India
oi-Syed Ahmed
మహారాష్ట్రలో
తాజాగా
జరిగిన
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
అధికార
మహాయుతి
కూటమి
క్లీన్
స్వీప్
చేసింది.
మొత్తం
29
మున్సిపల్
కార్పోరేషన్లలో
24
చోట్ల
గెలుపు
సాధిస్తోంది.
ఇందులో
ముంబైలోనూ
112
స్ధానాలతో
దుమ్మురేపింది.
ఈ
నేపథ్యంలో
మహారాష్ట్ర
స్థానిక
సంస్థల
ఎన్నికల
ఫలితాలపై
ప్రధాని
మోడీ
స్పందించారు.
బీజేపీ-శివసేన
కూటమి
సాధించిన
విజయంపై
ప్రధాని
మోడీ
తనదైన
శైలిలో
సాయంత్రం
ట్వీట్
చేశారు.
ముంబై,
మహారాష్ట్ర
స్ధానిక
సంస్థల
ఎన్నికలలో
భారీ
విజయం
నేపథ్యంలో
ప్రధాన
మంత్రి
నరేంద్ర
మోడీ
బిజెపి
నేతృత్వంలోని
మహాయుతి
కూటమిని
అభినందించారు.
ఎన్నికలకు
వెళ్ళిన
మహారాష్ట్రలోని
29
మునిసిపల్
కార్పొరేషన్లలో
బిజెపి-శివసేన
సంకీర్ణం
24
చోట్ల
ఆధిక్యంలో
ఉంది
లేదా
గెలుస్తోంది.
మరోవైపు
హోరాహోరీగా
పోరాడుతున్నట్లు
కనిపించిన
థాక్రే
సోదరులతో
పాటు
పవార్
కుటుంబం
కూడా
చతికిలపడ్డాయి.
ఇవాళ
సాయంత్రానికి
ఫలితాల
ట్రెండ్స్
క్లీన్
స్వీప్
ఖాయమని
తేల్చేయడంతో
ప్రధాని
మోడీ
ట్వీట్
చేశారు.
महाराष्ट्राचे
आभार
!राज्यातील
उत्साही
जनतेने
एनडीएच्या
जनहितकारी
आणि
सुशासनाच्या
अजेंड्याला
आपले
आशीर्वाद
दिले
आहेत!विविध
महानगरपालिका
निवडणुकांचे
निकाल
हे
दर्शवितात
की
महाराष्ट्रातील
जनतेशी
एनडीएचे
नाते
अधिक
दृढ
झाले
आहे.
आमच्या
कामगिरीचा
अनुभव
आणि
विकासाची
दृष्टी
जनतेच्या…—
Narendra
Modi
(@narendramodi)
January
16,
2026
ఇందులో
ప్రధాన
మంత్రి
మోడీ
“ధన్యవాదాలు,
మహారాష్ట్ర!
రాష్ట్రంలోని
ఉత్సాహభరితమైన
ప్రజలు
ఎన్డీయే
యొక్క
ప్రజా
సంక్షేమం,
సుపరిపాలన
ఎజెండాను
ఆశీర్వదించారు!
వివిధ
మునిసిపల్
కార్పొరేషన్
ఎన్నికల
ఫలితాలు
ఎన్డీయే,
మహారాష్ట్ర
ప్రజల
మధ్య
బంధం
మరింత
బలపడిందని
చూపిస్తున్నాయి.
మా
పనితీరు
అనుభవం,
అభివృద్ధి
దృక్పథం
ప్రజల
హృదయాలను
తాకింది.
మహారాష్ట్ర
ప్రజలందరికీ
నేను
హృదయపూర్వక
కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాను.
ఈ
తీర్పు
పురోగతికి
మరింత
ఊపునిస్తుంది
మరియు
రాష్ట్రంతో
అనుసంధానించబడిన
అద్భుతమైన
సంస్కృతికి
ఒక
వేడుక.”
అన్నారు.


