. . .

ఇంద్ర‌కీలాద్రీపై ముగిసిన న‌వరాత్రి ఉత్స‌వాలు.. హుండీకీ భారీ ఆదాయం..

<!-- --> ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం ఒక‌టి. ఇక్క‌డ ద‌స‌రా ఉత్స‌వాలు ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. అయితే, ఇంద్ర‌కీలాద్రీపై ద‌స‌రా ఉత్స‌వాలు ముగిసాయి. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా చివ‌రి రెండురోజులు క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. శుక్ర‌వారం అమ్మ‌వారి ఆల‌య హుండీకి భారీ ఆదాయం స‌మ‌కూరింది. ఒక్క‌రోజే అమ్మ‌వారి హుండీకి భారీ ఆదాయం స‌మ‌కూరినట్లు ఆల‌య అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.84లక్షలకుపైగా ఆదాయం వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. దర్శన టికెట్లు, లడ్డూల విక్రయం, సేవల టికెట్లు కలిపి ఈ ఆదాయం వచ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ఒక్క‌రోజే ఏకంగా.. ఒక్క‌రోజే ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చిన‌ట్లు వివ‌రించారు. అలాగే 1,847 మంది భ‌క్తులు రూ. 300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100 ఆదాయం స‌మ‌కూరింది. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన భ‌క్తులు 4,686 మంది దర్శించుకున్నారు. రూ. 100 టిక్కెట్ కొనుగోలుతో రూ. 46, 86,000 ఆదాయం సమకూరినట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు. అలాగే, మొత్తం 26,584 లడ్డూలను విక్రయించారు. ఇవి మొత్తం రూ.3,98,760 ఆదాయం స‌మ‌కూరింది. రూ.100 చొప్పున మొత్తం ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 ఆదాయం సమకూరిన‌ట్లు తెలిపారు. అయితే ఆలయంలో మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించిన‌ట్లు అధికారులు వివ‌రించారు. మొక్కుల రూపంలో.. వీటితో పాటు అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు ప‌రోక్ష ప్ర‌త్యేక కుంకుమార్చ‌నుకు రూ. 3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేయ‌గా, రూ.54వేల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. ఇక‌, ప‌రోక్ష ప్ర‌త్యేక చండీ హోమానికి నాలుగువేల రూపాయ‌ల టిక్కెట్ల‌ను ఏడుగురు కోనుగోలు చేశారు. దీనికి మొత్తం రూ. 28వేల ఆదాయం స‌మ‌కూరింది. వీటితోపాటు శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు భ‌క్తులు కొనుగోలు చేశారు. వీటికి రూ.6వేలు ఆదాయం సమకూరింది. అమ్మ‌వారి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల్లో భాగంగా ప‌బ్లికేష‌న్లు, ఫొటోలు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230 ఆదాయం అందింది. మిగిలిన ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్‌ ద్వారా వ‌చ్చింది. ఆల‌యానికి వ‌చ్చిన 9,536 మంది భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కుల రూపంలో త‌ల‌నీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం వచ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ...

దేశంలోనే అత్యంత నెమ్మ‌దిగా న‌డిచే ఈ రైలు ప్ర‌త్యేక‌త‌లెన్నో..!

<!-- --> భారతీయ రైల్వే అంటే.. వేగానికి చిరునామాగా మారుతున్న రోజులివి. వందేభార‌త్ త‌ర‌హాలో ప‌ట్టాల‌పై వేగంగా ప‌రుగులు తీసే.. హైస్పీడ్ రైళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా భార‌త్ ప్ర‌పంచ‌ఖ్యాతి పొందేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది. అత్యాధునిక సాంకేతికతను మారుపేరుగా చెప్పుకునే మ‌న‌దేశంలో అతి త‌క్కువ వేగంతో ప్ర‌యాణించే రైళ్లు కూడా ఉన్నాయంటే కాస్త ఆశ్చ‌ర్యంగా ఉండొచ్చు. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. కేవ‌లం 46 కిలోమీట‌ర్ల దూరం చేరుకునేందుకు ఐదు గంట‌ల స‌మ‌యం ప‌ట్టే రైలు మ‌న దేశంలోనే ఉంది. అది కూడా నేటికీ ప‌రుగులు పెడుతూనే ఉంది. అంతేకాదు, నిత్యం సంద‌ర్శ‌కుల‌తో ర‌ద్దిగా ద‌ర్శ‌న‌మిస్తోన్న ఆ రైలు ప్ర‌త్యేక‌త‌ల‌తోపాటు దాని ప్రాముఖ్య‌త‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం రండి! దేశంలోనే అత్యంత నెమ్మ‌దిగా ప్ర‌యాణం చేసే రైలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడులోని నీలగిరి మార్గంలో ఉంది. ఈ రైలు మార్గం అక్క‌డి మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు ప‌రుగులు తీస్తోంది. నిత్యం ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌కులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి ఈ మార్గంలో ప్ర‌యాణం అంటే.. జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వ‌మ‌నే చెప్పాలి. అంతేకాదు, ఆసియా ఖండంలోనే ర్యాక్, పినియన్ ట్రాక్స్‌పై న‌డుస్తోన్న ఒకే ఒక్క రైలు ఇదే అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. 125 సంవత్సరాలుగా ప్ర‌యాణం.. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ రైలు మార్గంలో 16 సొరంగాలతోపాటు ఏకంగా 250 వంతెనలను దాటుకుంటూ ముందుకు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. నిజానికి, ఈ మార్గానికి చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. పూర్వం బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలించిన సమయంలో ఎద్దుల బండిపై ఊటీకి ప్ర‌యాణం చేసేవాళ్లు. అక్క‌డి ప్ర‌శాంత‌మైన‌ వాతావ‌ర‌ణానికి ముగ్ధులైన వారు ప్ర‌యాణ‌పు ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు 1890లో కూనూరు వరకు ర్యాక్, పినియన్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అలా ఆవిరితో నడిచే రైలులో మొద‌లైన ప్ర‌యాణం 125 సంవత్సరాలుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. పొగ‌లు కక్కుతూ దూసుకుపోయే ఈ రైలు ప్ర‌యాణం ఓ స‌రికొత్త అనుభూతిని చేరువ చేస్తుంద‌నే చెప్పాలి. ...

భార‌త‌దేశంలోని తొలి, అతిపురాత‌న‌మైన‌ దుర్గామాతా ఆల‌యం ఎక్క‌డ ఉందో తెలుసా…?

<!-- --> భార‌త‌దేశంలో ఎన్నో ప్రత్యేక ఆలయాలు, పురాత‌న క‌ట్ట‌డాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన, పురాత‌న‌మైన దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లోనే అతి పురాతనమైన అలాడే, దేశంలోని తొలి దుర్గ‌మాతా ఆల‌యం బీహార్ రాష్ట్రంలోనే ఉంది. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆల‌య ద‌ర్శ‌నం చేసుకోవాల్సిందే. రండి ఈ ఆల‌య విశిష్ట‌త‌లేంటో తెలుసుకుందాం ప‌దండి. క్రీ.శ. 105 లో నిర్మించిన ఆల‌యం.. రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారులు చెబుతున్నారు. బీహార్‌లోని ఈ ఆల‌యం వెయ్యేళ్ల కాలం నాటి పురాత‌న ఆల‌యంగా చెబుతున్నారు. అత్యంత‌ పురాతన చరిత్ర కలిగిన ఆలయ ఇది. ఈ ఆల‌యం పేరు ముండేశ్వరి దుర్గామాత ఆలయం. ఈ ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఒక‌టిగా ఈ ఆల‌యం పేరుగాంచింది. దీనిని ముండేశ్వ‌రి దేవాల‌యం అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇదే అని చరిత్ర‌కారులు చెబుతున్నారు. వార‌ణాసి స‌మీపంలో ఆల‌యం.. ఈ ఆల‌యంలో శివుని విగ్ర‌హం కొలువై ఉంది. ఈ విగ్ర‌హాన్ని ఏడో శతాబ్దంలో పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి సుమారు 608 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ స‌మీపంలో 625 సంవత్సరం నాటి శాసనాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేశంలోని అత్య‌ధిక పూజాదికాలు నిర్వహించే అతి పురాతన ఆలయాలలో దీనిని ప్ర‌థ‌మంగా చెప్పొచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇదేన‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వ‌రి ఆల‌యం అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆల‌యంలోని దుర్గాదేవి వైష్ణవి మాతా రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా భ‌క్తుల‌కు కనిపిస్తోంది. ...

ఇంద్ర‌కీలాద్రీపై నేడు మహిషాసురమర్దని అలంక‌ర‌ణ‌లో అమ్మ‌వారు..

As part of the Dussehra Navratri festival, Amma who lit up the Indrakiladri will give darshan to the devotees in the decoration of Mahishasura...

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. హైదరాబాద్ టు కడప మధ్య ఫ్లైట్ స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం..

<!-- --> ప్ర‌యాణికుల‌కు ఇండిగో విమాన‌సంస్థ ఓ శుభ‌వార్త‌ను అందించింది. హైద‌రాబాద్ టు క‌డ‌ప మ‌ధ్య విమాన స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కడప ఎయిర్‌పోర్ట్ ఓ కీల‌క ప్రకటన విడుదల కూడా చేసింది. విమాన సర్వీసును మళ్లీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇండిగో వెల్ల‌డించింది. హైద‌రాబాద్ టు క‌డ‌ప మ‌ధ్య విమాన సర్వీసు పునరుద్ధరణ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న.. హైదరాబాద్ నుంచి కడప మధ్య విమాన రాకపోకలు పునః ప్రారంభం కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కడప ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్ల‌డించారు. ఇక‌, ఇక్క‌డి నుండి ప్రతిరోజూ ఇండిగో సర్వీసులు నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ రూట్‌లో సర్వీసులు మళ్లీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఇండిగో సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల (అక్టోబర్) 27వ తేది నుంచి ఈ రూట్‌లో సర్వీసులు ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 27న‌.. 6ఈ 7096 విమానం అక్టోబర్ 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభ‌మవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు కడప విమానాశ్ర‌యానికి చేరుకుంటుంది. ప్రతీరోజు ఇదే సమయానికి ప్ర‌యాణికుల‌కు విమానం అందుబాటులో ఉండనుంది. 6ఈ 7097 విమానం తిరుగు ప్ర‌యాణంలో అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు కడపలో బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు కూడా ప్రతిరోజూ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండనుంది. 74 దేశీయ గమ్యస్థానాలు.. ఇండిగో నిత్యం కొత్త మార్గాలను అనుసంధానించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నుండి కడప విమాన స‌ర్వీసులు.. ప్రస్తుతం, ఇండిగో హైదరాబాద్ నుండి కడప విమానాలతో సహా 74 దేశీయ గమ్యస్థానాలకు త‌న సర్వీసులను అందిస్తోంది. హైదరాబాద్ నుండి కడప వెళ్లాల‌నుకునేవారు లేదంటే కడప నుండి హైదరాబాద్ చేరుకోవాల‌నుకునేవారు విమానాల టికెట్లను నేరుగా వెబ్‌సైట్ లో బుక్ చేసుకోగ‌ల‌రు. లేదంటే ఇండిగో మొబైల్ యాప్ నుండి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చ‌ని ఇండిగో ప్రకటించింది.ఈ సంద‌ర్బంగా మిగతా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసు వివరాలను కూడా ఇండిగో సంస్థ పేర్కొంది....

Popular

Subscribe

spot_imgspot_img