India-US Trade Deal: వ్యవసాయంపై తలవంచని భారత్, ట్రేడ్ డీల్‌పై క్లారిటీ

Date:


India

oi-Lingareddy Gajjala

భారత్-అమెరికా
మధ్య
వాణిజ్య
ఒప్పందంపై
(India-US
Trade
Deal)
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
చేసిన
ప్రకటన
దేశవ్యాప్తంగా
చర్చకు
దారి
తీసింది.
భారత్
అమెరికా
ఉత్పత్తులను
భారీగా
కొనుగోలు
చేయడానికి
అంగీకరించిందని
ట్రంప్
వెల్లడించడంతో,
వ్యవసాయం,
ఇంధనం,
సుంకాలపై
అనేక
సందేహాలు
తలెత్తాయి.

నేపథ్యంలో
భారత
ప్రభుత్వ
వర్గాలు
రంగంలోకి
దిగాయి.
రైతుల
ప్రయోజనాల
విషయంలో
ఎలాంటి
రాజీ
ఉండదని
స్పష్టమైన
సంకేతాలు
ఇచ్చాయి.

అమెరికా
నుంచి
దిగుమతి
అయ్యే
వ్యవసాయ,
పాడి
ఉత్పత్తులపై
సుంకాలను
తగ్గించేందుకు
భారత్
గతం
నుంచే
అంగీకరించలేదని,
ఇప్పటికీ
అదే
నిర్ణయంపై
నిలబడి
ఉందని
ప్రభుత్వ
వర్గాలు
పునరుద్ఘాటించాయి.

రంగాలు
అత్యంత
సున్నితమైనవని,
దేశీయ
రైతులను
దెబ్బతీసే
నిర్ణయాలు
ఎట్టి
పరిస్థితుల్లోనూ
తీసుకోబోమని
తేల్చిచెప్పాయి.

అమెరికా
వ్యవసాయ
ఉత్పత్తులే
అసలు
చిక్కు

అమెరికా
ప్రభుత్వం
తన
రైతులకు
భారీ
సబ్సిడీలు
అందిస్తుంది.
దీంతో
వారు
తమ
వ్యవసాయ
ఉత్పత్తులను
అంతర్జాతీయ
మార్కెట్
ధరల
కంటే
చాలా
తక్కువకు
ఎగుమతి
చేయగలుగుతున్నారు.
కొన్ని
సందర్భాల్లో
ఉత్పత్తి
ఖర్చుకంటే
కూడా
తక్కువ
ధరలకు
సరుకులు
విదేశాలకు
చేరుతున్నాయి.
ఇలాంటి
పరిస్థితుల్లో
భారత్
సుంకాలను
తగ్గిస్తే,
దేశీయ
రైతులు
తీవ్ర
నష్టాన్ని
ఎదుర్కొనే
ప్రమాదం
ఉందని
ప్రభుత్వం
భావిస్తోంది.
ట్రేడ్
డీల్
చర్చల్లో
ఇంతకాలంగా
ప్రతిష్టంభన
కొనసాగడానికి
ఇదే
ప్రధాన
కారణమని
వర్గాలు
వెల్లడించాయి.

వెనెజువెలా
చమురు
కొనుగోలుపై
స్పష్టత

ఇంధన
సరఫరా
అంశంలోనూ
ప్రభుత్వం
తన
వైఖరిని
వివరించింది.
అంతర్జాతీయ
ఆంక్షలు
అమల్లో
ఉన్నప్పుడు
వెనెజువెలా
నుంచి
భారత్
చమురు
కొనుగోలు
చేయలేదని,
ఇప్పుడు

ఆంక్షలు
ఎత్తివేయడంతో
మార్కెట్
ధరలకు
అనుగుణంగా
కొనుగోలు
చేసే
అవకాశం
ఉందని
తెలిపింది.
ఇంధన
దిగుమతుల
విషయంలో
దేశ
ప్రయోజనాలే
ప్రధానం
అని
స్పష్టం
చేసింది.
మూడు
రోజుల
క్రితం
డొనాల్డ్
ట్రంప్
కూడా
ఇదే
అంశాన్ని
ప్రస్తావిస్తూ,
ఇరాన్‌కు
బదులుగా
వెనెజువెలా
నుంచి
భారత్
చమురు
కొనుగోలు
చేసే
దిశగా
చర్చలు
జరిగాయని
వ్యాఖ్యానించారు.

ట్రంప్-మోదీ
చర్చల
తర్వాత
ప్రకటన

సోమవారం
ప్రధాని
నరేంద్ర
మోదీతో
టెలిఫోన్
సంభాషణ
అనంతరం
ట్రంప్

ట్రేడ్
డీల్
విషయాన్ని
బహిరంగంగా
ప్రకటించారు.
ఆయన
ప్రకారం,
భారత
ఉత్పత్తులపై
అమెరికా
విధిస్తున్న
25
శాతం
సుంకాలను
18
శాతానికి
తగ్గించనున్నారు.
అయితే,

వాణిజ్య
ఒప్పందం
గురించి
ప్రధాని
మోదీ
ప్రత్యక్షంగా
ప్రస్తావించలేదు.
సుంకాల
తగ్గింపును
మాత్రమే
ఆయన
ధ్రువీకరించారు.

ఆర్థికంగా
లాభం…
కానీ
కీలక
రక్షణలు
యథాతథం

ప్రభుత్వ
వర్గాల
అంచనా
ప్రకారం,

ఒప్పందం
ద్వైపాక్షిక
వాణిజ్యానికి
అనుకూల
వాతావరణాన్ని
సృష్టించనుంది.
రాబోయే
సంవత్సరాల్లో
భారత్-అమెరికా
వాణిజ్య
లక్ష్యం
అయిన
500
బిలియన్
డాలర్ల
స్థాయికి
చేరుకునే
అవకాశం
ఉందని
భావిస్తున్నాయి.
అయితే,
వ్యవసాయం,
పాడి
పరిశ్రమ
వంటి
కీలక
రంగాలకు
సంబంధించిన
రక్షణలపై
మాత్రం
ఎలాంటి
రాజీ
లేదని
స్పష్టంచేశాయి.

గత
ఏడాది
రష్యా
చమురు
కొనుగోళ్ల
అంశంపై
అమెరికా
విధించిన
భారీ
సుంకాలతో
భారత్-అమెరికా
సంబంధాలు
తీవ్ర
ఒత్తిడికి
లోనైన
నేపథ్యంలో,
తాజా
పరిణామాలు
వ్యూహాత్మకంగా
కీలకంగా
మారాయి.
దేశీయ
ప్రయోజనాలను
కాపాడుకుంటూనే,
అంతర్జాతీయ
వాణిజ్య
సంబంధాలను
బలోపేతం
చేయడమే
ప్రభుత్వ
లక్ష్యమని
వర్గాలు
స్పష్టం
చేస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Farmers cautioned as light rain and thunderstorms are likely across Andhra Pradesh till March 22

Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) Managing Director...

U.S. tech execs smuggled Nvidia chips to China, prosecutors say

NVIDIA AI Computing Card captured in Hangzhou, Zhejiang Province,...

Jeff Bezos reportedly wants $100 billion to buy and transform old manufacturing firms with AI

Jeff Bezos is reportedly seeking $100 billion for a...