Nampally Fire Accident: అక్కడే ఐదు మృతదేహాలు, చివరికి ఇలా!

Date:


Telangana

oi-Lingareddy Gajjala

హైదరాబాద్
హృదయంలోని
నాంపల్లి
ప్రాంతంలో
జరిగిన
అగ్నిప్రమాదం
నగరాన్ని
ఒక్కసారిగా
విషాదంలోకి
నెట్టేసింది.
గంటల
తరబడి
కొనసాగిన
ఉత్కంఠ
చివరికి
కన్నీళ్లకే
దారి
తీసింది.
ఫర్నిచర్
షాప్
ఉన్న
భవనంలో
చిక్కుకున్న
ఐదుగురు
ప్రాణాలతో
బయటపడతారన్న
ఆశలు
నెమ్మదిగా
చల్లారిపోయాయి.
దాదాపు
22
గంటల
పాటు
నిరంతరంగా
సాగిన
సహాయక
చర్యల
అనంతరం
రెస్క్యూ
బృందాలు
ఐదు
మృతదేహాలను
వెలికితీయగా,
సంఘటనా
స్థలమంతా
విషాద
వాతావరణం
అలుముకుంది.

శనివారం
మధ్యాహ్నం
ప్రారంభమైన
రెస్క్యూ
ఆపరేషన్
ఆదివారం
ఉదయం
వరకూ
ఆగకుండా
కొనసాగింది.
భవనం
కింద
ఉన్న
సెల్లార్‌లో
మంటలు,
దట్టమైన
పొగ
కారణంగా
లోపలికి
వెళ్లడం
అత్యంత
ప్రమాదకరంగా
మారింది.
పరిస్థితి
అదుపు
తప్పడంతో
జేసీబీల
సాయంతో
సెల్లార్
గోడలకు
రంధ్రాలు
చేసి,
పొగను
బయటకు
పంపిన
తర్వాతే
రెస్క్యూ
సిబ్బంది
లోపలికి
ప్రవేశించగలిగారు.
ప్రాణాలకు
ముప్పు
ఉన్నప్పటికీ
సిబ్బంది
ఒక్క
అడుగు
వెనక్కి
వేయకుండా
విధులు
నిర్వహించారు.

నరకంగా
రెస్కూ
ఆపరేషన్..

ప్రమాద
భవనంలోని
సెల్లార్
రెస్క్యూ
బృందాలకు
నరకంగా
మారింది.
లోపల
భారీగా
నిల్వ
చేసిన
ఫర్నిచర్
కాలిపోవడంతో
వెలువడిన
పొగ
కారణంగా
అడుగు
ముందుకు
వేయలేని
పరిస్థితి
ఏర్పడింది.
ఆక్సిజన్
కొరత,
అధిక
ఉష్ణోగ్రతల
నడుమ
ప్రతి
క్షణం
సవాలుగా
మారింది.
చివరకు
ప్రత్యేక
ఏర్పాట్లతో
లోపలికి
చేరుకున్న
బృందాలు
మృతదేహాలను
వెలికితీశాయి.

భారీ
ఆపరేషన్‌లో
ఎన్‌డీఆర్‌ఎఫ్,
డీఆర్‌ఎఫ్,
హైడ్రా,
ఫైర్
సర్వీసులు
సహా
దాదాపు
200
మంది
సిబ్బంది
పాల్గొన్నారు.

మృతుల
వివరాలు..


ఘటనలో
మృతులు
ప్రణీత్,
అఖిల్,
బేబీ,
ఇంతియాజ్,
హబీబ్‌గా
అధికారులు
గుర్తించారు.
వెలికితీసిన
మృతదేహాలను
పోస్ట్‌మార్టం
కోసం
ఉస్మానియా
ఆసుపత్రికి
తరలించారు.
అధికారిక
ప్రకటన
కోసం
కుటుంబ
సభ్యులు,
బంధువులు
తీవ్ర
ఆవేదనతో
ఎదురుచూస్తున్నారు.
తమ
కుటుంబ
సభ్యుల
ఆచూకీ
కోసం
ఘటనాస్థలికి
చేరుకున్న
బాధితుల
కన్నీళ్లు
అక్కడి
పరిస్థితిని
మరింత
హృదయవిదారకంగా
మార్చాయి.
కొందరు
సహనం
కోల్పోయి
భవనం
లోపలికి
వెళ్లేందుకు
ప్రయత్నించగా,
పోలీసులు
వారికి
పరిస్థితి
తీవ్రతను
వివరించి
అదుపులోకి
తీసుకొచ్చారు.
సెల్లార్‌లో
నెలకొన్న
ప్రమాదకర
పరిస్థితులే
సహాయక
చర్యలకు
పెద్ద
అడ్డంకిగా
మారాయని
అధికారులు
తెలిపారు.

దెబ్బతిన్న
బిల్డింగ్..


అగ్నిప్రమాదం
భవనం
భద్రతపై
కూడా
అనేక
అనుమానాలను
రేకెత్తిస్తోంది.
మంటల
తీవ్రతతో
భవనం
దృఢత్వం
దెబ్బతిన్నట్లుగా
అధికారులు
భావిస్తున్నారు.

నేపథ్యంలో
బిల్డింగ్
ను
పరిశీలించేందుకు
జేఎన్టీయూ
ఇంజినీరింగ్
బృందాన్ని
రంగంలోకి
దింపేందుకు
నిర్ణయం
తీసుకున్నారు.
వారి
నివేదిక
ఆధారంగా
తదుపరి
చర్యలు
చేపట్టనున్నారు.

ప్రమాదానికి
కారణం..

ప్రాథమిక
విచారణలో
ప్రమాద
తీవ్రత
పెరగడానికి
ప్రధాన
కారణం
సెల్లార్‌లలో
భారీగా
ఫర్నిచర్
నిల్వ
చేయడమేనని
అధికారులు
భావిస్తున్నారు.
పార్కింగ్
కోసం
కేటాయించిన
సెల్లార్‌లను
నిబంధనలకు
విరుద్ధంగా
గోదాములుగా
మార్చినట్లు
గుర్తించారు.
మండే
స్వభావం
ఉన్న
ఫర్నిచర్
కారణంగా
మంటలు
వేగంగా
వ్యాపించి,
లోపల
ఉన్నవారు
బయటపడలేకపోయారని
తెలుస్తోంది.
ఇందుకు
అనుమతులు
ఉన్నాయా?
మంటలు
ఎలా
వ్యాపించాయి?
అనే
అంశాలపై
పోలీసులు
లోతుగా
దర్యాప్తు
చేస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related