప్లేన్ స‌ర్వీసుల‌ను తీసుకరానున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 9వ తేది నుంచి ఈ స‌ర్వీసులను ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఈ సర్వీసులను విస్తరించనున్న‌ట్లు స‌మాచారం. ప్రకాశం బ్యారేజీ ఎగువున విస్తరించిన కృష్ణా జలాల్లో సీ ప్లేన్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వాటర్‌ ఏరోడ్రమ్ ఏర్పాటు.....

Breaking

spot_imgspot_img