India
oi-Lingareddy Gajjala
ప్రావిడెంట్
ఫండ్
(Provident
Fund)
కస్టమర్లకు
కేంద్రం
అదిరిపోయే
గుడ్
న్యూస్
చెప్పింది.
ఇప్పటి
వరకు
ఉన్న
ఇబ్బందులకు
స్వస్తిపలకాలని
భావించి
నేపథ్యంలో
కీలక
ముందడుగు
వేసింది.
పీఎఫ్
ఖాతాదారులు
కార్యాలయాల
చుట్టూ
తిరగాల్సిన
అవసరం
లేకుండా
కొత్త
సంవత్సరం
నుంచి
పని
విధానంలో
పెద్ద
మార్పులు
తీసుకురానుంది.
ప్రావిడెంట్
ఫండ్
(PF)
కస్టమర్లకు
కేంద్ర
ప్రభుత్వం
మరో
కీలక
శుభవార్త
అందించింది.
ఇప్పటికే
డిజిటలైజేషన్
ద్వారా
పీఎఫ్
సేవలను
సులభతరం
చేసిన
ప్రభుత్వం..
ఇప్పుడు
EPFO
కార్యాలయాల
పని
విధానంలోనే
పెద్ద
మార్పులు
తీసుకురానుంది.
పీఎఫ్
ఖాతాదారులు
తమ
సమస్యల
పరిష్కారం
కోసం
కచ్చితంగా
తమ
యజమాని
అనుబంధిత
ప్రాంతీయ
EPFO
కార్యాలయానికే
వెళ్లాల్సి
వచ్చేది.
అయితే
ఇప్పుడు
వాటి
పరిష్కారం
వైపు
అడుగులు
పడుతున్నాయి.
ఇకపై
EPFO
కార్యాలయాలు
పాస్పోర్ట్
సేవా
కేంద్రాల
(Passport
Seva
Kendra)
తరహాలో
పనిచేయనున్నాయి.
ఉద్యోగం
మారినప్పుడు
లేదా
వేరే
రాష్ట్రానికి
మారినప్పుడు
ఉద్యోగులకు
పీఎఫ్
సమస్యలు
ఎక్కువగా
ఉండేవి.
కొత్త
విధానం
అమలులోకి
వస్తే,
ఖాతాదారు
దేశంలోని
ఏ
EPFO
కార్యాలయానికైనా
వెళ్లి
తన
సమస్యను
పరిష్కరించుకోవచ్చు.
అన్ని
సేవలు
డిజిటల్
ప్లాట్ఫామ్
ద్వారా
అనుసంధానమవుతాయి.
దీంతో
క్లెయిమ్లు,
KYC
ధృవీకరణ,
ఖాతా
బదిలీ
వంటి
ప్రక్రియలు
వేగంగా
పూర్తవుతాయి.
సింగిల్
విండో
సర్వీస్
సెంటర్లు
ఈ
విధానానికి
సంబంధించిన
ట్రయల్
ఇప్పటికే
ఢిల్లీలో
ప్రారంభమైందని
కేంద్ర
కార్మిక,
ఉపాధి
శాఖ
మంత్రి
మన్సుఖ్
మాండవీయ
వెల్లడించారు.
దేశ
రాజధానిలో
EPFO
కొత్త
ప్రావిడెంట్
ఫండ్
భవన
ప్రారంభోత్సవం
సందర్భంగా
మాండవీయ
ఈ
ప్రకటన
చేశఆరు.
దేశవ్యాప్తంగా
ఉన్న
EPFO
కార్యాలయాలను
సింగిల్
విండో
సర్వీస్
సెంటర్లుగా
మార్చే
దిశగా
ప్రభుత్వం
అడుగులు
వేస్తోందని
ఆయన
స్పష్టం
చేశారు.
సర్వీస్
ప్రొవైడర్లను
నియామకం
డిజిటల్
విధానంతో
పని
చేయడంలో
ఇబ్బంది
పడే
ఉద్యోగుల
కోసం
ప్రభుత్వం
ప్రత్యేకంగా
EPF
సర్వీస్
ప్రొవైడర్లను
నియమించడానికి
సిద్ధమైంది.
వీరు
పీఎఫ్
ఖాతాదారులకు
గైడ్
చేస్తూ,
క్లెయిమ్
లు
అప్లై
చేసుకోవడం,
KYC
పూర్తి
చేయడంలో
సహాయం
చేస్తారు.
ఇకపై
ఏజెంట్లపై
ఆధారపడాల్సిన
అవసరం
లేకుండా,
అధికారికంగా
వీరే
ఈ
సేవలు
అందించనున్నారు.
విదేశాల్లో
ఉన్న
వారికి
దీనిద్వార
ఎంతో
మేలు
చేకూరుతుంది.
విదేశాల్లో
ఉద్యోగ
సమయంలో
కట్
అయిన
పీఎఫ్
డబ్బు
ఇక
కోల్పోయే
ప్రమాదం
ఉండదు.
వారు
భారత్కు
తిరిగివచ్చిన
తర్వాత
తమ
పీఎఫ్
మొత్తాన్ని
సులభంగా
విత్
డ్రా
చేసుకోవచ్చు.
KYC
సమస్యలకు
స్వస్తి..
చాలా
మంది
ఉద్యోగుల
పీఎఫ్
డబ్బు
KYC
సమస్యల
కారణంగా
సంవత్సరాల
తరబడి
నిలిచిపోయింది.
ఇప్పుడు
ప్రభుత్వం
మిషన్
మోడ్లో
KYC
ధృవీకరణ
చేపట్టనుంది.
అర్హులైన
ఖాతాదారులను
గుర్తించి,
వారి
డబ్బును
వారికి
లేదా
వారి
కుటుంబ
సభ్యులకు
అందజేయాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.
సింపుల్
గా
చెప్పాలంటే
EPFOలో
ఈ
మార్పులు
అమలులోకి
వస్తే
పీఎఫ్
ఖాతాదారులకు
సేవలు
మరింత
వేగంగా,
పారదర్శకంగా,
సులభంగా
అందే
అవకాశం
ఉంది.


